Uttar Pradesh: అత్యాచార బాధితురాలి తండ్రి ఆత్మహత్య.. కేసు విత్డ్రా చేసుకోవాలని ఒత్తిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్లో ఇటీవల ఇద్దరు బాలికలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. హమీర్పూర్ జిల్లాలో ఈ దారుణం జరిగిన తర్వాత ఇద్దరు బాధితురాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా బాధితురాళ్లలో ఒకరి తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. కాన్పూర్లోని ఘతంపూర్ ప్రాంతంలో ఇసుక బట్టీలో సాహూహిక అత్యాచారానికి గురైన వ్యక్తి కూతురు, మేనకోడలు కూడా ఆత్మహత్యకు పాల్పడిన కొన్ని రోజుల తర్వాత 45 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ బాలికలకు బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని కుటుంబం ఆరోపించిన నేపథ్యంలో ముగ్గురు నిందితులపై కాన్పూర్ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లోని పలు సెక్షన్ల కింద అరెస్టు చేశారు.
Read Also: Bengaluru: బెంగళూరులో వాటర్ సంక్షోభం మరింత తీవ్రం.. సర్కార్ ప్లాన్ ఇదే!
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
గ్యాంగ్ రేప్ కేసులో ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని బాధితురాలి తండ్రిపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బుధవారం అర్థరాత్రి ఒక చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హమీర్పూర్ ఎస్పీ మాట్లాడుతూ.. ఆత్మహత్యకు కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు.
కాన్పూర్ అత్యాచార ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఎక్స్ వేదికగా యోగి సర్కార్పై మండిపడ్డారు. ‘‘కాన్పూర్లో సామూహిక అత్యాచారానికి గురైన ఇద్దరు మైనర్ బాలికలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఆ బాలికల తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబంపై రాజీకి వత్తిడి తెస్తున్నారు’’ అని మండిపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ బాధిత బాలికలు, మహిళలు న్యాయం కోసం అడగాలని, ఉన్నావ్, హత్రాస్, కాన్పూర్ వరకు ఎక్కడ స్ట్రీలు హింసించబడ్డారో , వారి కుటుంబాలు కూడా నాశనం చేయబడ్డాయి., చట్టం అనేది లేకండా జంగిల్ రాజ్లో స్ట్రీలు ఉండటం నేరంగా మారింది అని ఎక్స్ వేదికగా ఆరోపించారు.
తాజావార్తలు
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్మన్ గిల్ అవుట్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!