Murder : ఏలూరులో ఆస్తి వివాదంలో తల్లిపై కొడుకు దాడి
- లక్ష్మీనరసమ్మకు ఓ కొడుకు, కూతురు
- ఇటీవలే భర్త మృతితో ఒంటరిగా జీవితం
- భార్యతో కలిసి వేరుగా ఉంటున్న కొడుకు శివాజీ
- ఇల్లుతోపాటు మిగతా ఆస్తులు తన పేరిట రాయాలని శివాజీ వేధింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్న తల్లి అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ కొంత మందికి ఆస్తులపై ఉన్న ప్రేమ.. సొంత వారు.. కన్నవారిపైన ఉండడం లేదు. పైగా తుచ్ఛమైన డబ్బు, ఆస్తుల కోసం కన్నవారిని హత్య చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. ఇటీవల ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. తాజాగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో సైతం ఇలాంటి ఘటనే జరిగింది. కానీ ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఓ కసాయి కొడుకు.. కన్న తల్లిపైనే కొడవలి ఎత్తాడు. తుచ్ఛమైన ఆస్తి కోసం తల్లిని చంపేందుకు కూడా వెనుకాడ లేదు..
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో ఉంటున్న జక్కు లక్ష్మీనరసమ్మకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కూతురుకు చాలా కాలం క్రితమే వివాహమైంది. ఇటీవలే భర్త మృతి చెందాడు. కొడుకుకు కూడా పెళ్లి చేసింది. కానీ భార్యతో కలిసి వేరే కాపురం ఉంటున్నాడు కొడుకు శివాజీ. ఐతే లక్ష్మీ నరసమ్మ మాత్రం తన సొంత ఇంటిలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె ఉంటున్న ఇల్లుతోపాటు మిగతా ఆస్తులు తన పేరిట రాయాలని శివాజీ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. ఆమెను వాటి కోసం వేధిస్తున్నాడు..
Also Read
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
నిజానికి శివాజీ.. దేవరపల్లి మండలం బుచ్చయ్యపాలెంలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. కానీ తన పని మానేసి.. ఆస్తులు కావాలని తల్లి వెంట పడ్డాడు. ఆమె అంగీకరించకపోవడంతో కొయ్యలగూడెంలో పట్టపగలే అందరూ చూస్తుండగానే రోడ్డు మీద తల్లిపై కొడవలితో దాడి చేశాడు. దీంతో ఆమె తల, మెడతోపాటు శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. ఫలితంగా రక్తస్రావంతో అక్కడే ఆమె కుప్ప కూలిపోయింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం కాకినాడ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు… తల్లి లక్ష్మీనరసమ్మపై హత్యా యత్నం చేసిన కొడుకు శివాజీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నాడు. ఆస్తుల కోసం కన్న తల్లి మీద దాడి చేసిన కొడుకును కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!