Tragedy: గురుగ్రామ్లో విషాదం.. సివిల్ ఇంజినీర్ నిర్లక్ష్యం లా విద్యార్థి ప్రాణం తీసింది
- దాబా దగ్గర వేచిచూస్తుండగా దుర్ఘటన
- నిద్రమత్తులో డ్రైవింగ్ చేసిన సివిల్ ఇంజినీర్ అరెస్ట్
- సీసీటీవీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్లో ఓ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఒక సివిల్ ఇంజినీర్ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా న్యాయ విద్యార్థి ప్రాణం కోల్పోయాడు. లీగల్ స్టూడెంట్ హర్ష్ తన స్నేహితుడు మోక్ష్తో కలిసి జూన్ 24న తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఢిల్లీ-జైపూర్ హైవే వద్ద ఉన్న చంచల్ దాబాకు వెళ్లాడు. అప్పటికే దాబా కిక్కిరిసిపోయిన కారణంగా వారు బయటే వేచి ఉండగా, మరో స్నేహితుడు అభిషేక్ కూడా అక్కడికి చేరాడు. ముగ్గురూ సర్వీస్ రోడ్ వద్ద రేలింగ్ పక్కన నిలబడి మాట్లాడుకుంటుండగా, ఓ కారు వేగంగా వచ్చి వారిని ఢీకొట్టి అక్కడి నుంచి పరుగులు తీసింది.
Chennai Drugs Case : డ్రగ్స్ కేసులో పంజా సినిమా దర్శకుడి తమ్ముడుకి రిమాండ్
Also Read
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
ఈ ప్రమాదంలో హర్ష్తో పాటు అభిషేక్కు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించినా, హర్ష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన జరిగినప్పటికీ కారు ఆగకుండా పారిపోయింది. అయితే దానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న స్థానికులు వెంటపడగా, కొద్ది దూరంలో ఆ కారు రోడ్డు పక్కన నిలిపివేయబడి కనిపించింది. అయితే అందులో ఎవ్వరూ లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి, కారు నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని 31 ఏళ్ల మోహిత్గా గుర్తించారు. అతడు సివిల్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడని, విధులు ముగించుకుని తిరిగే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. అదే సమయంలో మోహిత్ నిద్రమత్తులో వాహనం నడుపుతున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఓ యువకుడి ప్రాణం తీసిన మోహిత్పై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు.
Puri Rath Yatra 2025: నేడే పూరీ జగన్నాథుని రథయాత్ర.. భారీగా భద్రతా ఏర్పాట్లు..
తాజావార్తలు
-
Telangana : IFS అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.!
-
EV Push: ఢిల్లీలో సర్కార్ సంచలనం.. 2028 నుంచి పెట్రోల్ బైక్లపై కంప్లీట్ బ్యాన్!
-
శాకాహారులుగా మారిపోయాం!.. నభా నటేష్ సెన్సేషనల్ కామెంట్స్!
-
Arrears Release: బకాయిల క్లియరెన్స్.. తెలంగాణ ఉద్యోగులకు ఊరట!
-
Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!