Girl Killed Boyfriend: ప్రియుడ్ని చంపిన ప్రియురాలు.. కేసులో ట్విస్టులే ట్విస్టులు
Kerala Girlfriend Greeshma Killed Her Boyfriend Sharon: తనకు దక్కలేదన్న కోపంతోనో లేక వేధిస్తున్నాడన్న ఆవేదనతోనో.. ప్రియుడ్ని ప్రియురాలు చంపిన ఘటనల్ని మనం చూశాం. కానీ.. కేరళలో మాత్రం జ్యోతిష్యుడు చెప్పిన మాటలు విని, బ్రేకప్ చేసుకున్న ప్రియుడ్ని మళ్లీ ముగ్గులోకి దింపి మరీ చంపేసింది ఓ యువతి. తిరువనంతపురంలో సంచలనం రేపుతున్న ఈ హత్య కేసు వివరాల్లోకి వెళ్తే.. పరసాలాకు చెందిన షరోన్ రాజ్కు రెండేళ్ల క్రితం తమిళనాడుకు చెందిన గ్రీష్మాతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. రెండేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే.. కొంతకాలం క్రితం వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. తరచూ గొడవలు అవ్వడం స్టార్ట్ అయ్యింది. దీంతో.. ఇద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఇంకెప్పుడు కలవకూడదని నిర్ణయించుకున్నారు.
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన తర్వాత.. గ్రీష్మాకి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూశారు. ఈ క్రమంలోనే ఓ అబ్బాయి నచ్చడంతో, అతనితో పెళ్లి ఫిక్స్ చేశారు. చాలా గ్రాండ్గా నిశ్చితార్థం నిర్వహించారు. సెప్టెంబర్ నెలలో పెళ్లి చేయాలని నిశ్చయించారు. కానీ, చివరి నిమిషంలో పెళ్లిని ఫిబ్రవరికి వాయిదా వేయాల్సి వచ్చింది. తమ జాతకాలు ఏమైనా తేడా ఉన్నాయేమోనన్న అనుమానంతో.. గ్రీష్మా ఓ జ్యోతిష్యుడ్ని సంప్రదించింది. అప్పుడు జ్యోతిష్యుడు మొదటి భర్త చనిపోతాడని గ్రీష్మాకి జోస్యం చెప్పాడు. దీంతో.. గ్రీష్మా, ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ప్లాన్ మార్చేశారు. షరోన్ని మళ్లీ ముగ్గులోకి దింపమని కుటుంబీకులు చెప్పడంతో.. ఆమె మళ్లీ అతనితో మాటలు కలిపింది. నిన్ను విడిచిపెట్టి ఉండలేనట్టు అతనికి దగ్గరైంది. పెళ్లి చేసుకుందామని కూడా నమ్మించింది. పాపం.. ఆమె ప్రేమలో షరోన్, గుడ్డిగా అన్నీ నమ్మేశాడు.
Also Read
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
- Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
కట్ చేస్తే.. పెళ్లి చేసుకుందామని చెప్పి, కన్యాకుమారిలోని తన ఇంటికి షరోన్ని రప్పించింది గ్రీష్మా. సాంప్రదాయం ప్రకారం.. కుటుంబ సభ్యులు వారిద్దరికి పెళ్లి చేశారు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత.. ఇంట్లోనే స్నేహితులతో కలిసి, కూల్డ్రింగ్ తాగే పోటీ నిర్వహించారు. ఒక ఆయుర్వేదిక్ డ్రింక్లో గ్రీష్మా విషం కలిపి, ప్రియుడికి ఇచ్చింది. అది తాగిన షరోన్.. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. 14 రోజుల పాటు ఒక్కో అవయవం పని చేయకుండా చివరికి చనిపోయాడు. షరోన్ చనిపోయాక, తనకు పెళ్లి నిశ్చయమైన వ్యక్తిని వివాహమాడి, హాయిగా పెళ్లి చేసుకోవాలనే ఈ పన్నాగం పన్నింది. పెళ్లైన 14 రోజుల్లోనే తమ కుమారుడు చనిపోవడంతో.. షరోన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు ఈ గ్రీష్మా, ఆమె కుటుంబ సభ్యుల బాగోతం బయటపడింది.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీకి నేతలకు సజ్జల హెచ్చరికలు
-
Abhishek-Travis Head: అభిషేక్ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..
-
Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!
-
Rajnath Singh: “సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం”.. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!