Murder : ఏలూరులో ఆస్తి వివాదంలో తల్లిపై కొడుకు దాడి
- లక్ష్మీనరసమ్మకు ఓ కొడుకు, కూతురు
- ఇటీవలే భర్త మృతితో ఒంటరిగా జీవితం
- భార్యతో కలిసి వేరుగా ఉంటున్న కొడుకు శివాజీ
- ఇల్లుతోపాటు మిగతా ఆస్తులు తన పేరిట రాయాలని శివాజీ వేధింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్న తల్లి అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ కొంత మందికి ఆస్తులపై ఉన్న ప్రేమ.. సొంత వారు.. కన్నవారిపైన ఉండడం లేదు. పైగా తుచ్ఛమైన డబ్బు, ఆస్తుల కోసం కన్నవారిని హత్య చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. తాజాగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో సైతం ఇలాంటి ఘటనే జరిగింది. కానీ ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఓ కసాయి కొడుకు.. కన్న తల్లిపైనే కొడవలి ఎత్తాడు. తుచ్ఛమైన ఆస్తి కోసం తల్లిని చంపేందుకు కూడా వెనుకాడ లేదు..
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఉంటున్న జక్కు లక్ష్మీనరసమ్మకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కూతురుకు చాలా కాలం క్రితమే వివాహమైంది. ఇటీవలే భర్త మృతి చెందాడు. కొడుకుకు కూడా పెళ్లి చేసింది. కానీ భార్యతో కలిసి వేరే కాపురం ఉంటున్నాడు కొడుకు శివాజీ. ఐతే లక్ష్మీ నరసమ్మ మాత్రం తన సొంత ఇంటిలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె ఉంటున్న ఇల్లుతోపాటు మిగతా ఆస్తులు తన పేరిట రాయాలని శివాజీ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. ఆమెను వాటి కోసం వేధిస్తున్నాడు..
Also Read
- Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్కుమార్పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
నిజానికి శివాజీ.. దేవరపల్లి మండలం బుచ్చయ్యపాలెంలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. కానీ తన పని మానేసి.. ఆస్తులు కావాలని తల్లి వెంట పడ్డాడు. ఆమె అంగీకరించకపోవడంతో కొయ్యలగూడెంలో పట్టపగలే అందరూ చూస్తుండగానే రోడ్డు మీద తల్లిపై కొడవలితో దాడి చేశాడు. దీంతో ఆమె తల, మెడతోపాటు శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. ఫలితంగా రక్తస్రావంతో అక్కడే ఆమె కుప్ప కూలిపోయింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం కాకినాడ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు… తల్లి లక్ష్మీనరసమ్మపై హత్యా యత్నం చేసిన కొడుకు శివాజీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నాడు. ఆస్తుల కోసం కన్న తల్లి మీద దాడి చేసిన కొడుకును కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Uttar Pradesh: అజాంఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్పై యోగి బుల్డోజర్ యాక్షన్..
-
Trump: ట్రంప్ చిత్రంతో బంగారు నాణెం విడుదల.. ప్రత్యేకత ఇదే
-
CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
-
Sutlej: సట్లజ్ వివాదం.. ZEE5పై చర్యలకు కేంద్రం సిద్ధం..
-
Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!