Ghazipur Triple Murder: ప్రేయసి కోసం 15 ఏళ్ల బాలుడి దారుణం.. తల్లిదండ్రులతో పాటు సోదరుడి హత్య..
- ప్రేమసి కోసం 15 ఏళ్ల బాలుడు దారుణం.. తల్లిదండ్రులతో సహా సోదరుడి హత్య..
- పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కిరాతకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghazipur Triple Murder: గత రెండేళ్లుగా ప్రేమిస్తున్న తన స్రేయసితో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తల్లిదండ్రులను, సోదరుడిని అత్యంత దారుణంగా 15 ఏళ్ల బాలుడు హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. హత్యలు చేసినట్లు బాలుడు అంగీకరించడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 7-8 రాత్రి ఘాజీపూర్ జిల్లాలోని నంద్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుసుమ్హికలా గ్రామాన్ని ట్రిపుల్ మర్డర్ కేసు కుదిపేసింది. గొంతుకోసం హత్యలు చేసేందుకు ఉపయోగించిన పదునైన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Vijayawada: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాస..
Also Read
- Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ను కుదిపేస్తున్న ఘటన..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
ఘాజీపూర్ ఎస్పీ ఓంవీర్ సింగ్ మాట్లాడుతూ.. నేరస్తుడిని అరెస్ట్ చేశామని, తండ్రి మున్షి బింద్(45),తల్లి దేవంతి బింద్(40) , అతని అన్నయ్య ఆశిష్ బింద్(20) గొంతు కోయడానికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, చాలా రోజుల క్రితమే హత్యలు చేయాలని నిర్ణయించుకున్నట్లు, దాని కోసం వ్యవసాయ పనుల్లో గడ్డి కోసేందుకు వాడే ‘ఖుర్పా’ అనే ఆయుధాన్ని కొనుగోలు చేసినట్లు బాలుడు వెల్లడించినట్లు తెలిపారు. జూలై 7న ముగ్గురుని హత్య చేయడానికి విఫలయత్నం చేశానని, అయితే ధైర్యం రాకపోవడంతో ఆ పని చేయలేదని చెప్పాడు.
ఆదివారం రాత్రి నిందితుడైన బాలుడు తన అన్న ఆశిష్తో గ్రామంలో ప్రీ వెడ్డింగ్ ఫంక్ష,న్ ఆర్కెస్ట్రా చూసేందుకు వెళ్లాడు. మంగళవారం రాత్రి 11 ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చారు. అంతా నిద్ర పోతున్న సమయంలో మద్యం సేవించి తండ్రి, తల్లి, సోదరుడి గొంతు కోశాడు. నేరం చేసిన తర్వాత దాడికి ఉపయోగించిన ఆయుధాన్ని దాచేసి, ఏం తెలియని విధంగా అదే ఆర్కెస్ట్రా షో చూసేందుకు వెళ్లాడు. బుధవారం తెల్లవారుజామున 1.45 గంటలకు వచ్చి తన వారిని ఎవరో చంపారని స్థానికులకు చెప్పాడు. మున్షీ సోదరుడు రామ్ ప్రకాష్ బింద్ తన గ్రామానికి చెందిన రాధే బింద్ మరియు అతని సహచరులు ముగ్గురిని హత్య చేశారని ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. అయితే, అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు, మున్షి చిన్న కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత దారుణమైన హత్యల గురించి వెల్లడించారు. బుధవారం బాలుడిని జువైనల్ కోర్టులో హాజరుపరిచారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!