Bengaluru: ఆన్లైన్లో 4 డజన్ల గుడ్లు కొనుగోలు చేసి రూ.48వేలు పోగొట్టుకున్న మహిళ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరగాళ్లు జనాలను మోసం చేసేందుకు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.. ఇటీవల కాలంలో నేరగాళ్ళు ఆన్ లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.. తాజాగా ఓ మహిళ ఆన్లైన్లో 4 డజన్ల కోడి గుడ్లను ఆర్డర్ చేసి ఏకంగా రూ.48,000 పోగొట్టుకుంది.. ఈ ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది..
వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని వసంత్నగర్కు చెందిన ఆ మహిళ ఈనెల 17 న ఆన్లైన్ షాపింగ్ కంపెనీ నుండి ఆఫర్ మెసేజ్ వచ్చింది. ఆ మహిళ మెసేజ్పై క్లిక్ చేయగా, 48 గుడ్లకు రూ. 49 ఆఫర్ ఉందని, గుడ్లను బుక్ చేయబోతున్నట్లు గుర్తించింది. తర్వాత ఆమె మొత్తం వివరాలను నింపింది. చెల్లింపు ఎంపికలో డెలివరీ చిరునామా మరియు మొబైల్ నంబర్తో సహా వివరాలను నమోదు చేసింది.. ఇక క్రెడిట్ కార్డు తో బిల్ పే చెయ్యడానికి క్రెడిట్ కార్డు డిటైల్స్ ను ఎంటర్ చేసింది..
Also Read
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
ఆ తర్వాత ఆమె మొబైల్లో వచ్చిన OTPని నమోదు చేసి డబ్బు చెల్లించింది. డబ్బు చెల్లించిన తర్వాత ఆమె ఖాతా నుండి రూ. 48,199 కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది..అది చూసిన మహిళ మోసపోయినట్లు తెలుసుకుంది.. వెంటనే బ్యాంకుకు తెలియజేసి క్రెడిట్ కార్డ్ అకౌంట్ను బ్లాక్ చేసింది.. ఈ విషయం పై ఆ మహిళ హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఐటీ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వారు తెలిపారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. ఇలాంటి ఫేక్ యాడ్ లను చూసి నమ్మవద్దని పోలీసులు జనాలను హెచ్చరిస్తున్నారు..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!