Karnataka: వేరే కులం అబ్బాయిని ప్రేమించిన కూతురు.. ఆ తండ్రి ఏం చేశాడంటే..?
- కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గి జిల్లాలో దారుణం..
- కూతురు వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించడంతో హత్య..
- కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన తండ్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కులాంతర ప్రేమలు పెను విషాదాలను మిగులుస్తున్న సంఘటనలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గి జిల్లాలో గల మెలకుంద గ్రామంలో జరిగిన ఇలాంటి ఓ దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తన కూతురు వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే విషయాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి, ఆమెను దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారాణ జరిపి, అసలు నిజాన్ని బయటపెట్టారు.
Read Also: Allu Family : అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
తీరు మార్చుకోని కూతురు..
అయితే, మెలకుంద గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన చిన్న కూతురు వేరే కులానికి చెందిన యువకుడిని లవ్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న శంకర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కులాంతర వివాహం జరిగితే మిగతా కుమార్తెల పెళ్లిళ్లు ఆగిపోతాయన్న భయం అతడ్ని వెంటాడింది. దీంతో కూతురిని ఒప్పించేందుకు బంధువుల సహాయం తీసుకున్నప్పటికీ, ఆమె తన నిర్ణయం మార్చుకోకపోవడంతో ఈ హత్యకు పాల్పడ్డాడు.
Read Also: Russia: రష్యా గ్యాస్ స్టేషన్లో భారీ పేలుడు.. నలుగురు మృతి
హత్యను ఆత్మహత్యగా చిత్రీకరణ..
ఇక, గురువారం నాడు తన కూతురిని గొంతు నులిమి చంపిన శంకర్, ఆ తర్వాత ఆమె నోట్లో పురుగులమందు పోసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. గ్రామస్థులు కూడా అది ఆత్మహత్యే అని భావించి అంత్యక్రియలను కూడా నిర్వహించారు. కానీ, ఈ ఘటనపై పోలీసులకు అనుమానం రావడంతో, కలబుర్గి పోలీసు కమిషనర్ శరణప్ప ఎస్డీ ఆదేశాల మేరకు పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేశారు.
Read Also: Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ
బయటపడ్డ నిజం:
కాగా, మృతదేహాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం ఇది హత్యేనని నిర్ధారించింది. దీంతో పోలీసులు మృతురాలి తండ్రి శంకర్ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు నిజం బయటకు వచ్చింది. కులాంతర వివాహం కారణంగా తన కుటుంబ పరువు పోతుందని భావించి ఈ దారుణానికి పాల్పడ్డానని శంకర్ ఒప్పుకున్నాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు హత్య, సాక్ష్యాలను తారుమారు చేసిన కేసుల్లో అరెస్టు చేశారు. ఈ ఘటనలో శంకర్ బంధువులిద్దరి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, వారు దోషులని తేలితే వారిని కూడా అరెస్ట్ చేస్తామని కలబుర్గి కమిషనర్ శరణప్ప ఎస్డీ తెలిపారు.
తాజావార్తలు
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
-
Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
-
Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
-
Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
-
NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..