Nellore Crime: కుబేర మూవీ తరహాలో భారీ స్కామ్.. లబోదిబోమంటున్న బాధితులు..
- నెల్లూరులో కుబేరమూవీని తలపించేలా స్కామ్..
- ఎనిమిది నెలల క్రితంకేసుకు సంంధించిన విచారణ అప్డేట్..
- పరారీలో అసలు నిందితులు..
- అమాయకులకు బ్యాంకుల నుంచి నోటీసులు..
- పోలీసులకు 56 మంది పేర్లతో నోటీసులిచ్చిన బ్యాంక్ అధికారులు..
- తమ సిబ్బంది ప్రమేయంపై నోరు తెరవని బ్యాంక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore Crime: కుబేర సినిమా చూశారుగా .. సేమ్ అచ్చం అలానే స్క్రిప్ట్తో కోట్ల రూపాయలు కొట్టేశారు కొందరు నిందితులు. ఫేక్ సాఫ్ట్ వేర్ కంపెనీలు పెట్టి, అందులో అమాయకులను ఉద్యోగులుగాచూపించి, వారి పేరు మీద లక్షలు లోన్ తీసుకున్నారు. ఇప్పుడు వాటికి ఈఎంఐలు చెల్లించాలంటూ .. బాధితులకు నోటీసులు వస్తున్నాయి. అంతేనా.. ఏజెంట్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీంతో తమను రక్షించాలంటూ బాధితులు.. పోలీసులను వేడుకుంటున్నారు. ఈ కేసును ముత్తుకురు పోలీసులు విచారణ చేస్తుండగా.. లోన్ చెల్లించాలని బాధితులకు నోటీసులు వస్తుండడం వారిలో ఆందోళనకు కారణమవుతోంది. డబ్బులు రికవరీ చేయడానికి చెన్నైలోని ఓ ప్రయివేటు ఏజెన్సీతో బ్యాంకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బాధితులకు నోటీసుల మీద నోటీసులు అందుతున్నాయి. అయితేపోలీసులు మాత్రం కేసు విచారణలో ఉందంటున్నారు.
Read Also: Trump-Modi: రేపటి నుంచి ట్రంప్ కొత్త సుంకం అమలు.. భారత్ స్పందన ఇదే!
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
యాక్సెస్ బ్యాంకు కుంభకోణంలో సూత్రదారులు దర్జాగా తిరుగుతూ ఉంటే.. బాధితులు లబోదిబో అంటున్నారు. ఆన్లైన్ లోని లొసుగులను ఆసరాగా చేసుకుని నిందితులు ఈ భారీ స్కామ్ కి పాల్పడ్డారు. వ్యక్తులకూ సంబంధం లేకుండా నేరుగా.. ఆన్లైన్ ద్వారా లోన్స్ ఇవ్వొచ్చని RBI తీసుకొచ్చిన పాలసీని నిందితులు పక్కాగా ఉపయోగించుకుని స్కామ్ చేశారు. జాలే వాసుదేవ నాయుడు, అల్లాభక్షు మరో ఇద్దరు కలిసి ఫేక్ సాఫ్ట్వేర్ కంపెనీలు సృష్టించారు. అందులో అమాయక ప్రజల్ని ఉద్యోగులుగా చూపించి.. వారి ఆధార్ కార్డులతో ఆన్లైన్లో లోన్లు తీసుకున్నారు. ఒక్కో వ్యక్తి పేరుతో 14 లక్షల నుంచి 50 లక్షలు దాకా రుణాలు తీసుకున్నారు.
Read Also: Astrology: ఆగస్టు 26, మంగళవారం దినఫలాలు
అయితే, పోలీసులకు ఫిర్యాదు చేశాం కదా.. తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన బాధితులకు బ్యాంక్ అధికారులు ఝలక్ ఇచ్చారు. EMI లు చెల్లించాలంటూ నోటీసులు పంపిస్తున్నారు. తమకు ఏమాత్రమూ సంబంధం లేకుండా, తమవారి పేరుపై కోట్ల రూపాయలు కొల్లగొట్టారని అటు బ్యాంకు అధికారులుకు, ఇటు పోలీసులకు తెలిసినా.. తమకు న్యాయం జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. నెల్లూరు బ్యాంక్ అధికారులు 56 మంది జాబితాను పోలీసులకు ఇచ్చి వారు లోన్స్ కట్టడం లేదని పిర్యాదు చేశారు. విడవలూరుకు చెందిన చలంచర్ల లక్ష్మీనారాయణకు లోన్ రికవరీ ఏజెన్సీ నుంచి నోటీసులో వచ్చాయి. ఇప్పటి మూడు నోటీసులు జారీ చేశారు. యాక్సెస్ బ్యాంక్ లో రూ.14.90 లక్షలు రుణం తీసుకున్నారని, తిరిగి చెల్లించాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. జిల్లాలో ఉండే బాధితులందరికీ ఇలాంటి నోటీసులు అందుతున్నట్లు తెలుస్తోంది. యాక్సెస్ బ్యాంక్ తన సిబ్బంది పాత్రపై ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు..
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!