హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.. నిత్యం ఎక్కడో చోట ప్రమాదాలు జరుగుతున్నాయి.. షార్ట్ సర్కుట్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.. తాజాగా మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. రంగారెడ్డి జిల్లా.. మైలార్ దేవులపల్లి.. టాటానగర్లో ఈ భారీ అగ్నిప్రమాదం జరిగింది. బ్లాంకెట్ గోడౌన్లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో గోడౌన్ లో 10 కార్మికులు పనులు చేసుకుంటున్నట్లు తెలిపారు.
ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల ఒక్కసారిగా బయటకు పరుగులు పెట్టారు. దాదాపు 1000 గజాల స్థలంలో ఈ గోడౌన్ ఉంది. లోపల దట్టమైన పొగతోపాటూ, మంటలు కూడా వ్యాపించాయి.. సడెన్ గా జరిగిన ఈ ప్రమాదం వల్ల కార్మికులు ఏం చెయ్యలేక ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నించారు.. ఈ ప్రమాదం పై ఫైర్ సిబ్బందికి సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు..
ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. 3 ఫైరింజన్ల ను రంగంలోకి దింపారు. అర్థరాత్రి తర్వాత షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చినట్లు భావిస్తున్నారు. ఇది పరుపుల గోడౌన్ కావడం వల్ల మంటలు త్వరగా అదుపులోకి రావట్లేదు. ఐతే.. ఇదంతా ఇల్లీగల్ గా జరుగుతోందనీ.. అక్రమంగా గోడౌన్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు గుర్తించారు.. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేసురుకున్నారు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.. ఈ ప్రమాదం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..