Gujarat: 90 ఏళ్ల వృద్ధుడు డిజిటల్ అరెస్ట్.. రూ.కోటి నగదు మాయం
- 90 ఏళ్ల వృద్ధుడు డిజిటల్ అరెస్ట్
- రూ.కోటి నగదు మాయం
- గుజరాత్లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో సైబర్ స్కామ్లు పెరిగిపోతున్నాయి. అమాయకులను లక్ష్యంగా చేసుకుని కేటుగాళ్లు నగదు దొంగిలిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ చేసి కోట్లు కొల్లగొడుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్లో చోటుచేసుకుంది.

Also Read
గుజరాత్కు చెందిన 90 ఏళ్ల వృద్ధుడిని చైనాలో ఓ ముఠాతో కలిసి రాకెట్ నడిపిస్తున్న గ్యాంగ్ డిజిటల్ అరెస్ట్ చేసి రూ.కోటి నొక్కేశారు. సీబీఐ అధికారులుగా నటిస్తూ 15 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్లో ఉంచారు. పార్శిల్లో డ్రగ్స్ దొరికాయని బెదిరింపులకు దిగారు. మీ పేరు మీద ముంబై నుంచి చైనాకు కొరియర్ పంపినట్లు హడలెత్తించారు. అతని బ్యాంకు ఖాతా నుంచి ముఠా సభ్యులు రూ. 1,15,00,000 బదిలీ చేసుకున్నారు. సంఘటన గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు సూరత్ సైబర్ పోలీసులకు అక్టోబర 29న ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఐదుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి పార్థ్ గోపాని కోసం గాలిస్తున్నారు. పార్థ్ గోపానీ కంబోడియాలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వృద్ధుడు సంపాదించిన కోటి రూపాయులు కేటుగాళ్లు నొక్కేయడంతో లబోదిబో అంటున్నాడు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) భవేష్ రోజియా మాట్లాడుతూ.. స్టాక్ మార్కెట్లో వ్యాపారం చేసే సీనియర్ సిటిజన్కు స్కామ్స్టర్లలో ఒకరి నుంచి వాట్సాప్ కాల్ వచ్చిందని, అతను తనను తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నాడని తెలిపారు. ముంబయి నుంచి చైనాకు సీనియర్ సిటిజన్ పేరుతో కొరియర్లో పంపిన పార్శిల్లో 400 గ్రాముల ఎండీ డ్రగ్స్ లభించినట్లు బెదిరించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేస్తామని బెదిరించారు. విచారణ పేరుతో 15 రోజులు ఏడిపించారు. మొత్తానికి రూ.కోటికిపైగా నగదు నొక్కేశారు. అరెస్టయిన వారి నుంచి వివిధ బ్యాంకులకు చెందిన 46 డెబిట్ కార్డులు, 23 బ్యాంక్ చెక్ బుక్లు, ఒక వాహనం, నాలుగు వేర్వేరు సంస్థల రబ్బర్ స్టాంపులు, 9 మొబైల్ ఫోన్లు, 28 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు రమేష్ సురానా, ఉమేష్ జింజాలా, నరేష్ సురానా, రాజేష్ దేవరా, గౌరంగ్ రఖోలియా ఉన్నారు.

తాజావార్తలు
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
-
Manity: వేల కోట్ల టార్గెట్’తో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ?