Assam: తల్లీకూతుళ్లపై 8 మంది సామూహిక అత్యాచారం.. గౌహతిలో దారుణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: గౌహతిలో దారుణం జరిగింది. మూగ మహిళ, ఆమె కుమార్తెపై దారుణంగా 8 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి ప్రవేటు భాగాలపై కారం చల్లి తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన మే 17న జరిగింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ తన 22 ఏళ్ల కుమార్తెతో గౌహతిలోని సత్గావ్ తల్తాలాలో నివాసం ఉంటోంది. అయితే 55 ఏళ్ల అరుణ్ ప్రధాన్ అనే వ్యక్తి సదరు మహిళలో సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి.
ఈ నేపథ్యంలో అరుణ్ ప్రధాన్ కొడుకు అమిత్ ప్రధాన్, మరో ఏడుగురు నిందితులు మే 17న బాధితుల ఇంటిలోకి ప్రవేశించి తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితులు ప్రవేట్ భాగాలపై కారం చల్లారు. తీవ్ర చిత్రహింసల వల్ల తల్లీకూతుళ్లు స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇరుగుపొరుగు వారు సత్గావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న బాధితులిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జిఎంసిహెచ్) కు తరలించారు. అత్యవసర వైద్యసేవలు అందించి ఆసుపత్రి అధికారులు ఇద్దరి ప్రాణాలను కాపాడారు.
Also Read
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
Read Also: Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. రాబోయే మూడ్రోజుల భారీ వర్షాలు
మరోవైపు పోలీసులు కూడా ఈ విషయాన్ని కప్పిపుచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పోలీసులు కూడా బాధితులను బెదిరించి మీడియాకు సమాచారం ఇవ్వదన్ని ఆదేశించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సత్గావ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 456, 294, 354 మరియు 354 (B) కింద అభియోగాలతో కేసులు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే తన కొడుకును, నిందితులను కేసు నుంచి బయటకు తీసుకురావడానికి అరుణ్ ప్రధాన్ మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహమైన వెంటనే నిందితుడిపై అభియోగాలు ఎత్తేయాలని సత్గావ్ పోలీస్ స్టేషన్ లో కోరాడు. అయితే గ్యాంగ్ రేప్ కేసు కావడంతో పోలీసులు ఈ లేఖను పట్టించుకోలేదు. వైద్యుల నివేదికలో రేప్ అని తేలడంతో ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు.
- Tags
- Assam
- Crime News
- gang rape
- Guwahati
తాజావార్తలు
-
Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
-
US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
-
PM Modi: న్యూజిలాండ్ టూర్కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Falcon Scam : 14 కోట్ల విమానం 3 కోట్లకే.. దేశంలోనే తొలిసారిగా విమానాన్ని ఈ-వేలం.!
ట్రెండింగ్
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!