Betting Apps : బెట్టింగ్ కోసం షాకింగ్ మర్డర్..! ఇంజినీరింగ్ స్టూడెంట్ అరెస్ట్
- బెట్టింగ్ కోసం యువతి హత్య
- ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్
- బంగారం, నగదు దోపిడీ నిజాలు బయటకు
- జగద్గిరిగుట్ట కేసు ఛేదించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Betting Apps : ఆన్లైన్ బెట్టింగ్, మద్యం వ్యసనాలతో అప్పులపాలై డబ్బు కోసం హత్యకు దిగిన ఇంజినీరింగ్ విద్యార్థి శివ మాధవ రెడ్డి (23)ని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఖమ్మం జిల్లాకు చెందిన దేవేందర్ రెడ్డి, నిహారిక (21) దంపతులు వెంకటేశ్వరనగర్లో నివాసముంటున్నారు. ఈ నెల 12న డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకున్న భర్త దేవేందర్ రెడ్డి, బాత్రూమ్లో నిహారిక పడి ఉండటం గమనించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
CM Nitish Kumar: ప్రజలు మా పట్ల నమ్మకం ఉంచారు.. ప్రతీ ఓటరుకూ నా హృదయపూర్వక ధన్యవాదాలు..!
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
ప్రాథమిక విచారణలో ఇది సహజ మరణం కాదని, నిహారికను హత్య చేశారని పోలీసులు గుర్తించారు. అదే రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న నిహారికను శివ మాధవ రెడ్డి లక్ష్యంగా చేసుకున్నాడని విచారణలో బయటపడింది. భర్త పనికి వెళ్లడం, పొరుగువారు ఇంట్లో లేకపోవడం నిర్ధారించుకుని నిందితుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెపై దాడి చేసి గొంతు కోసి హత్య చేసిన అనంతరం, ఇది సహజ మరణం అన్నట్లు సీనును సృష్టించాడు.
తరువాత బంగారు మంగళసూత్రం, బంగారు చెవిపోగులు, మూడు బంగారు ఉంగరాలు, రూ. 2,500 నగదు దొంగిలించి అక్కడి నుండి పరారయ్యాడు. నిందితుడి వద్ద నుండి ఒక ద్విచక్రవాహనం, రెండు మొబైల్ ఫోన్లు, దొంగిలించిన నాలుగు తులాల బంగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. ఈ కేసును విజయవంతంగా చేదించిన జగద్గిరిగుట్ట పోలీసులు, SOT , CCS బృందాలను డీసీపీ అభినందించారు.
Narendra Modi : మేం ప్రజలకు సేవకులం.. వారి మనసులు గెలుచుకున్నాం
తాజావార్తలు
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!