Thief: సినీ నటితో ప్రేమలో పడిన దొంగ.. ఏకంగా రూ. 3 కోట్లతో ఇల్లు..
- సినీ నటితో దొంగ ప్రేమాయణం..
- దొంగిలించిన డబ్బులో రూ. 3 కోట్ల ఇల్లు..
- బంగారాన్ని కరిగించి బిస్కెట్లుగా మార్చుతున్న నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thief: ప్రేమించిన ప్రియురాలి కోసం ఏకంగా ఓ దొంగ రూ. 3 కోట్లతో పెద్ద ఇల్లుని కట్టించాడు. దోచుకున్న డబ్బుతో లవర్ కోసం ఇలా చేశాడు. నిందితుడు 37 ఏళ్ల పంచాక్షరి స్వామిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి ఓ ప్రముఖ సినీ నటితో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
నిందితుడు పంచాక్షర స్వామి మహారాష్ట్ర సోలాపూర్కి చెందిన వ్యక్తి. ఇతడికి అప్పటికే వివాహమై ఒక బిడ్డ కూడా ఉన్నాడు. స్వామి మైనర్గా ఉన్నప్పుడే 2003 నుంచి దొంగతనాలు చేయడం ప్రారంభించినట్లు విచారణలో తేలింది. 2009 నుంచి దొంగతనాలనే ఫుల్ టైమ్ వృత్తిగా మార్చుకున్నాడు. తన నేరాల ద్వారా కోట్ల విలువైన సంపదని కూడబెట్టాడు. 2014-2015లో ఒక ప్రముఖ నటితో పరిచయం ఏర్పరుకుని, ఆమెతో ప్రేమ సంబంధాన్ని పెంచుకున్నాడు.
Also Read
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
Read Also: Hema Malini: ‘‘30 మంది మరణించడం పెద్ద విషయం కాదా..?’’ హేమామాలిని షాకింగ్ కామెంట్స్..
విచారణలో, ఆ నటి కోసం కోట్లు ఖర్చుపెట్టినట్లు ఒప్పుకున్నాడు. కోల్కతాలో రూ. 3 కోట్ల విలువైన ఇల్లు నిర్మించి, ఆమెకు రూ. 22 లక్షల విలువైన అక్వేరియంని గిఫ్ట్గా ఇచ్చాడు. 2016లో, స్వామిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేసి ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అహ్మదాబాద్లోని సబర్మతి సెంట్రల్ జైలు నుండి విడుదలైన తర్వాత, అతను తిరిగి దొంగతనాలను మళ్లీ ప్రారంభించాడు. పలు నేరాల కింద మహారాష్ట్ర పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు. 2024లో విడుదలైన తర్వాత, తన మకాంని బెంగళూర్కి మార్చాడు. అక్కడే ఇళ్లలో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు.
జనవరి 9న, అతను బెంగళూరులోని మడివాలా ప్రాంతంలోని ఒక ఇంట్లో దొంగతనం చేశాడు. నిఘా సమాచారం సేకరించిన తర్వాత, పోలీసులు మడివాలా మార్కెట్ ప్రాంతం సమీపంలో అతన్ని అరెస్టు చేశారు. విచారణలో, అతను తన సహచరుడితో కలిసి బెంగళూరులో నేరాలు చేసినట్లు అంగీకరించాడు. దొంగిలించిన బంగారాన్ని కరిగించి బంగారు బిస్కెట్లుగా మార్చడానికి ఉపయోగించే ఇనుప రాడ్, ఫైర్ గన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన ఆభరణాలను మహారాష్ట్ర సోలాపూర్లోని తన ఇంట్లో నిల్వ చేసినట్లు స్వామి పోలీసులకు వెల్లడించారు.
అధికారులు 181 గ్రాముల బంగారు బిస్కెట్లను, 333 గ్రాముల వెండిని, ఇతర భరణాలను స్వాధీనం చేసుకున్నారు. నేరాలు చేసిన తర్వాత స్వామి, అనుమానం రాకుండా రోడ్డుపైనే బట్టలు మార్చుకునే వాడని దర్యాప్తు అధికారులు చెప్పారు. ఇతడికి కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది. తండ్రి మరణం తర్వాత, అతడి తల్లికి రైల్వేలో ఉద్యోగం లభించింది.
తాజావార్తలు
-
ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
-
AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
-
Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
-
Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!