Fraud : 500 కోట్ల షెల్ కంపెనీల మోసం.. హైదరాబాద్ లో సంచలనం!
- బడా..బడా పారిశ్రామిక వేత్తలే ఆమె టార్గెట్
- ఈజీగా డబ్బులు సంపాదించాలని స్కెచ్
- భారీగా లాభాలు అంటూ ఆశ చూపించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fraud : భర్త శ్రీధర్తోపాటు తమ్ముడు ఎమర్తి రామ్దాస్ సహకారం డబ్బు నిజాయితీగా సంపాదించాలంటే కష్టం.. కానీ మోసం చేసి సంపాదించాలంటే ఈజీ. ఇదే ఫార్ములా అప్లై చేసింది ఆ కిలాడీ లేడి. ఏకంగా బడా పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకుంది. షెల్ కంపెనీలు పెట్టింది.. ఫేక్ వర్క్ ఆర్డర్లు చూపించి వందల కోట్లు కొట్టేసింది. కానీ చివరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెను పట్టుకున్నారు. కిలాడీ లేడీ బాగోతాన్ని బయట పెట్టారు. ఇంతకీ ఆ లేడీ ఎవరు? ఏ విధంగా బడా బాబులను బురిడీ కొట్టించింది?
Also Read
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
ఇక్కడ చూడండి.. ఈమెనే ఆ కిలాడీ లేడీ. పేరు సంధ్యారాణి. పెద్దగా చదువు లేదు..కానీ తెలివి తేటలు మాత్రం మెండుగా ఉన్నాయి. ఈమె పెద్ద పెద్ద వ్యాపారస్తుల వద్ద దాదాపు 500 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నిజానికి చూస్తే ఎవరూ నమ్మరు. కానీ ఇప్పుడు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఈమెను అరెస్ట్ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బడా బాబులను మోసం చేసిన కేసులో ఈమెకు ఆమె భర్త శ్రీధర్తోపాటు తమ్ముడు ఎమర్తి రామ్దాస్ సహకరించారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారు..
సంధ్యారాణి కన్నింగ్ తెలివితేటలకు ఏం తక్కువ లేదు. ఈజీ మనీ కోసం ఏకంగా 40 వరకు షెల్ కంపెనీలు పెట్టింది. లేని కంపెనీలు ఉన్నట్లుగా నమ్మించి.. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో వాటిలో డబ్బులు ఇన్వెస్ట్ చేయించింది. వాటిని ఆయా కంపెనీల పేరుతో ఓపెన్ చేసిన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించింది. ఆ తర్వాత ఆ డబ్బులను పలు మ్యూల్ ఖాతాలకు మళ్లించింది. ఇందుకోసం దాదాపు 1800 మ్యూల్ ఖాతాలను ఉపయోగించుకుందంటే మామూలు విషయం కాదు. అలా మ్యూల్ ఖాతాల నుంచి చివరకు తన అకౌంట్లకు డబ్బులను మళ్లించుకుంది. ఇలా ఏకంగా రూ. 500 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసిందని పోలీసులు చెబుతున్నారు… ఎంత పకడ్బందీగా చేసినా.. క్రిమినల్స్ ఎక్కడొ ఒక దగ్గర దొరికిపోతుంటారు. సరిగ్గా సంధ్యారాణి విషయంలో కూడా అదే జరిగింది. ఓ ఇండస్ట్రియలిస్ట్ ఫిర్యాదు చేయడంతో సంధ్యారాణి బాగోతం బయటపడింది. ప్రస్తుతం ఆమెను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు…
తాజావార్తలు
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!