Kidnap : హనుమకొండలో బాలుడి కిడ్నాప్.. 12 లక్షలు డిమాండ్.. ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
- డబ్బు కోసం మైనర్ బాలుడి కిడ్నాప్
- ముగ్గురు అరెస్ట్ చేసిన హనుమకొండ పోలీసులు
- కిడ్నాప్ ముఠా నుండి బాలుడిని సురక్షితంగా రక్షించిన పోలీసులు
Kidnap : హనుమకొండలో మైనర్ బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. డబ్బు కోసం ఓ మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసిన నలుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని హనుమకొండ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నిందితుల చెరలో ఉన్న బాలుడిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితుల్లో ప్రధాన అనుమానితురాలు పూరి పద్మ గతంలో బ్రాహ్మణవాడలోని క్యాటరింగ్ మాస్టర్ రమణ వద్ద కూలీగా పనిచేసింది. ఆర్థిక లావాదేవీలతో సంబంధించి గొడవల నేపథ్యంలో ఆమె గ్రామానికి వెళ్లిపోయింది. తనకు రావాల్సిన డబ్బుల కోసం రమణ బంధువైన మైనర్ బాలుడిని కిడ్నాప్ చేయాలని ఆమె పథకం రచించింది. దీనిలో ఆమె కుమారుడు రాజు, మరో బంధువు శ్రీకాంత్, స్నేహితురాలు జ్యోతి పాల్గొన్నారు.
Also Read
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
- Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
- Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
ఈ ముఠా బాలుడిని హనుమకొండలోని నయీమ్ నగర్ ప్రాంతంలో బలవంతంగా ఆటోలో ఎక్కించి అశ్వాపురం తీసుకెళ్లారు. బాలుడి తల్లి ద్వారా రమణను బెదిరించి రూ.12 లక్షలు డిమాండ్ చేశారు. బాలుడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దాచారు. కిడ్నాప్ సమయంలో బాలుడిని మానసికంగా హింసించారు కూడా.
ఈ నేపథ్యంలో ములుగు రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను గమనించిన నిందితులు పారిపోబోయారు. వెంటనే స్పందించిన పోలీసులు పద్మ, రాజు, జ్యోతిలను పట్టుకున్నారు. శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. బాలుడిని సురక్షితంగా రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఏసీపీ నరసింహారావు తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో హనుమకొండ పోలీసులు చూపిన తెలివితేటలపై ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్, ఎస్ఐ కిషోర్, AAO సల్మాన్ పాషా, ఇతర సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!