Madhyapradesh : దారుణం..స్కూటీని ఢీ కొట్టిన కారు..ఎనిమిదేళ్ల చిన్నారి మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేము.. అలాగే మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పడం కూడా కష్టమే.. రోడ్డు ప్రమాదాల పై ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలను తీసుకున్నా కూడా ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు.. తాజాగా మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగు చూసింది.. రోడ్డుపై నిలబడి ఉన్న స్కూటీని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ స్కూటీని కొంత దూరం అలాగే ఈడ్చుకెళ్లింది. ఈ స్కూటీపై తన తల్లిదండ్రులతో పాటు ఉన్న ఎనిమిదేళ్ల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి.. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది..
ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉండటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ప్రమాదం జరిగి పది రోజులు దాటినా.. పోలీసులు నిందితులను ఇంకా అదుపులోకి తీసుకోలేదు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు… ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కథనం ద్వారా ఈ ఘటన వెలుగు చూసింది.. రోడ్డు పక్కన పార్క్ చేసిన యాక్టివాను కారు ఈడ్చుకెళ్లింది. మధ్యప్రదేశ్ లోని మొరెనా జిల్లాకు చెందిన విక్రమ్ సింగ్ తన భార్య, ఎనిమిదేళ్ల కుమర్తె అథర్వతో కలిసి ఇటీవల పాత కంటోన్మెంట్ గ్వాలియర్ లో ఉన్న ఇంటికి వచ్చాడు. అయితే ఆయన తిరిగి తన ఇంటికి వెళ్తున్నాడు..
Also Read
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
అయితే, ఆ సమయంలో ఏదో పని నిమిత్తం రోడ్డు పక్కన స్కూటీని ఆపాడు. అయితే కొంత సమయంలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఆ స్కూటీని ఢీకొట్టింది. అనంతరం కొంత దూరంగా ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని స్థానికులు హాస్పిటల్ లో చేర్చారు. అథర్వకు తీవ్ర గాయాలు కావడంతో ఐసీయూలో చేర్చారు.. కానీ పరిస్థితి విషమించడంతో చిన్నారి మరణించింది.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!
-
PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం
-
Narendra Modi : సీఎం రేవంత్కు మోడీ కౌంటర్..
-
Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..
-
CM Revanth Reddy: గుజరాత్కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..