Kidnap : హనుమకొండలో బాలుడి కిడ్నాప్.. 12 లక్షలు డిమాండ్.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
- డబ్బు కోసం మైనర్ బాలుడి కిడ్నాప్
- ముగ్గురు అరెస్ట్ చేసిన హనుమకొండ పోలీసులు
- కిడ్నాప్ ముఠా నుండి బాలుడిని సురక్షితంగా రక్షించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidnap : హనుమకొండలో మైనర్ బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసం ఓ మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసిన నలుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని హనుమకొండ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నిందితుల చెరలో ఉన్న బాలుడిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితుల్లో ప్రధాన అనుమానితురాలు పూరి పద్మ గతంలో బ్రాహ్మణవాడలోని క్యాటరింగ్ మాస్టర్ రమణ వద్ద కూలీగా పనిచేసింది. ఆర్థిక లావాదేవీలతో సంబంధించి గొడవల నేపథ్యంలో ఆమె గ్రామానికి వెళ్లిపోయింది. తనకు రావాల్సిన డబ్బుల కోసం రమణ బంధువైన మైనర్ బాలుడిని కిడ్నాప్ చేయాలని ఆమె పథకం రచించింది. దీనిలో ఆమె కుమారుడు రాజు, మరో బంధువు శ్రీకాంత్, స్నేహితురాలు జ్యోతి పాల్గొన్నారు.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
ఈ ముఠా బాలుడిని హనుమకొండలోని నయీమ్ నగర్ ప్రాంతంలో బలవంతంగా ఆటోలో ఎక్కించి అశ్వాపురం తీసుకెళ్లారు. బాలుడి తల్లి ద్వారా రమణను బెదిరించి రూ.12 లక్షలు డిమాండ్ చేశారు. బాలుడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దాచారు. కిడ్నాప్ సమయంలో బాలుడిని మానసికంగా హింసించారు కూడా.
ఈ నేపథ్యంలో ములుగు రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను గమనించిన నిందితులు పారిపోబోయారు. వెంటనే స్పందించిన పోలీసులు పద్మ, రాజు, జ్యోతిలను పట్టుకున్నారు. శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. బాలుడిని సురక్షితంగా రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఏసీపీ నరసింహారావు తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో హనుమకొండ పోలీసులు చూపిన తెలివితేటలపై ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్, ఎస్ఐ కిషోర్, AAO సల్మాన్ పాషా, ఇతర సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!