బంగారం అక్రమ రవాణాకు దేన్నీ వదలడం లేదు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న 18 లక్షల విలు చేసే బంగారం, ఐ ఫోన్ లతో పాటు పెర్ప్యూమ్ బాటిల్స్ ను సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని, ఐ ఫోన్లను, పెర్ప్యూమ్ బాటిల్స్ లగేజ్ బ్యాగ్ లో దాచి తరలించే ప్రయత్నం చేశారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్కానింగ్ లో బయట పడ్డ స్మగ్లింగ్ వస్తువులు చూసి అంతా అవాక్కయ్యారు. బంగారం, ఐ ఫోన్ లతో పాటు పెర్ప్యూమ్ బాటల్స్ సీజ్. ప్రయాణీకుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. ఈమధ్యకాలంలో అంతర్జాతీయ కస్టమర్లు ఇతర దేశాల నుంచి తెచ్చుకునే వస్తువుల్లో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారు.