Man Stabbed to Death Over Money: డబ్బు విషయంలో గొడవ.. యువకుడి దారుణ హత్య
- చిన్న వివాదంతో 34 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన దుండగులు
- మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. విషయంలో జరిగిన చిన్న వివాదం కారణంగా 34 ఏళ్ల వ్యక్తిని తోటి గ్రామస్తులు కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే… గంజాం జిల్లా ధరకోట్ పోలీసు స్టేషన్ పరిధిలోని రెడ్డి దామదార గ్రామంలో ఆదివారం రాత్రి డబ్బు విషయంలో జరిగిన చిన్న వివాదం కారణంగా 34 ఏళ్ల వ్యక్తిని తోటి గ్రామస్తులు కత్తితో పొడిచి చంపారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతుడిని రెడ్డి దామదర నివాసి డి. శంకర్ రెడ్డిగా గుర్తించారు. మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
Also Read: Keonjhar:దారుణం.. కుటుంబ కలహాలతో.. సవతి తండ్రి హత్య
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు శంకర్ కి, తోటి గ్రామస్థులకు మధ్య డబ్బు విషయంలో గొడవ జరగడంతో.. అతడిపై కత్తితో దాడి చేశారు. పొట్ట భాగంలో తీవ్ర గాయాలు కావడంతో .. స్థానికులు అస్కా సబ్-డివిజనల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత, అతని పరిస్థితి మరింత విషమించడంతో బెర్హంపూర్లోని MKCG ఆసుపత్రికి తరలిస్తుండగా.. దారిలో మరణించాడు. దాడి వెనుక ఉన్న ఖచ్చితమైన కారణం ఇంకా అస్పష్టంగానే ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దాడికి గల కారణాలను తెలుసుకోవడానికి మరియు నిందితులను గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది, మృతదేహాన్ని పోస్ట్మార్టం పరీక్ష కోసం పంపారు.
Also Read:Tragedy: విగ్రహ నిమజ్జనంలో అపశృతి… 13 మంది యువకుల గల్లంతు.
“కొంతమందికి గతంలో డ్యాన్స్ షోలో కొంత డబ్బు విషయంలో అతనితో శత్రుత్వం ఉండేదని మృతుడి సోదరుడు సంజయ్ కుమార్ రెడ్డి వెల్లడించాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, నిందితులు తన సోదరుడిని పొడిచి చంపారు. కనీసం 4-5 మంది ఉన్నారని.. కానీ వారిలో ఒకరు అతనిని పొడిచి చంపారని సంజయ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..