Bangladesh: బంగ్లాదేశ్లో మరోసారి హిందూ ఆలయంపై దాడి.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
- బంగ్లాదేశ్లో మరోసారి హిందూ ఆలయంపై దాడి
- విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
- పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ సాహా తెలిపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొంతకాలంగా బంగ్లాదేశ్ లో హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. హిందూ మైనారిటీలను ముస్లిం మెజారిటీ జనాభా లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహ్మద్ యూనస్ దేశంలో శాంతి భద్రతలు గాడిలో ఉన్నాయని చెబుతున్నప్పటికీ, అక్కడ హిందువులపై దాడులు ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి హిందూ దేవాలయంపై దాడి జరిగింది. లక్ష్మీపూర్ జిల్లాలోని రాయ్పూర్లోని మురిహట ప్రాంతంలోని శ్రీ శ్రీ మహామాయ ఆలయంలో ముసుగులు ధరించిన దుండగులు మహామాయ దేవి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. హోలీ పండగ వేళ ఈ సంఘటన చోటుచేసుకుంది.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
హోలీ పండుగ రోజు గురువారం సాయంత్రం ప్రార్థనలు ముగిసిన తర్వాత పూజారులు ఆలయం నుంచి వెళ్లిపోయారని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ సాహా తెలిపారు. మరుసటి రోజు పూజారి ఆలయానికి తిరిగి వచ్చినప్పుడు, దేవత విగ్రహం విరిగిపోయి, దెబ్బతిన్నట్లు కనిపించడంతో షాక్ అయ్యాడు. ఆలయంపై దాడి జరిగిందని గుర్తించిన పూజారి స్థానిక హిందూ సంఘానికి ఫోన్ చేసి జరిగిన సంఘటన గురించి తెలియజేశాడు. ఈ దారుణ ఘటన అక్కడ ఏర్పాటు చేసిన CCTV కెమెరాలో రికార్డైంది. ముసుగు ధరించిన ఒక వ్యక్తి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి, విగ్రహాన్ని ధ్వంసం చేసి, ఆపై పారిపోతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది.
Also Read:CM Chandrababu Tanuku Tour: నేడు తణుకులో సీఎం పర్యటన
ఈ సంఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ సాహా తెలిపారు. ఈ సంఘటనకు కారణమైన వారిని గుర్తించి 24 గంటల్లోగా అరెస్టు చేయాలని లక్ష్మీపూర్ పూజ ఉత్సవ్ పరిషత్ డిమాండ్ చేసింది. సమాచారం అందుకున్న రాయ్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి నిజాం ఉద్దీన్ భూయాన్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!