Krishna: స్వామీజీల వేషంతో ఎంట్రీ.. సీన్ కట్ చేస్తే..!
- పారిశ్రామికవేత్త ఇంట్లో దొంగబాబాల హల్చల్
- ఇంట్లో ఉన్న వృద్దులను అదరగొట్టారు
- తమిళనాడు ప్రాంతానికి చెందిన వాహనంలో వచ్చినట్లు గుర్తింపు
- తమిళనాడు ఆలిండియా హిందూ ఫెడరేషన్ అన్ని స్టిక్కరింగ్
- నెంబర్ ప్లేట్ అసలైనదా లేక నకిలీదా అనే దానిపై దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లా ఉయ్యూరులో స్వామీజీల పేరుతో బెదిరింపులకు దిగిన ఘటన కలకలం రేపింది. ఆకునూరు గ్రామంలో పారిశ్రామిక వేత్త ఇంటికి తమిళనాడు నుంచి వచ్చిన స్వామీజీలమని చెప్పి బెదిరింపులకు దిగటంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే శపిస్తామని వృద్ధ మహిళను బెదిరించినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ కంత్రీ బాబాలు ఎవరు? వారి మోటో ఏంటి?
కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలంలో ఉన్న ఆకునూరు గ్రామంలో ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో దొంగబాబాలు హల్చల్ చేశారు. ఏకంగా లక్ష రూపాయలు కావాలని ఇంట్లో ఉన్న వృద్దులను అదరగొట్టారు. లేదంటే శపిస్తామని చెప్పి బెదిరించారు. ఇంట్లో వృద్దులు మాత్రమే ఉండడంతో ఈ దురాగతానికి తెగబడ్డట్లు తెలుస్తోంది
Also Read
పారిశ్రామికవేత్త ఫిర్యాదుతో కేసు నమోదు
ఈ ఘటనపై పారిశ్రామికవేత్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు షురూ చేశారు. ఈ క్రమంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఉయ్యూరు రూరల్ ఎస్సై సుభాషిని బాధిత వృద్ధ మహిళతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
స్వామీజీల మాదిరిగా వచ్చిన వ్యక్తులు తమిళనాడు ప్రాంతానికి చెందిన వాహనంలో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వారు వినియోగించిన వాహనానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని టోల్ ప్లాజాతోపాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రధాన రోడ్లలో ఉన్న సిసిటీవీ ఫుటేజ్ల ఆధారంగా సేకరించారు. వారు వినియోగించిన వాహనంపై తమిళనాడు ఆలిండియా హిందూ ఫెడరేషన్ అన్ని స్టిక్కరింగ్ కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అసలు ఈ వ్యక్తులు వినియోగించిన వాహనానికి ఉన్న నెంబర్ ప్లేట్ అసలైనదా లేక నకిలీదా అనేది కూడా గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. దీంతోపాటు ఇక్కడికి రావటానికి ముందు స్థానికంగా ఉన్నటువంటి విజయవాడ గాని ఇతర ప్రాంతాల్లో ఈ వాహనం రాకపోకలు ఏమైనా జరిగాయా? అనేది పరిశీలిస్తున్నారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అయి ఉంటుందని అనుమానం
ప్రస్తుతం లభించిన సీసీ ఫుటేజీ క్లూ ఆధారంగా అసలు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. వచ్చిన వారు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!