Kidnap : హనుమకొండలో బాలుడి కిడ్నాప్.. 12 లక్షలు డిమాండ్.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
- డబ్బు కోసం మైనర్ బాలుడి కిడ్నాప్
- ముగ్గురు అరెస్ట్ చేసిన హనుమకొండ పోలీసులు
- కిడ్నాప్ ముఠా నుండి బాలుడిని సురక్షితంగా రక్షించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidnap : హనుమకొండలో మైనర్ బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసం ఓ మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసిన నలుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని హనుమకొండ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నిందితుల చెరలో ఉన్న బాలుడిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితుల్లో ప్రధాన అనుమానితురాలు పూరి పద్మ గతంలో బ్రాహ్మణవాడలోని క్యాటరింగ్ మాస్టర్ రమణ వద్ద కూలీగా పనిచేసింది. ఆర్థిక లావాదేవీలతో సంబంధించి గొడవల నేపథ్యంలో ఆమె గ్రామానికి వెళ్లిపోయింది. తనకు రావాల్సిన డబ్బుల కోసం రమణ బంధువైన మైనర్ బాలుడిని కిడ్నాప్ చేయాలని ఆమె పథకం రచించింది. దీనిలో ఆమె కుమారుడు రాజు, మరో బంధువు శ్రీకాంత్, స్నేహితురాలు జ్యోతి పాల్గొన్నారు.
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
ఈ ముఠా బాలుడిని హనుమకొండలోని నయీమ్ నగర్ ప్రాంతంలో బలవంతంగా ఆటోలో ఎక్కించి అశ్వాపురం తీసుకెళ్లారు. బాలుడి తల్లి ద్వారా రమణను బెదిరించి రూ.12 లక్షలు డిమాండ్ చేశారు. బాలుడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దాచారు. కిడ్నాప్ సమయంలో బాలుడిని మానసికంగా హింసించారు కూడా.
ఈ నేపథ్యంలో ములుగు రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను గమనించిన నిందితులు పారిపోబోయారు. వెంటనే స్పందించిన పోలీసులు పద్మ, రాజు, జ్యోతిలను పట్టుకున్నారు. శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. బాలుడిని సురక్షితంగా రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఏసీపీ నరసింహారావు తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో హనుమకొండ పోలీసులు చూపిన తెలివితేటలపై ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్, ఎస్ఐ కిషోర్, AAO సల్మాన్ పాషా, ఇతర సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
తాజావార్తలు
-
FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
-
R Ashwin: ముందుగానే చెప్పాలి కదా.. ఇప్పుడు చెప్తే ఎలా.. బీసీసీఐపై అశ్విన్ ఫైర్!
-
Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. రెండో ఈవెంట్కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య ?
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!