Witchcraft: మంత్రాల నెపంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దారుణ హత్య..
- మంత్రాల నెపంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి హత్య..
- నిద్రిస్తున్న సమయంలో గొంతు కోసిన దుండగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Witchcraft: మూఢనమ్మకాలు ముగ్గురి ప్రాణాలను తీశాయి. జార్ఖండ్లో మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని నరికి చంపారు. రాష్ట్రంలోని లోహార్డాగా జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. పెష్రార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేక్రాంగ్ బార్టోలి గ్రామంలో బుధవారం రాత్రి ఈ హత్యలు జరిగాయి. మృతులను లక్ష్మణ్ నగేసియా (47), అతని భార్య బిఫాని నగేసియా (45), వారి తొమ్మిదేళ్ల కుమారుడు రాంవిలాస్ నగేసియాగా గుర్తించారు.
Read Also: PM Modi: ఖలిస్తానీలపై చర్యలు తీసుకోండి..యూకే పీఎంను కోరిన మోడీ..
Also Read
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దాడి చేసిన వ్యక్తులు గొడ్డలి, పార వంటి పదునైన ఆయుధాలను ఉపయోగించి వారి గొంతు కోసినట్లు చెప్పారు. బాధితులు నిద్రిస్తున్న సమయంలోనే ఈ హత్యలు జరిగినట్లు వెల్లడించారు. హత్యల తర్వాత దుండగులు ఇంటికి బయట నుంచి తాళం వేసి పారిపోయారు. గురువారం ఉదయం కుటుంబం చాలా సేపు అయినా తలుపులు తెరవకపోవడంతో పొరుగువారి ద్వారా ఈ హత్యల విషయం వెలుగులోకి వచ్చింది.
పెష్రార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ నేతృత్వంలోని పోలీస్ బృందం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపారు. సంఘటన జరిగిన సమయంలో నలుగురు వ్యక్తులు ఇంట్లో ఉన్నారు. ప్రాణాలతో కేవలం సుఖ్మానియా నాగేసియా అనే మహిళ బయటపడింది. తమ కుటుంబం మంత్రాలు చేస్తుందని కొంత మంది గ్రామస్తులు వేధిస్తున్నారని పోలీసులకు చెప్పింది. గతంలో ఇదే విషయమై పంచాయతీ కూడా జరిగినట్లు వెల్లడించింది. అన్ని కోణాల్లో కేసును పరిశీలించి, నిందితులను త్వరగా పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!