Kidnap : హనుమకొండలో బాలుడి కిడ్నాప్.. 12 లక్షలు డిమాండ్.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
- డబ్బు కోసం మైనర్ బాలుడి కిడ్నాప్
- ముగ్గురు అరెస్ట్ చేసిన హనుమకొండ పోలీసులు
- కిడ్నాప్ ముఠా నుండి బాలుడిని సురక్షితంగా రక్షించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidnap : హనుమకొండలో మైనర్ బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసం ఓ మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసిన నలుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని హనుమకొండ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నిందితుల చెరలో ఉన్న బాలుడిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితుల్లో ప్రధాన అనుమానితురాలు పూరి పద్మ గతంలో బ్రాహ్మణవాడలోని క్యాటరింగ్ మాస్టర్ రమణ వద్ద కూలీగా పనిచేసింది. ఆర్థిక లావాదేవీలతో సంబంధించి గొడవల నేపథ్యంలో ఆమె గ్రామానికి వెళ్లిపోయింది. తనకు రావాల్సిన డబ్బుల కోసం రమణ బంధువైన మైనర్ బాలుడిని కిడ్నాప్ చేయాలని ఆమె పథకం రచించింది. దీనిలో ఆమె కుమారుడు రాజు, మరో బంధువు శ్రీకాంత్, స్నేహితురాలు జ్యోతి పాల్గొన్నారు.
Also Read
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
ఈ ముఠా బాలుడిని హనుమకొండలోని నయీమ్ నగర్ ప్రాంతంలో బలవంతంగా ఆటోలో ఎక్కించి అశ్వాపురం తీసుకెళ్లారు. బాలుడి తల్లి ద్వారా రమణను బెదిరించి రూ.12 లక్షలు డిమాండ్ చేశారు. బాలుడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దాచారు. కిడ్నాప్ సమయంలో బాలుడిని మానసికంగా హింసించారు కూడా.
ఈ నేపథ్యంలో ములుగు రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను గమనించిన నిందితులు పారిపోబోయారు. వెంటనే స్పందించిన పోలీసులు పద్మ, రాజు, జ్యోతిలను పట్టుకున్నారు. శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. బాలుడిని సురక్షితంగా రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఏసీపీ నరసింహారావు తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో హనుమకొండ పోలీసులు చూపిన తెలివితేటలపై ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్, ఎస్ఐ కిషోర్, AAO సల్మాన్ పాషా, ఇతర సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
తాజావార్తలు
-
Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
-
Donald Trump: “ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
-
Joseph Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!