Delhi: పబ్లిక్ ప్లేస్లో మద్యం సేవించొద్దని మందలించినందుకు ఓ కానిస్టేబుల్ని ఇద్దరు చంపారు. ఈ ఘటన సెప్టెంబర్ 29న ఢిల్లీలో జరిగింది. ఔటర్ ఢిల్లీలో రోడ్డుపై మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను మందలించిన 30 ఏళ్ల కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడని పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ ఘటనపై 400 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారు.