Delhi: ఢిల్లీలో కలకలం.. పార్కింగ్ కారులో మృ*తదేహాలు
- దేశ రాజధాని ఢిల్లీలో దారుణం
- పార్క్ చేసి ఉన్న కారులో 3 మృతదేహాలు
- పీరాగఢి ఫ్లైఓవర్ వద్ద పార్క్ చేసి ఉన్న కారు
- ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు
- సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీ నగరంలోని పీరాగడి ఫ్లైఓవర్ సమీపంలో ఒక కారులో మూడు మృతదేహాలు లభ్యం కావడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. రోడ్డు పక్కన అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన కారును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మొదట ఆ కారులో పేలుడు పదార్థాలు ఏవైనా ఉన్నాయేమోనని అందరూ భయాందోళనలకు గురైనప్పటికీ, పోలీసులు వచ్చి తనిఖీ చేయగా లోపల ముగ్గురు వ్యక్తులు నిర్జీవంగా పడి ఉండటం చూసి షాక్కు గురయ్యారు.
కారులో మరణించిన వారిని లక్ష్మి, రణధీర్, , శివనారాయణలుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో ఒక మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతదేహాలు లభ్యమైన కారు పీరాగడి ఫ్లైఓవర్ వద్ద అనుమానాస్పద స్థితిలో నిలిపి ఉంచబడింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
ఈ మరణాలకు సంబంధించి పోలీసులు పలు కోణాల్లో విచారణను ముమ్మరం చేశారు. మృతులు ముగ్గురు విషం (Poison) తాగి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే, వారు అక్కడే ఆత్మహత్య చేసుకున్నారా? లేక మరెక్కడైనా మరణించిన తర్వాత వారిని ఈ కారులో తీసుకువచ్చి ఇక్కడ వదిలిపెట్టారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ మిస్టరీని ఛేదించడానికి ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కేసులో నిజానిజాలను వెలికితీసేందుకు పోలీసులు సాంకేతిక ఆధారాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పీరాగడి ఫ్లైఓవర్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆ కారు ఎక్కడి నుండి వచ్చింది? కారును అక్కడ ఎవరు పార్క్ చేశారు? వంటి వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు క్లూస్ టీమ్ , ఫారెన్సిక్ నిపుణులు కారు లోపల ఉన్న వేలిముద్రలు , ఇతర కీలక ఆధారాలను సేకరించారు. ఈ మరణాల వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో కూడా ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
-
Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
-
Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్’ సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్బస్టర్
-
USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?