AP Crime: కాళ్లు, చేతులు కట్టేసి.. బకెట్లో ముంచి ఇద్దరు కుమారుల హత్య.. ఆపై..
- కాకినాడలో సంచలనంగా మారిన మూడు మరణాలు..
- ఇద్దరు కుమారులను దారుణంగా హత్య చేసిన తండ్రి..
- ఆ తర్వాత తాను ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: కాకినాడలో మూడు మరణాలు ఇప్పుడు సంచలనంగా మారిపోయాయి.. ఇద్దరు కుమారులను అత్యంత దారుణంగా హత్యచేసిన ఓ తండ్రి.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.. రాష్ట్రంలో కలకలం సృష్టిచిన కాకినాడ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ వోఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు చంద్ర కిషోర్ అనే వ్యక్తి.. భార్య తనూజ.. ఇద్దరు పిల్లలతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్న చంద్రకిషోర్.. ఒకటో తరగతి చదువుతున్న పెద్ద కొడుకు జోషీల్, యూకేజీ చదువుతున్న రెండో కొడుకు నిఖిల్ను అత్యంత పాశవికంగా ప్రాణాలు తీశాడు.. ఇద్దరి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి, నీళ్ల బకెట్లలో తలల ముంచి.. ఊపిరి ఆడకుండా చేసి.. ఇద్దరని చంపేశాడు.. ఇక, పిల్లలు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత తాను ఉరి వేసుకున్న ఆత్మహత్య చేసుకున్నాడు చంద్ర కిషోర్..
Read Also: Bangladesh: బంగ్లాదేశ్లో మరోసారి హిందూ ఆలయంపై దాడి.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Also Read
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
భార్య తనూజ.. పిల్లలను హోలీ వేడుకలకు తీసుకుని వెళ్లిన చంద్ర కిషోర్.. ఆ తర్వాత పిల్లలకు యూనిఫామ్ కోసం టైలర్ దగ్గరికి తీసుకుని వెళ్తానని ఇంటికి తీసుకుని వచ్చాడు.. ఈ మధ్యనే పిల్లలు స్కూల్ మార్చినట్టుగా చెబుతున్నారు.. అయితే, ఇద్దరు కుమారులను కన్న తండ్రే ఇంత దారుణంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.. పిల్లలు చదువులో వెనకబడ్డారని హత్య చేశాడనే ఓ వాదన ఉండగా.. అసలు ఈ హత్యలు, ఆత్మహత్యల వెనుక ఏం జరిగింది.. ఏ కారణంతో ఆ తండ్రి ఇంత కిరాతకంగా మారిపోయాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. ముగ్గురి మరణాలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.. ఆత్మహత్య చేసుకున్న చంద్రకిషోర్.. సూసైడ్ నోట్ రాశాడు.. పిల్లలు పోటీ ప్రపంచంలో రాణించలేకపోతున్నారని.. దీంతో వారిని చంపేసినట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.. అయితే, భార్యను నమ్మించి.. ఇద్దరు పిల్లల్ని దారుణంగా హత్య చేశాడు..
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!