Man Stabbed to Death Over Money: డబ్బు విషయంలో గొడవ.. యువకుడి దారుణ హత్య
- చిన్న వివాదంతో 34 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన దుండగులు
- మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. విషయంలో జరిగిన చిన్న వివాదం కారణంగా 34 ఏళ్ల వ్యక్తిని తోటి గ్రామస్తులు కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే… గంజాం జిల్లా ధరకోట్ పోలీసు స్టేషన్ పరిధిలోని రెడ్డి దామదార గ్రామంలో ఆదివారం రాత్రి డబ్బు విషయంలో జరిగిన చిన్న వివాదం కారణంగా 34 ఏళ్ల వ్యక్తిని తోటి గ్రామస్తులు కత్తితో పొడిచి చంపారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతుడిని రెడ్డి దామదర నివాసి డి. శంకర్ రెడ్డిగా గుర్తించారు. మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
Also Read: Keonjhar:దారుణం.. కుటుంబ కలహాలతో.. సవతి తండ్రి హత్య
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు శంకర్ కి, తోటి గ్రామస్థులకు మధ్య డబ్బు విషయంలో గొడవ జరగడంతో.. అతడిపై కత్తితో దాడి చేశారు. పొట్ట భాగంలో తీవ్ర గాయాలు కావడంతో .. స్థానికులు అస్కా సబ్-డివిజనల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత, అతని పరిస్థితి మరింత విషమించడంతో బెర్హంపూర్లోని MKCG ఆసుపత్రికి తరలిస్తుండగా.. దారిలో మరణించాడు. దాడి వెనుక ఉన్న ఖచ్చితమైన కారణం ఇంకా అస్పష్టంగానే ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దాడికి గల కారణాలను తెలుసుకోవడానికి మరియు నిందితులను గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది, మృతదేహాన్ని పోస్ట్మార్టం పరీక్ష కోసం పంపారు.
Also Read:Tragedy: విగ్రహ నిమజ్జనంలో అపశృతి… 13 మంది యువకుల గల్లంతు.
“కొంతమందికి గతంలో డ్యాన్స్ షోలో కొంత డబ్బు విషయంలో అతనితో శత్రుత్వం ఉండేదని మృతుడి సోదరుడు సంజయ్ కుమార్ రెడ్డి వెల్లడించాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, నిందితులు తన సోదరుడిని పొడిచి చంపారు. కనీసం 4-5 మంది ఉన్నారని.. కానీ వారిలో ఒకరు అతనిని పొడిచి చంపారని సంజయ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!