Karnataka: వేరే కులం అబ్బాయిని ప్రేమించిన కూతురు.. ఆ తండ్రి ఏం చేశాడంటే..?
- కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గి జిల్లాలో దారుణం..
- కూతురు వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించడంతో హత్య..
- కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన తండ్రి..
Karnataka: కులాంతర ప్రేమలు పెను విషాదాలను మిగులుస్తున్న సంఘటనలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గి జిల్లాలో గల మెలకుంద గ్రామంలో జరిగిన ఇలాంటి ఓ దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తన కూతురు వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే విషయాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి, ఆమెను దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారాణ జరిపి, అసలు నిజాన్ని బయటపెట్టారు.
Read Also: Allu Family : అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత
Also Read
- Brazilian Athlete: స్విమ్ రేస్ లో ప్రముఖ బ్రెజిలియన్ అథ్లెట్ మృతి..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- Affair Doubt: ఏడేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. భార్య వీడియో కాల్లో ఉండగా సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త.. అది చూసి..
- Delhi: ఐఆర్ఎస్ అధికారి కుమార్తె హత్య.. లైంగిక దాడి అనంతరం మొబైల్ ఛార్జర్తో గొంతు నులిమి
తీరు మార్చుకోని కూతురు..
అయితే, మెలకుంద గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన చిన్న కూతురు వేరే కులానికి చెందిన యువకుడిని లవ్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న శంకర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కులాంతర వివాహం జరిగితే మిగతా కుమార్తెల పెళ్లిళ్లు ఆగిపోతాయన్న భయం అతడ్ని వెంటాడింది. దీంతో కూతురిని ఒప్పించేందుకు బంధువుల సహాయం తీసుకున్నప్పటికీ, ఆమె తన నిర్ణయం మార్చుకోకపోవడంతో ఈ హత్యకు పాల్పడ్డాడు.
Read Also: Russia: రష్యా గ్యాస్ స్టేషన్లో భారీ పేలుడు.. నలుగురు మృతి
హత్యను ఆత్మహత్యగా చిత్రీకరణ..
ఇక, గురువారం నాడు తన కూతురిని గొంతు నులిమి చంపిన శంకర్, ఆ తర్వాత ఆమె నోట్లో పురుగులమందు పోసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. గ్రామస్థులు కూడా అది ఆత్మహత్యే అని భావించి అంత్యక్రియలను కూడా నిర్వహించారు. కానీ, ఈ ఘటనపై పోలీసులకు అనుమానం రావడంతో, కలబుర్గి పోలీసు కమిషనర్ శరణప్ప ఎస్డీ ఆదేశాల మేరకు పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేశారు.
Read Also: Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ
బయటపడ్డ నిజం:
కాగా, మృతదేహాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం ఇది హత్యేనని నిర్ధారించింది. దీంతో పోలీసులు మృతురాలి తండ్రి శంకర్ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు నిజం బయటకు వచ్చింది. కులాంతర వివాహం కారణంగా తన కుటుంబ పరువు పోతుందని భావించి ఈ దారుణానికి పాల్పడ్డానని శంకర్ ఒప్పుకున్నాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు హత్య, సాక్ష్యాలను తారుమారు చేసిన కేసుల్లో అరెస్టు చేశారు. ఈ ఘటనలో శంకర్ బంధువులిద్దరి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, వారు దోషులని తేలితే వారిని కూడా అరెస్ట్ చేస్తామని కలబుర్గి కమిషనర్ శరణప్ప ఎస్డీ తెలిపారు.
తాజావార్తలు
-
Viral Video: ధోని కాళ్లు పట్టుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు..
-
LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Magic Rava Bites Recipe: రవ్వతో కొత్త స్నాక్.. 15 నిమిషాల్లో ‘మ్యాజిక్ రవ్వ బైట్స్’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ..!
-
Royal Enfield Himalayan 440: రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త హిమాలయన్ 440 వచ్చేస్తోంది..
-
Mint Sharbat: కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే సూపర్ హెల్తీ డ్రింక్.. సింపుల్గా మీ ఇంట్లో ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?