Tragedy: గురుగ్రామ్లో విషాదం.. సివిల్ ఇంజినీర్ నిర్లక్ష్యం లా విద్యార్థి ప్రాణం తీసింది
- దాబా దగ్గర వేచిచూస్తుండగా దుర్ఘటన
- నిద్రమత్తులో డ్రైవింగ్ చేసిన సివిల్ ఇంజినీర్ అరెస్ట్
- సీసీటీవీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్లో ఓ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఒక సివిల్ ఇంజినీర్ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా న్యాయ విద్యార్థి ప్రాణం కోల్పోయాడు. లీగల్ స్టూడెంట్ హర్ష్ తన స్నేహితుడు మోక్ష్తో కలిసి జూన్ 24న తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఢిల్లీ-జైపూర్ హైవే వద్ద ఉన్న చంచల్ దాబాకు వెళ్లాడు. అప్పటికే దాబా కిక్కిరిసిపోయిన కారణంగా వారు బయటే వేచి ఉండగా, మరో స్నేహితుడు అభిషేక్ కూడా అక్కడికి చేరాడు. ముగ్గురూ సర్వీస్ రోడ్ వద్ద రేలింగ్ పక్కన నిలబడి మాట్లాడుకుంటుండగా, ఓ కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టి అక్కడి నుంచి పరుగులు తీసింది.
Chennai Drugs Case : డ్రగ్స్ కేసులో పంజా సినిమా దర్శకుడి తమ్ముడుకి రిమాండ్
Also Read
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
ఈ ప్రమాదంలో హర్ష్తో పాటు అభిషేక్కు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించినా, హర్ష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన జరిగినప్పటికీ కారు ఆగకుండా పారిపోయింది. అయితే దానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న స్థానికులు వెంటపడగా, కొద్ది దూరంలో ఆ కారు రోడ్డు పక్కన నిలిపివేయబడి కనిపించింది. అయితే అందులో ఎవ్వరూ లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి, కారు నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని 31 ఏళ్ల మోహిత్గా గుర్తించారు. అతడు సివిల్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడని, విధులు ముగించుకుని తిరిగే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. అదే సమయంలో మోహిత్ నిద్రమత్తులో వాహనం నడుపుతున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఓ యువకుడి ప్రాణం తీసిన మోహిత్పై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు.
Puri Rath Yatra 2025: నేడే పూరీ జగన్నాథుని రథయాత్ర.. భారీగా భద్రతా ఏర్పాట్లు..
తాజావార్తలు
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
-
SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!