Delhi: ఢిల్లీలో కలకలం.. పార్కింగ్ కారులో మృ*తదేహాలు
- దేశ రాజధాని ఢిల్లీలో దారుణం
- పార్క్ చేసి ఉన్న కారులో 3 మృతదేహాలు
- పీరాగఢి ఫ్లైఓవర్ వద్ద పార్క్ చేసి ఉన్న కారు
- ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు
- సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీ నగరంలోని పీరాగడి ఫ్లైఓవర్ సమీపంలో ఒక కారులో మూడు మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. రోడ్డు పక్కన అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మొదట ఆ కారులో పేలుడు పదార్థాలు ఏవైనా ఉన్నాయేమోనని అందరూ భయాందోళనలకు గురైనప్పటికీ, పోలీసులు వచ్చి తనిఖీ చేయగా లోపల ముగ్గురు వ్యక్తులు నిర్జీవంగా పడి ఉండటం చూసి షాక్కు గురయ్యారు.
కారులో మరణించిన వారిని లక్ష్మి, రణధీర్, , శివనారాయణలుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో ఒక మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతదేహాలు లభ్యమైన కారు పీరాగడి ఫ్లైఓవర్ వద్ద అనుమానాస్పద స్థితిలో నిలిపి ఉంచబడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
ఈ మరణాలకు సంబంధించి పోలీసులు పలు కోణాల్లో విచారణను ముమ్మరం చేశారు. మృతులు ముగ్గురు విషం (Poison) తాగి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే, వారు అక్కడే ఆత్మహత్య చేసుకున్నారా? లేక మరెక్కడైనా మరణించిన తర్వాత వారిని ఈ కారులో తీసుకువచ్చి ఇక్కడ వదిలిపెట్టారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ మిస్టరీని ఛేదించడానికి ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కేసులో నిజానిజాలను వెలికితీసేందుకు పోలీసులు సాంకేతిక ఆధారాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పీరాగడి ఫ్లైఓవర్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆ కారు ఎక్కడి నుండి వచ్చింది? కారును అక్కడ ఎవరు పార్క్ చేశారు? వంటి వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు క్లూస్ టీమ్ , ఫారెన్సిక్ నిపుణులు కారు లోపల ఉన్న వేలిముద్రలు , ఇతర కీలక ఆధారాలను సేకరించారు. ఈ మరణాల వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో కూడా ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
ట్రెండింగ్
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!