Krishna: స్వామీజీల వేషంతో ఎంట్రీ.. సీన్ కట్ చేస్తే..!
- పారిశ్రామికవేత్త ఇంట్లో దొంగబాబాల హల్చల్
- ఇంట్లో ఉన్న వృద్దులను అదరగొట్టారు
- తమిళనాడు ప్రాంతానికి చెందిన వాహనంలో వచ్చినట్లు గుర్తింపు
- తమిళనాడు ఆలిండియా హిందూ ఫెడరేషన్ అన్ని స్టిక్కరింగ్
- నెంబర్ ప్లేట్ అసలైనదా లేక నకిలీదా అనే దానిపై దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లా ఉయ్యూరులో స్వామీజీల పేరుతో బెదిరింపులకు దిగిన ఘటన కలకలం రేపింది. ఆకునూరు గ్రామంలో పారిశ్రామిక వేత్త ఇంటికి తమిళనాడు నుంచి వచ్చిన స్వామీజీలమని చెప్పి బెదిరింపులకు దిగటంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే శపిస్తామని వృద్ధ మహిళను బెదిరించినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ కంత్రీ బాబాలు ఎవరు? వారి మోటో ఏంటి?
కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలంలో ఉన్న ఆకునూరు గ్రామంలో ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో దొంగబాబాలు హల్చల్ చేశారు. ఏకంగా లక్ష రూపాయలు కావాలని ఇంట్లో ఉన్న వృద్దులను అదరగొట్టారు. లేదంటే శపిస్తామని చెప్పి బెదిరించారు. ఇంట్లో వృద్దులు మాత్రమే ఉండడంతో ఈ దురాగతానికి తెగబడ్డట్లు తెలుస్తోంది
Also Read
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
- Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
పారిశ్రామికవేత్త ఫిర్యాదుతో కేసు నమోదు
ఈ ఘటనపై పారిశ్రామికవేత్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు షురూ చేశారు. ఈ క్రమంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఉయ్యూరు రూరల్ ఎస్సై సుభాషిని బాధిత వృద్ధ మహిళతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
స్వామీజీల మాదిరిగా వచ్చిన వ్యక్తులు తమిళనాడు ప్రాంతానికి చెందిన వాహనంలో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వారు వినియోగించిన వాహనానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని టోల్ ప్లాజాతోపాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రధాన రోడ్లలో ఉన్న సిసిటీవీ ఫుటేజ్ల ఆధారంగా సేకరించారు. వారు వినియోగించిన వాహనంపై తమిళనాడు ఆలిండియా హిందూ ఫెడరేషన్ అన్ని స్టిక్కరింగ్ కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అసలు ఈ వ్యక్తులు వినియోగించిన వాహనానికి ఉన్న నెంబర్ ప్లేట్ అసలైనదా లేక నకిలీదా అనేది కూడా గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. దీంతోపాటు ఇక్కడికి రావటానికి ముందు స్థానికంగా ఉన్నటువంటి విజయవాడ గాని ఇతర ప్రాంతాల్లో ఈ వాహనం రాకపోకలు ఏమైనా జరిగాయా? అనేది పరిశీలిస్తున్నారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అయి ఉంటుందని అనుమానం
ప్రస్తుతం లభించిన సీసీ ఫుటేజీ క్లూ ఆధారంగా అసలు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. వచ్చిన వారు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
విరాట్ కోహ్లీ వాడే ‘హూప్’ కి పోటీగా Google Fitbit Air.. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..
-
RRB JE Recruitment 2026: 4,098 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఫీజు, దరఖాస్తు విధానం ఇవే
-
Realme P4s Lite: రియల్మీ P4s లైట్.. 7000mAh బ్యాటరీతో చౌకైన ఫోన్.. ఫీచర్లు అదిరిపోయేలా!
-
Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
-
India – Pakistan: మొదట భారత్ తరఫున ఆడి.. ఆ తర్వాత పాకిస్థాన్ తరఫున ఆడిన క్రికెటర్లు వీరే..!
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!