Hyderabad family suicide: చిన్నారిని చంపి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారా?
- విగతజీవులుగా పడి ఉన్న అనిల్, కవిత
- రెండేళ్ల చిన్నారి, తల్లి వెంకటమ్మ, తండ్రి లక్ష్మయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad family suicide: హైదరాబాద్ మియాపూర్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. వారు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఫుడ్ పాయిజన్ కారణమా? అనేది తెలియాల్సి ఉంది. కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన అనిల్.. ఉపాధి కోసం ఫ్యామిలీతో హైదరాబాద్కు వచ్చాడు. అజీజ్నగర్లో నివాసం ఉంటూ మేస్త్రీ పని చేస్తూ ఉండే వాడు. కవితను మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వారికి రెండేళ్ల చిన్నారి కూతురు ఉంది. ఇక అనిల్.. అత్త, మామ కూడా వారితోనే ఉంటున్నారు. మియాపూర్లోని మక్త మహబూబ్పేటలో అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. బుధవారం రాత్రి వరకు నవ్వుతూ మాట్లాడిన నలుగురు.. తెల్లవారేసరికి చిన్నారితో సహా గదిలో విగతజీవులుగా పడి ఉన్నారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
పక్కింటి వాళ్లు తలుపు ఎన్ని సార్లు కొట్టినా తీయలేదు
గురువారం ఉదయం అనిల్.. మామ లక్ష్మయ్యకు బంధువులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో పక్కనే ఉన్న వాళ్లకు సమాచారం ఇచ్చారు. పక్కింటి వాళ్లు వచ్చి తలుపు ఎన్ని సార్లు కొట్టినా తీయలేదు. దీంతో తలుపులు పగులగొట్టి లోపల చూడగా అనిల్, కవితతో పాటు రెండేళ్ల చిన్నారి కవిత తల్లి వెంకటమ్మ, తండ్రి లక్ష్మయ్య విగతజీవులుగా పడి ఉన్నారు. అప్పటికే వారంతా చనిపోయినట్లు అనుమానించి వెంటనే మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూసేసరికే నలుగురు వాంతులు చేసుకున్నట్లుగా గదిలో కనిపించింది.. అనిల్కు ఆత్మహత్య చేసుకునే అంత అవసరం లేదని బంధువులు చెబుతున్నారు. అప్పులు ఉన్న మాట వాస్తవమే కానీ చనిపోయేంత అప్పులు లేవంటున్నారు. వారు అలా ఎలా చనిపోయారో అర్ధం కావడం లేదంటున్నారు.
కేసులో కీలకంగా మారిన పోస్టు మార్టం రిపోర్ట్
పోలీసులు.. ఐదుగురి మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని చంపి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఫుడ్ పాయిజన్తో చనిపోయారా? అనేది పోస్టుమార్టం రిపోర్టులో తేలనుంది. ఒకవేళ ఫుడ్ పాయిజన్ ఐతే.. రెండేళ్ల చిన్నారి ఎంత తింటుంది? ఫుడ్ పాయిజన్ అయ్యేంత ఆహారం తీసుకుంటుందా? లేక చిన్నారిని చంపి నలుగురు కలిసి ఆత్మహత్య చేసుకున్నారా? ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టు చాలా కీలకంగా మారింది.
Read Also: shocking crime: ఉల్లి తెచ్చిన లొల్లి.. తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు
తాజావార్తలు
-
వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! ‘FIFA World Cup’ గురించి తెలియని విషయాలు మీకోసం..
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..