Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- 33 ఫేక్ అకౌంట్లతో భారీ సైబర్ దందా బట్టబయలు
- ప్రైవేట్ బ్యాంక్ అధికారుల పాత్రపై సంచలన ఆరోపణలు
- డబ్బు ఆశతో స్టూడెంట్స్, కార్మికులే టార్గెట్
- ఖాతా అమ్ముకుంటే జైలు తప్పదన్న డీసీపీ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mule Account Scam : సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్స్ (Mule Accounts) సప్లై చేస్తూ అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్న ఒక ముఠా గుట్టును సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ గారు ప్రెస్మీట్లో వెల్లడించారు. సైబర్ ఫ్రాడ్స్ చేయడానికి నేరగాళ్లకు ఏకంగా 33 ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ సప్లై చేసిన దిలీప్ సింగ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అక్రమ దందాలో ప్రైవేట్ బ్యాంక్ అధికారుల హస్తం కూడా ఉండటం ఇప్పుడు కలకలం రేపుతోంది.
నిందితుడు దిలీప్ సింగ్ ఈజీ మనీ కోసం మ్యూల్ ఖాతాలను ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్లకు సరఫరా చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులైన ఎస్ బ్యాంక్ (Yes Bank), కోటాక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) లకి చెందిన కొందరు అధికారుల పాత్ర ఉన్నట్లు పోలీసులు పక్కా ఆధారాలు సేకరించారు. నిందితుడు దిలీప్ సింగ్ ఈ అకౌంట్లన్నింటినీ విదేశాల్లో లేదా మరెక్కడో దాక్కుని ఆపరేట్ చేస్తున్న జోర్డాన్, పింటు భాయ్ అనే ప్రధాన సైబర్ నేరగాళ్లకు సప్లై చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ జోర్డాన్, పింటు భాయ్ ఇద్దరూ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.
Also Read
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ఈ ముఠా ముఖ్యంగా అమాయక స్టూడెంట్స్, చిన్న చిన్న వ్యాపారులు, రోజువారీ లేబర్ వర్క్ చేసుకునే వారిని టార్గెట్ చేస్తోంది. వారికి కొద్దిగా డబ్బు ఆశ చూపి, వారి ఆధార్, పాన్ కార్డు వివరాలతో బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయిస్తున్నారు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్ల డిమాండ్ను బట్టి ఒక్కో అకౌంట్ను భారీ ధరలకు అమ్ముకుంటున్నారు. ఈ అకౌంట్ల ద్వారానే కోట్లాది రూపాయల సైబర్ మోసాల డబ్బు చేతులు మారుతోంది. ఈ లూప్ను బ్రేక్ చేయడానికి నిందితుడికి చెందిన 23 బ్యాంక్ అకౌంట్స్ను తక్షణమే ఫ్రీజ్ చేయాల్సిందిగా ఇప్పటికే బ్యాంక్ అధికారులను కోరినట్లు డీసీపీ సాయి మనోహర్ వెల్లడించారు.
ఆన్లైన్లో పరిచయమైన జోర్డాన్, పింటు భాయ్ లతో చేతులు కలిపి దిలీప్ సింగ్ ఈ ఘోరానికి పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు. ఈ సందర్భంగా ప్రజలకు డీసీపీ సాయి మనోహర్ గారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. “కొద్దిపాటి డబ్బు ఆశతో మీ బ్యాంక్ ఖాతాలను ఇతరులకు అమ్ముకుంటే, మీ జీవితాన్ని మీరే చేతులారా అమ్ముకున్నట్లే. ఇలాంటి ఇల్లీగల్ అకౌంట్ల ద్వారా సైబర్ నేరాలు జరిగితే, అసలు ఖాతాదారులు ఎంతటి అమాయకులైనా సరే పోలీస్ విచారణ , జైలు శిక్ష ఎదుర్కోక తప్పదు” అని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
-
Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
-
Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!