Doctor Krithika Reddy Murder Mystery: డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ..! వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- బెంగళూరులో సంచలనం సృష్టించిన డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసు..
- డాక్టర్ హత్య కేసులో వీడుతోన్న మిస్టరీ..
- ఆమె భర్త, జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Doctor Krithika Reddy Murder Mystery: బెంగళూరులో సంచలనం సృష్టించిన డాక్టర్ కృతికా రెడ్డి హత్య కేసు మిస్టరీ వీడుతోంది. ఈ కేసులో ఆమె భర్త, జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆపరేషన్ థియేటర్లలో మాత్రమే ఉపయోగించే ప్రొపోఫోల్ అనే మత్తు మందును ఉపయోగించి ఈ హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తర్వాత నిందితుడు తన మకాంను బెంగళూరు నుంచి ఉడుపి జిల్లా మణిపాల్ కు మార్చాడు. ఈ మధ్యాహ్నం పోలీసులు అతన్ని మణిపాల్ లో అరెస్ట్ చేశారు. బెంగళూరులో విచారణ సాగుతోంది. కాగా, మహేంద్ర రెడ్డి, కృతికా రెడ్డి ఇద్దరూ డాక్టర్లే. బెంగళూరు విక్టోరియా ఆసుపత్రిలో పని చేసేవాళ్లు. కృతికా రెడ్డి డెర్మటాలజిస్ట్. తల్లిదండ్రులు మారతహళ్లిలో నివసిస్తోన్నారు. ఒకే ఆసుపత్రిలో పని చేస్తోండటం, డాక్టర్లే కావడం వల్ల మహేంద్ర రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. 2024 మే 26వ తేదీన వారి పెళ్లి జరిగింది. ఏడాది కూడా తిరగక ముందే కృతికా రెడ్డి హత్యకు గురి కావడం సంచలనం రేపింది. ఆమె హత్యలో సినిమాటిక్ కోణాలు వెలుగులోకి వచ్చాయి.
Read Also: Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొననున్న పవన్..?
Also Read
మొదట్లో ఆమెది సహజ మరణంగా భావించారు. దీని తర్వాత మహేంద్ర రెడ్డి మణిపాల్ కు షిఫ్ట్ అయ్యాడు. అక్కడే క్లినిక్ తెరిచాడు. రేడియాలజిస్ట్ అయిన కృతిక అక్క డాక్టర్ నిఖితా రెడ్డికి అనుమానం వచ్చింది. సమగ్ర విచారణకు ఆమె పట్టుబట్టారు. ఆరు నెలల తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) నివేదిక వెలుగులోకి వచ్చింది. కృతిక శరీరంలో అనేక అవయవాల్లో ప్రొపోఫోల్ ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్ లో తేలింది. కేసును తిరగరాశారు. మహేంద్ర రెడ్డిని అరెస్ట్ చేశారు. విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తోన్నాయి. కృతిక రెడ్డి మరణించిన వెంటనే తన ప్రియురాలికి మెసేజీ పంపాడు మహేంద్ర రెడ్డి. “నీ కోసమే కట్టుకున్న భార్యను చంపేశాను” అని అందులో ఉంది. డిజిటల్ పేమెంట్ యాప్ ద్వారా తన ప్రియురాలికి ఈ మెసేజీ పంపినట్లు తేలింది. అతని ఫోన్ను ఫోరెన్సిక్ లో విశ్లేషించినప్పుడు ఈ వ్యవహారం బయటపడిందని పోలీసులు తెలిపారు. ఆ మహిళను కూడా ప్రశ్నించారు. వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆమె ఎవరనేది ఇంకా వెల్లడించలేదు.
బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ ఈ వివరాలను వెల్లడించారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాలన్నీ కూడా డాక్టర్ మహేంద్ర రెడ్డి ప్రమేయం ఉన్నట్లు తేల్చాయని, త్వరలోనే ఛార్జిషీట్ నమోదు చేస్తామని అన్నారు. కృతికా రెడ్డి ఆరోగ్యం క్షీణించడానికి కొన్ని మత్తు మందులు, ప్రమాదకర ఇంజెక్షన్లు ఇచ్చాడని దర్యాప్తులో వెల్లడైందని అన్నారు. భార్య ఆరోగ్యం బాగా లేదంటూ అతనే తొలుత ఆసుపత్రిలో అడ్మిట్ చేయించినప్పటికీ.. దానికి ప్రధాన కారకుడు భర్తేనని చెప్పారు.
తాజావార్తలు
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
-
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!