MP News: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. ఇస్లాంలోకి మారాలని బ్లాక్మెయిల్..
- మధ్యప్రదేశ్లో దారుణం..
- 4 కార్లలో ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం..
- బ్లాక్మెయిల్ చేస్తూ ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP News: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్(11వ తరగతి) చదువుతున్న విద్యార్థినిపై నాలుగు కార్లలో అత్యాచారం, చేసి ఆమె వీడియోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేశారు. ఇదే కాకుండా ఆమెపై పలుమార్లు లైంగిక దాడి చేశారు. బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చడానికి ప్రయత్నించిన ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
షాపురా ప్రాంతంలోని ఒక ప్రతిష్టాత్మక స్కూల్లో చదువుతున్న బాలికకు ఒక స్నేహితుడి ద్వారా ఆసఫ్ అలీ ఖాన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారి స్నేహం పెరిగిన తర్వాత, అలీఖాన్ ఆమెను కారులో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడాడు. అక్కడే కారులో ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే, ఈ అత్యాచారం ప్లాన్ ప్రకారం చేసినట్లు తేలింది. జిమ్ యజమాని అయిన అలీఖాన్ సోదరుడు మాజ్ ఖాన్ కారులోనే ఉండీ, ఆమె అసభ్యకరమైన వీడియోలను తీసుకుని బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు.
Also Read
- Cyber Fraud: సైబర్ మోసాల బారిన ప్రజలు.. రూ.2.10 కోట్లకు పైగా టోకరా.!
- Hyderabad: డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు దూసుకెళ్లిన యువకుడు.. కానిస్టేబుల్కు కాలు ఫ్రాక్చర్.!
- Uttar Pradesh: నీట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. నిందితుడి ఎన్కౌంటర్..
- Blackmail Case:100 మంది మహిళలపై అత్యాచారం? కంప్లైంట్ ఇచ్చిన డాక్టర్పై నర్సు సంచలన ఆరోపణ
Read Also: Rajkumar Hirani : AIతో సినిమా ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్.. త్వరలోనే ప్రాజెక్ట్ ప్రారంభం..
ఇద్దరు నిందితులు రూ. 1 లక్ష ఇవ్వకుంటే వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించారు. బాధితురాలు ఏదో విధంగా రూ. 4000 ఇచ్చారు. అయినప్పటికీ ఆమెపై లైంగిక దాడి, బ్లాక్మెయిల్ ఆగలేదు. నాలుగు కార్లలో పలు సందర్భాల్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో నిందితులతో పాటు రెండు సెడాన్, ఒక మహీంద్రా థార్ కారుతో సహా నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈకేసులో బాధితురాలు నిందితులిద్దరిని బ్లాక్ చేసిన తర్వాత, ఆసఫ్ ఆమె వీడియోలను తన స్నేహితులకు పంపి మతం మారాలని ఒత్తిడి చేసినట్లు తేలింది. చివరకు ఆ విద్యార్థి తన కుటుంబ సభ్యులకు విసయం చెప్పడంతో, హిందూ సంస్థల మద్దతుతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా సిట్ ఏర్పాటు చేశారు. నిందితులు మరెవరైనా మహిళల్ని టార్గెట్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. భోపాల్ కోర్టులో ఆసఫ్ను హాజరుపరిచినప్పుడు న్యాయవాదులు అతడిపై దాడి చేశారు.
తాజావార్తలు
-
Salman Khan: సల్మాన్కు ఊరట.. ‘బ్లాక్ బక్’ టీజర్ తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం!
-
CM Chandrababu: విద్యార్థిని శివాని మృతి తీవ్ర విచారం కలిగించింది.. యువత ధైర్యంగా నిలబడాలి!
-
AK 47: వెంకటేష్ ‘చిట్టిబాబు’ ల్యాండింగ్.. సంక్రాంతి కాదు, ఈసారి దసరాకే!
-
Dharmendra Pradhan: రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్కు ధర్మేంద్ర ప్రధాన్.. ఘన స్వాగతం పలికిన ఎన్డీఏ ఎంపీలు
-
Dhanush Politics: విజయ్ తర్వాత రాజకీయాల్లోకి ధనుష్?.. బహిరంగ సభతో రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!