Kidney Fraud: కిడ్నీకి రూ.2 కోట్లు వస్తాయని తెలిసి ఆ చార్టర్డ్ అకౌంటెంట్.. చివరకు..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా బెంగళూరు నగరానికి చెందిన ఓ చార్టర్డ్ అకౌంటెంట్ కాస్త ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయాడు. హౌస్, కార్ ఇలా కొన్ని ఈఎమ్ఐలను చెల్లించలేక కాస్త చిక్కుల్లో పడ్డాడు. దీనితో అతను ఆర్థిక కష్టాల నుంచి బయట పడేందుకు ఏకంగా ఆయన తన కిడ్నీని అమ్మాలని భావించాడు. ఇందుకోసం మొదటగా ఆన్ లైన్ లో సెర్చ్ మొదలు పెట్టగా అతడికి ఏదో ఓ వెబ్ సైట్ కనపడింది. అందులో ఉన్నఫోన్ నెంబర్ కు కాల్ చేసి తాను కిడ్నీ అమ్మాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. ఈ నేపథ్యంలో అవతల ఉన్న వ్యక్తి చార్టర్డ్ అకౌంటెంట్ పూర్తి వివరాలు తీసుకున్నాడు. అలా వివరాలు తీసుకున్న వ్యక్తి ఒక కిడ్నీకి ఏకంగా రూ.2 కోట్లు ఇస్తానని నమ్మపలికాడు. అంతేకాదండోయ్.. ముందుగానే సగం అమౌంట్ అంటే ఏకంగా రూ. కోటి అడ్వాన్స్ ఇస్తామని కూడా తెలిపాడు.
అయితే ఈ స్కామ్ ను నిజమని నమ్మిన చార్టర్డ్ అకౌంటెంట్ కిడ్నీ దానానికి ఓకే చెప్పేసాడు. దీనితో మోసం చేసిన నిందితులు మొదటగా చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి ఆధార్, పాన్ కార్డు, ఈమెయిల్ ఐడీ లాంటి తదితర వివరాలను తీసుకున్నారు. ఇందులో భాగంగానే కిడ్నీ దానానికి ఎన్ఓసీ (NOC) కావాలంటూ చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి తొలుత రూ.8 వేలు తీసుకున్నారు. ఆఫై పర్ఛేజ్ కోడ్ అంటూ మరో రూ.20 వేలు కూడా నొక్కేశారు. అంతేకాదు ఆ తర్వాత కూడా కోడ్ ఆపరేట్ చేసేందుకు అంటూ మరో రూ.85 వేలు అతడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఆపై చార్టర్డ్ అకౌంటెంట్ కి రూ. కోటి అడ్వాన్స్ చెల్లించేందుకు టాక్స్ క్లియరెన్స్ చేయాలనీ అందుకు గాను మరో రూ.5 లక్షలు కూడా అతడి నుంచి లాగేసారు.
Also Read
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
- Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
ఇంతటితో ఆగకుండా మోసగాళ్లు మరో మహిళతో తాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగినంటూ అతడికి కాల్ చేసి… టెర్రరిస్టు క్లియరెన్స్, యాంటీ డ్రగ్ లాంటి పర్మిషన్స్ తెచ్చుకునేందుకు మరో రూ 7.6 లక్షలను చెల్లించాలని కోరగా.. ఇలా రకరకాల కారణాలతో తన నుంచి డబ్బులు లాగుతుండడంతో బాధితుడికి అనుమానం మొదలయింది. దాంతో ఈ విషయాన్ని బాస్ తో పాటు తన మిత్రులకు వాకబు చేశాడు. దాంతో తాను మోసపోయినట్టు వారు తెలపడంతో చివరికి అతను లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. దాంతో పోలీసులు సదరు సైబర్ నిందితుల పై ఐటీ చట్టం, ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి., ఆ నిందితుల అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేయించారు.
తాజావార్తలు
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
-
CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
-
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!