Cows Thieves: ఖరీదైన కార్లలో వస్తారు.. రెక్కీ చేసి ఆవును కారులో కుక్కేస్తారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cows Thieves: కాదేదీ దొంగతనానికి అనర్హం అన్నట్లు రెచ్చిపోతున్నారు దొంగలు. ఇప్పటి వరకు ధనవంతుల ఇండ్లు టార్గెట్ చేసి ఖరీదైన బంగారు ఆభరణాలు, డబ్బు దొంగతనం చేసుకుని వెళ్లేవారు. ఇప్పుడు కొంత మంది దొంగలు రోడ్ల మీద ఉన్న పశువులను కూడా వదలడం లేదు. అర్థరాత్రి వచ్చి వాటిని దర్జాగా ఎత్తుకు వెళ్లిపోతున్నారు. మొన్న హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్.. తాజాగా తిరుపతిలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఇంతా చేసి వారు దోచుకు వెళ్లేది ఏదైనా ఖరీదైన వస్తువులో ఏమో అనుకుంటే పొరపాటే. రోడ్లపై ఉన్న ఆవులే వారి టార్గెట్. అర్ధరాత్రి రోడ్లపై ఉన్న పశువుల వద్దకు నెమ్మదిగా వెళ్తారు. వాటికి మత్తు ఇంజక్షన్ ఇస్తారు. దాంతో ఆవులు.. మత్తులోకి జారుకుంటాయి. వెంటనే వాటిని నెమ్మదిగా.. అంతకు ముందే రెడీ చేసుకుని తెచ్చుకున్న కారు వద్దకు తీసుకు వెళ్తారు. ఆవును కారులో కుక్కేస్తారు. అక్కడి నుంచి పారిపోతారు. ఇదీ వారి తంతు.
Also Read
- Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ...
- HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
- HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
- Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
Students Gang War: మరోసారి కన్నెర్ర చేసిన ర్యాగింగ్ భూతం.. కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు!
తిరుపతి రూరల్ మండలం ఓటేరులో సరిగ్గా ఇలాగే జరిగింది. పశువుల చోరీకి పాల్పడ్డారు కొంత మంది దుండగులు. అర్థరాత్రి వేళ రెండు ఆవులను కారులో ఎత్తుకెళ్లారు. తల్లి ఆవును తీసుకు వెళ్తున్న క్రమంలో వాటి దూడలు కొంత దూరం కారును వెంబడించాయి. చోరీతోపాటు దూడలు వెళ్తున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మరోవైపు ఆవుల యజమాని చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. రాత్రి సమయంలో పశువులను దొంగలిస్తున్న నలుగురుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పశువులను దొంగిలించి ఇతర ప్రాంతాల్లో తక్కువ ధరకు అమ్ముతున్నట్లుగా గుర్తించారు. దొంగలు హైదరాబాద్, అశ్వరావుపేటకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. దొంగల వద్ద నుంచి ఒక బోలారో వాహనం, ఒక బైక్, మూడు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.
POCSO Case: ఛీ.. ఛీ.. ప్రియుడితో కన్న కూతురిపైనే అత్యాచారం చేయించిన తల్లి!
మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ముథోల్లో కూడా సేమ్ సీన్ జరిగింది. కొంత మంది దుండగులు అర్ధరాత్రి కారులో వచ్చి రెండు ఎడ్లు, ఒక ఆవును దొంగిలించారు. ఈ కేసును ఛేదించిన పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆవులకు మత్తు మందు ఇచ్చి అపహరించి కారులో ఎత్తుకుపోతున్నట్లు గుర్తించారు పోలీసులు. గతంలో హైదరాబాద్లో ఆవులను కారులో ఎత్తుకెళ్లారు దుండగులు. సికింద్రాబాద్ బండిమేట్ ప్రాంతంలో కొందరు యువకులు రాత్రి సమయల్లో ఖరీదైన కారులో వచ్చారు. నేరుగా ఆవుల వద్దకు వెళ్లి మత్తు మందు ఇచ్చారు. అవి సృహ కోల్పోయిన తర్వాత వాటిని కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. దీనిపై సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా ఇవే ఘటనలు జరగడంతో జనం ఆందోళన చెందుతున్నారు. అర్ధరాత్రి పూట పశువులకు కూడా రక్షణ లేదని చెబుతున్నారు. నిందితులను గుర్తించి.. కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!