Delhi: 25 ఏళ్ల మహిళకు మత్తుమందు ఇచ్చి, అత్యాచారం చేసిన డ్రైవర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. భర్తను కలుసుకునేందుకు వెళ్తున్న మహిళపై ఈ-రిక్షా డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెకు మత్తుమందు ఇచ్చి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. నిందితుడు మహమ్మద్ ఉమర్(24)ని ఉత్తర ఢిల్లీలోని కోట్వాలీ ఏరియా నుంచి అరెస్ట్ చేశారు. ‘‘ 26 మే రోజున దోపిడి గురించి పోలీస్ కంట్రోల్ రూంకి ఓ కాల్ వచ్చింది.’’ అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన స్థలానికి పోలీసులు వెళ్లే సమయానికి మహిళ రక్తమోడుతూ ఉందని, పక్కనే ఆమె మూడేళ్ల కుమారుడు ఉన్నట్లు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్(నార్త్) మనోజ్ కుమార్ మీనా తెలిపారు.
Read Also: Anand Deverakonda: అందుకే ఆనంద్ కరెక్ట్ ఆప్షన్ అనిపించింది: దర్శకుడు ఉదయ్ ఇంటర్వ్యూ
Also Read
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
మహిళని వెంటనే మెడికల్ పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే, మే 26న బాధిత మహిళ బీహార్ నుంచి తన మూడేళ్ల కొడుకుతో కలిసి పంజాబ్లో ఉన్న తన భర్తను కలిసేందుకు వెళ్తోంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి సర్దార్ మార్కెట్ వెళ్లింది. ఈ-రిక్షా ద్వారా తిరిగి మళ్లీ స్టేషన్ వచ్చే క్రమంలో, దాని డ్రైవర్ మహ్మద్ ఉమర్ మహిళకు కూల్డ్రింక్ అందించాడు. అది తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు ఆమెపై అత్యాచారం చేశాడు. ప్రతిఘటించినందుకు తలపై రాయితో దాడి చేసినట్లు ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయినట్లు, మెలుకువ వచ్చిన తర్వాత తన మొబైల్ ఫోన్, రూ.3000 దొంగలించబడినట్లు చెప్పింది. దాదాపుగా 500 సీసీటీపీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 150 వరకు ఆటో రిక్షా డ్రైవర్లను విచారించిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకుని హత్యయత్నం, అత్యాచారం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!