Ghazipur Triple Murder: ప్రేయసి కోసం 15 ఏళ్ల బాలుడి దారుణం.. తల్లిదండ్రులతో పాటు సోదరుడి హత్య..
- ప్రేమసి కోసం 15 ఏళ్ల బాలుడు దారుణం.. తల్లిదండ్రులతో సహా సోదరుడి హత్య..
- పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కిరాతకం..
Ghazipur Triple Murder: గత రెండేళ్లుగా ప్రేమిస్తున్న తన స్రేయసితో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తల్లిదండ్రులను, సోదరుడిని అత్యంత దారుణంగా 15 ఏళ్ల బాలుడు హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. హత్యలు చేసినట్లు బాలుడు అంగీకరించడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 7-8 రాత్రి ఘాజీపూర్ జిల్లాలోని నంద్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుసుమ్హికలా గ్రామాన్ని ట్రిపుల్ మర్డర్ కేసు కుదిపేసింది. గొంతుకోసం హత్యలు చేసేందుకు ఉపయోగించిన పదునైన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Vijayawada: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాస..
Also Read
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
- Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
- Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
ఘాజీపూర్ ఎస్పీ ఓంవీర్ సింగ్ మాట్లాడుతూ.. నేరస్తుడిని అరెస్ట్ చేశామని, తండ్రి మున్షి బింద్(45),తల్లి దేవంతి బింద్(40) , అతని అన్నయ్య ఆశిష్ బింద్(20) గొంతు కోయడానికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, చాలా రోజుల క్రితమే హత్యలు చేయాలని నిర్ణయించుకున్నట్లు, దాని కోసం వ్యవసాయ పనుల్లో గడ్డి కోసేందుకు వాడే ‘ఖుర్పా’ అనే ఆయుధాన్ని కొనుగోలు చేసినట్లు బాలుడు వెల్లడించినట్లు తెలిపారు. జూలై 7న ముగ్గురుని హత్య చేయడానికి విఫలయత్నం చేశానని, అయితే ధైర్యం రాకపోవడంతో ఆ పని చేయలేదని చెప్పాడు.
ఆదివారం రాత్రి నిందితుడైన బాలుడు తన అన్న ఆశిష్తో గ్రామంలో ప్రీ వెడ్డింగ్ ఫంక్ష,న్ ఆర్కెస్ట్రా చూసేందుకు వెళ్లాడు. మంగళవారం రాత్రి 11 ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చారు. అంతా నిద్ర పోతున్న సమయంలో మద్యం సేవించి తండ్రి, తల్లి, సోదరుడి గొంతు కోశాడు. నేరం చేసిన తర్వాత దాడికి ఉపయోగించిన ఆయుధాన్ని దాచేసి, ఏం తెలియని విధంగా అదే ఆర్కెస్ట్రా షో చూసేందుకు వెళ్లాడు. బుధవారం తెల్లవారుజామున 1.45 గంటలకు వచ్చి తన వారిని ఎవరో చంపారని స్థానికులకు చెప్పాడు. మున్షీ సోదరుడు రామ్ ప్రకాష్ బింద్ తన గ్రామానికి చెందిన రాధే బింద్ మరియు అతని సహచరులు ముగ్గురిని హత్య చేశారని ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. అయితే, అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు, మున్షి చిన్న కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత దారుణమైన హత్యల గురించి వెల్లడించారు. బుధవారం బాలుడిని జువైనల్ కోర్టులో హాజరుపరిచారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!