Hyderabad kidnapping: బాబోయ్ బూచోళ్లు.. కొండాపూర్లో చిన్నారి కిడ్నాప్కు యత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad kidnapping: హైదరాబాద్లో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు తిరుగుతున్నాయి. మొన్నటికి మొన్న చందానగర్లో ఓ బాలున్ని ముఠా సభ్యులు ఎత్తుకెళ్లారు. ఆ ఘటన మరువక ముందే కొండాపూర్లో మరో చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. కానీ అలర్ట్ అయిన స్థానికులు ఆమెను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. యస్.. మీరు విన్నది కరెక్టే. హైదరాబాద్లో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే బూచోళ్లు తిరుగుతున్నారు. దీంతో తల్లిదండ్రుల ఒడిలో హాయిగా ఆడుకోవాల్సిన పిల్లలు.. కిడ్నాపర్ల చేతికి చిక్కి అంగట్లో సరకులా మారుతున్నారు.
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
కొద్ది రోజుల క్రితం చందానగర్లో ఓ బాలున్ని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో గ్యాంగ్ బయల్దేరింది. హైదరాబాద్ కొండాపూర్లో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది. దీంతో వెంటనే అలర్టయిన స్థానికులు గ్యాంగ్లోని ముగ్గురు సభ్యులను పట్టుకున్నారు. కానీ అందులో ఇద్దరు ఆటోలో తప్పించుకున్నారు. ఓ మహిళ మాత్రం స్థానికుల చేతికి చిక్కింది. దీంతో ఆమెను స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత ఆమెను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు… ఇటీవలే హైదరాబాద్ చందానగర్లో చిన్నపిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా భరతం పట్టారు పోలీసులు. గత ఐదేళ్లుగా నగరంలో పిల్లల కిడ్నాప్లకు పాల్పడుతున్న ముఠాకు చెక్ పెట్టారు. ఆగస్టు 26న చందానగర్ పోలీసులకు అందిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. లింగంపల్లి పోచమ్మగూడెం వద్ద నాలుగేళ్ల బాలుడు కనిపించకుండా పోయాడని తల్లి ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి కేసు ఛేదించారు.
ముఠాకు ప్రధాన సూత్రధారి ఆయుర్వేదిక్ మెడిసిన్ డాక్టర్ చిలుకూరి రాజుగా గుర్తించారు. అతనితో పాటు మహ్మద్ ఆసిఫ్, రిజ్వానా, నర్సింహ్మారెడ్డి కలిసి గ్యాంగ్గా ఏర్పడి, రైల్వే స్టేషన్లు, నిర్మానుష్య ప్రదేశాల్లో ఐదేళ్లలోపు చిన్నారులను కిడ్నాప్ చేస్తూ, పిల్లలు లేని దంపతులకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ ముఠా ఆరుగురు చిన్నారులను కిడ్నాప్ చేసినట్లు నిర్ధారణ అయింది… ఇప్పుడు తాజాగా కొండాపూర్ ప్రాంతంలో పట్టుబడ్డ మహిళకు.. గతంలో పోలీసులు పట్టుకున్న గ్యాంగ్కు లింక్ ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో ఈ తరహా కిడ్నాప్ ముఠాలు ఎన్ని ఉన్నాయని ఆరా తీస్తున్నారు..
READ ALSO: Whatsapp Group: దొంగను పట్టించిన వాట్సప్ గ్రూప్.. వాట్సపా మజాకా..
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..