Assam: తల్లీకూతుళ్లపై 8 మంది సామూహిక అత్యాచారం.. గౌహతిలో దారుణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: గౌహతిలో దారుణం జరిగింది. మూగ మహిళ, ఆమె కుమార్తెపై దారుణంగా 8 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి ప్రవేటు భాగాలపై కారం చల్లి తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన మే 17న జరిగింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళ తన 22 ఏళ్ల కుమార్తెతో గౌహతిలోని సత్గావ్ తల్తాలాలో నివాసం ఉంటోంది. అయితే 55 ఏళ్ల అరుణ్ ప్రధాన్ అనే వ్యక్తి సదరు మహిళలో సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి.
ఈ నేపథ్యంలో అరుణ్ ప్రధాన్ కొడుకు అమిత్ ప్రధాన్, మరో ఏడుగురు నిందితులు మే 17న బాధితుల ఇంటిలోకి ప్రవేశించి తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితులు ప్రవేట్ భాగాలపై కారం చల్లారు. తీవ్ర చిత్రహింసల వల్ల తల్లీకూతుళ్లు స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇరుగుపొరుగు వారు సత్గావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న బాధితులిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో గౌహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (జిఎంసిహెచ్) కు తరలించారు. అత్యవసర వైద్యసేవలు అందించి ఆసుపత్రి అధికారులు ఇద్దరి ప్రాణాలను కాపాడారు.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
Read Also: Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. రాబోయే మూడ్రోజుల భారీ వర్షాలు
మరోవైపు పోలీసులు కూడా ఈ విషయాన్ని కప్పిపుచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పోలీసులు కూడా బాధితులను బెదిరించి మీడియాకు సమాచారం ఇవ్వదన్ని ఆదేశించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సత్గావ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 456, 294, 354 మరియు 354 (B) కింద అభియోగాలతో కేసులు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే తన కొడుకును, నిందితులను కేసు నుంచి బయటకు తీసుకురావడానికి అరుణ్ ప్రధాన్ మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహమైన వెంటనే నిందితుడిపై అభియోగాలు ఎత్తేయాలని సత్గావ్ పోలీస్ స్టేషన్ లో కోరాడు. అయితే గ్యాంగ్ రేప్ కేసు కావడంతో పోలీసులు ఈ లేఖను పట్టించుకోలేదు. వైద్యుల నివేదికలో రేప్ అని తేలడంతో ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు.
- Tags
- Assam
- Crime News
- gang rape
- Guwahati
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!