Hyderabad kidnapping: బాబోయ్ బూచోళ్లు.. కొండాపూర్లో చిన్నారి కిడ్నాప్కు యత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad kidnapping: హైదరాబాద్లో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు తిరుగుతున్నాయి. మొన్నటికి మొన్న చందానగర్లో ఓ బాలున్ని ముఠా సభ్యులు ఎత్తుకెళ్లారు. ఆ ఘటన మరువక ముందే కొండాపూర్లో మరో చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. కానీ అలర్ట్ అయిన స్థానికులు ఆమెను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. యస్.. మీరు విన్నది కరెక్టే. హైదరాబాద్లో చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే బూచోళ్లు తిరుగుతున్నారు. దీంతో తల్లిదండ్రుల ఒడిలో హాయిగా ఆడుకోవాల్సిన పిల్లలు.. కిడ్నాపర్ల చేతికి చిక్కి అంగట్లో సరకులా మారుతున్నారు.
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
కొద్ది రోజుల క్రితం చందానగర్లో ఓ బాలున్ని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో గ్యాంగ్ బయల్దేరింది. హైదరాబాద్ కొండాపూర్లో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది. దీంతో వెంటనే అలర్టయిన స్థానికులు గ్యాంగ్లోని ముగ్గురు సభ్యులను పట్టుకున్నారు. కానీ అందులో ఇద్దరు ఆటోలో తప్పించుకున్నారు. ఓ మహిళ మాత్రం స్థానికుల చేతికి చిక్కింది. దీంతో ఆమెను స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత ఆమెను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు… ఇటీవలే హైదరాబాద్ చందానగర్లో చిన్నపిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా భరతం పట్టారు పోలీసులు. గత ఐదేళ్లుగా నగరంలో పిల్లల కిడ్నాప్లకు పాల్పడుతున్న ముఠాకు చెక్ పెట్టారు. ఆగస్టు 26న చందానగర్ పోలీసులకు అందిన ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. లింగంపల్లి పోచమ్మగూడెం వద్ద నాలుగేళ్ల బాలుడు కనిపించకుండా పోయాడని తల్లి ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి కేసు ఛేదించారు.
ముఠాకు ప్రధాన సూత్రధారి ఆయుర్వేదిక్ మెడిసిన్ డాక్టర్ చిలుకూరి రాజుగా గుర్తించారు. అతనితో పాటు మహ్మద్ ఆసిఫ్, రిజ్వానా, నర్సింహ్మారెడ్డి కలిసి గ్యాంగ్గా ఏర్పడి, రైల్వే స్టేషన్లు, నిర్మానుష్య ప్రదేశాల్లో ఐదేళ్లలోపు చిన్నారులను కిడ్నాప్ చేస్తూ, పిల్లలు లేని దంపతులకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ ముఠా ఆరుగురు చిన్నారులను కిడ్నాప్ చేసినట్లు నిర్ధారణ అయింది… ఇప్పుడు తాజాగా కొండాపూర్ ప్రాంతంలో పట్టుబడ్డ మహిళకు.. గతంలో పోలీసులు పట్టుకున్న గ్యాంగ్కు లింక్ ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో ఈ తరహా కిడ్నాప్ ముఠాలు ఎన్ని ఉన్నాయని ఆరా తీస్తున్నారు..
READ ALSO: Whatsapp Group: దొంగను పట్టించిన వాట్సప్ గ్రూప్.. వాట్సపా మజాకా..
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!