Girl Killed Boyfriend: ప్రియుడ్ని చంపిన ప్రియురాలు.. కేసులో ట్విస్టులే ట్విస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala Girlfriend Greeshma Killed Her Boyfriend Sharon: తనకు దక్కలేదన్న కోపంతోనో లేక వేధిస్తున్నాడన్న ఆవేదనతోనో.. ప్రియుడ్ని ప్రియురాలు చంపిన ఘటనల్ని మనం చూశాం. కానీ.. కేరళలో మాత్రం జ్యోతిష్యుడు చెప్పిన మాటలు విని, బ్రేకప్ చేసుకున్న ప్రియుడ్ని మళ్లీ ముగ్గులోకి దింపి మరీ చంపేసింది ఓ యువతి. తిరువనంతపురంలో సంచలనం రేపుతున్న ఈ హత్య కేసు వివరాల్లోకి వెళ్తే.. పరసాలాకు చెందిన షరోన్ రాజ్కు రెండేళ్ల క్రితం తమిళనాడుకు చెందిన గ్రీష్మాతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. రెండేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అయితే.. కొంతకాలం క్రితం వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. తరచూ గొడవలు అవ్వడం స్టార్ట్ అయ్యింది. దీంతో.. ఇద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఇంకెప్పుడు కలవకూడదని నిర్ణయించుకున్నారు.
ప్రియుడికి బ్రేకప్ చెప్పిన తర్వాత.. గ్రీష్మాకి కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూశారు. ఈ క్రమంలోనే ఓ అబ్బాయి నచ్చడంతో, అతనితో పెళ్లి ఫిక్స్ చేశారు. చాలా గ్రాండ్గా నిశ్చితార్థం నిర్వహించారు. సెప్టెంబర్ నెలలో పెళ్లి చేయాలని నిశ్చయించారు. కానీ, చివరి నిమిషంలో పెళ్లిని ఫిబ్రవరికి వాయిదా వేయాల్సి వచ్చింది. తమ జాతకాలు ఏమైనా తేడా ఉన్నాయేమోనన్న అనుమానంతో.. గ్రీష్మా ఓ జ్యోతిష్యుడ్ని సంప్రదించింది. అప్పుడు జ్యోతిష్యుడు మొదటి భర్త చనిపోతాడని గ్రీష్మాకి జోస్యం చెప్పాడు. దీంతో.. గ్రీష్మా, ఆమె కుటుంబ సభ్యులు వెంటనే ప్లాన్ మార్చేశారు. షరోన్ని మళ్లీ ముగ్గులోకి దింపమని కుటుంబీకులు చెప్పడంతో.. ఆమె మళ్లీ అతనితో మాటలు కలిపింది. నిన్ను విడిచిపెట్టి ఉండలేనట్టు అతనికి దగ్గరైంది. పెళ్లి చేసుకుందామని కూడా నమ్మించింది. పాపం.. ఆమె ప్రేమలో షరోన్, గుడ్డిగా అన్నీ నమ్మేశాడు.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
కట్ చేస్తే.. పెళ్లి చేసుకుందామని చెప్పి, కన్యాకుమారిలోని తన ఇంటికి షరోన్ని రప్పించింది గ్రీష్మా. సాంప్రదాయం ప్రకారం.. కుటుంబ సభ్యులు వారిద్దరికి పెళ్లి చేశారు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత.. ఇంట్లోనే స్నేహితులతో కలిసి, కూల్డ్రింగ్ తాగే పోటీ నిర్వహించారు. ఒక ఆయుర్వేదిక్ డ్రింక్లో గ్రీష్మా విషం కలిపి, ప్రియుడికి ఇచ్చింది. అది తాగిన షరోన్.. తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. 14 రోజుల పాటు ఒక్కో అవయవం పని చేయకుండా చివరికి చనిపోయాడు. షరోన్ చనిపోయాక, తనకు పెళ్లి నిశ్చయమైన వ్యక్తిని వివాహమాడి, హాయిగా పెళ్లి చేసుకోవాలనే ఈ పన్నాగం పన్నింది. పెళ్లైన 14 రోజుల్లోనే తమ కుమారుడు చనిపోవడంతో.. షరోన్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు ఈ గ్రీష్మా, ఆమె కుటుంబ సభ్యుల బాగోతం బయటపడింది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!