మద్యం మత్తులో స్టీరింగ్ పట్టిన నలుగురు యువకులు ఒక కుటుంబాన్ని చీకట్లోకి నెట్టారు. రాజమండ్రిలో అర్ధరాత్రి రోడ్లపై రేసింగ్ చేస్తూ పలుచోట్ల ప్రమాదాలు చేశారు పోకిరీ యువకులు. చివరికి వారి నిర్లక్ష్యం కారణంగా ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
కృష్ణా జిల్లా ఉయ్యూరులో స్వామీజీల పేరుతో బెదిరింపులకు దిగిన ఘటన కలకలం రేపింది. ఆకునూరు గ్రామంలో పారిశ్రామిక వేత్త ఇంటికి తమిళనాడు నుంచి వచ్చిన స్వామీజీలమని చెప్పి బెదిరింపులకు దిగటంతో