Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురంలో వెలుగులోకి వచ్చిన ఈ హనీ ట్రాప్ ఉదంతం సమాజంలోని నైతిక విలువలకు అద్దం పడుతోంది. ఆధునిక కాలంలో టెక్నాలజీని, సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు పన్నే ఇలాంటి పద్మవ్యూహాల్లో చిక్కుకుని ఎందరో గౌరవప్రదమైన వ్యక్తులు తమ పరువును, సంపాదనను పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా సమాజంలో పేరుప్రఖ్యాతలున్న వారి బలహీనతలే పెట్టుబడిగా ఈ ముఠాలు పుట్టుకొస్తున్నాయి. చట్టం పట్ల భయం లేకుండా, వ్యవస్థలోని లొసుగులను వాడుకుంటూ సాగిస్తున్న ఈ చీకటి దందా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధితులు బయటకు చెప్పుకోలేక కుమిలిపోతుండగా.. పోలీసులు తీసుకున్న ఈ చర్య ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేసింది.
అనంతపురం హనీ ట్రాప్ కేసు..
Also Read
- Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ...
- HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
- HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
- Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ భారీ హనీ ట్రాప్ కేసులో దిగ్భ్రాంతి కలిగించే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు సభ్యులుగా ఉన్న ఒక ముఠా ఈ అక్రమ వసూళ్లకు పాల్పడుతోంది. వీరు సమాజంలో ఆర్థికంగా స్థిరపడిన ప్రభుత్వ అధికారులు, బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను తమ టార్గెట్లుగా ఎంచుకుంటారు. ముందుగా మహిళా సభ్యులు ఫోన్ ద్వారా పరిచయం పెంచుకుని.. మాటలతో ఆకర్షించి తమ గొంతులో బంధిస్తారు. నమ్మకం కుదిరాక, బాధితులను ఏకాంతంగా కలవడానికి రమ్మని ఆహ్వానిస్తారు. వారు ఇంటికి రాగానే, ముందే ఏర్పాటు చేసుకున్న రహస్య కెమెరాల ద్వారా ఏకాంత క్షణాలను రికార్డు చేస్తారు.
బ్లాక్మెయిల్ అస్త్రాలు..
వీడియోలు రికార్డ్ చేసిన వెంటనే ముఠాలోని మిగిలిన సభ్యులు రంగప్రవేశం చేస్తారు. వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని.. లేదా బాధితులపై రేప్ కేసు నమోదు చేస్తామని బెదిరిస్తారు. అంతేకాకుండా.. మహిళా సంఘాలతో ధర్నాలు చేయించి పరువు తీస్తామని హెచ్చరిస్తారు. పరువు పోతుందనే భయంతో బాధితులు వారు అడిగినంత ఇచ్చుకుంటున్నారు. నగదు ఇవ్వలేని పక్షంలో బలవంతంగా ప్రామిసరీ నోట్లు రాయించుకోవడం ఈ ముఠా ప్రత్యేకత.
పోలీసుల చర్యలు..
బాధితుల సంఖ్య పెరగడంతో కొందరు ధైర్యంగా ఎస్పీ జగదీష్ను ఆశ్రయించారు. విచారణలో సుమారు 19 మంది బాధితులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన మహిళను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే.. ఈ ముఠాకు కొంతమంది పోలీసు అధికారుల సహకారం కూడా ఉందన్న ఆరోపణలు రావడంతో.. శాఖాపరమైన విచారణకు ఎస్పీ ఆదేశించారు. ఈ కేసు జిల్లాలో ఉన్నత వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
తాజావార్తలు
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!