Murder : ఏలూరులో ఆస్తి వివాదంలో తల్లిపై కొడుకు దాడి
- లక్ష్మీనరసమ్మకు ఓ కొడుకు, కూతురు
- ఇటీవలే భర్త మృతితో ఒంటరిగా జీవితం
- భార్యతో కలిసి వేరుగా ఉంటున్న కొడుకు శివాజీ
- ఇల్లుతోపాటు మిగతా ఆస్తులు తన పేరిట రాయాలని శివాజీ వేధింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్న తల్లి అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ కొంత మందికి ఆస్తులపై ఉన్న ప్రేమ.. సొంత వారు.. కన్నవారిపైన ఉండడం లేదు. పైగా తుచ్ఛమైన డబ్బు, ఆస్తుల కోసం కన్నవారిని హత్య చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. తాజాగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో సైతం ఇలాంటి ఘటనే జరిగింది. కానీ ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఓ కసాయి కొడుకు.. కన్న తల్లిపైనే కొడవలి ఎత్తాడు. తుచ్ఛమైన ఆస్తి కోసం తల్లిని చంపేందుకు కూడా వెనుకాడ లేదు..
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఉంటున్న జక్కు లక్ష్మీనరసమ్మకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కూతురుకు చాలా కాలం క్రితమే వివాహమైంది. ఇటీవలే భర్త మృతి చెందాడు. కొడుకుకు కూడా పెళ్లి చేసింది. కానీ భార్యతో కలిసి వేరే కాపురం ఉంటున్నాడు కొడుకు శివాజీ. ఐతే లక్ష్మీ నరసమ్మ మాత్రం తన సొంత ఇంటిలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె ఉంటున్న ఇల్లుతోపాటు మిగతా ఆస్తులు తన పేరిట రాయాలని శివాజీ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. ఆమెను వాటి కోసం వేధిస్తున్నాడు..
Also Read
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
నిజానికి శివాజీ.. దేవరపల్లి మండలం బుచ్చయ్యపాలెంలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. కానీ తన పని మానేసి.. ఆస్తులు కావాలని తల్లి వెంట పడ్డాడు. ఆమె అంగీకరించకపోవడంతో కొయ్యలగూడెంలో పట్టపగలే అందరూ చూస్తుండగానే రోడ్డు మీద తల్లిపై కొడవలితో దాడి చేశాడు. దీంతో ఆమె తల, మెడతోపాటు శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. ఫలితంగా రక్తస్రావంతో అక్కడే ఆమె కుప్ప కూలిపోయింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం కాకినాడ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు… తల్లి లక్ష్మీనరసమ్మపై హత్యా యత్నం చేసిన కొడుకు శివాజీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నాడు. ఆస్తుల కోసం కన్న తల్లి మీద దాడి చేసిన కొడుకును కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!