Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురంలో వెలుగులోకి వచ్చిన ఈ హనీ ట్రాప్ ఉదంతం సమాజంలోని నైతిక విలువలకు అద్దం పడుతోంది. ఆధునిక కాలంలో టెక్నాలజీని, సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు పన్నే ఇలాంటి పద్మవ్యూహాల్లో చిక్కుకుని ఎందరో గౌరవప్రదమైన వ్యక్తులు తమ పరువును, సంపాదనను పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా సమాజంలో పేరుప్రఖ్యాతలున్న వారి బలహీనతలే పెట్టుబడిగా ఈ ముఠాలు పుట్టుకొస్తున్నాయి. చట్టం పట్ల భయం లేకుండా, వ్యవస్థలోని లొసుగులను వాడుకుంటూ సాగిస్తున్న ఈ చీకటి దందా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధితులు బయటకు చెప్పుకోలేక కుమిలిపోతుండగా.. పోలీసులు తీసుకున్న ఈ చర్య ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేసింది.
అనంతపురం హనీ ట్రాప్ కేసు..
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ భారీ హనీ ట్రాప్ కేసులో దిగ్భ్రాంతి కలిగించే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు సభ్యులుగా ఉన్న ఒక ముఠా ఈ అక్రమ వసూళ్లకు పాల్పడుతోంది. వీరు సమాజంలో ఆర్థికంగా స్థిరపడిన ప్రభుత్వ అధికారులు, బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను తమ టార్గెట్లుగా ఎంచుకుంటారు. ముందుగా మహిళా సభ్యులు ఫోన్ ద్వారా పరిచయం పెంచుకుని.. మాటలతో ఆకర్షించి తమ గొంతులో బంధిస్తారు. నమ్మకం కుదిరాక, బాధితులను ఏకాంతంగా కలవడానికి రమ్మని ఆహ్వానిస్తారు. వారు ఇంటికి రాగానే, ముందే ఏర్పాటు చేసుకున్న రహస్య కెమెరాల ద్వారా ఏకాంత క్షణాలను రికార్డు చేస్తారు.
బ్లాక్మెయిల్ అస్త్రాలు..
వీడియోలు రికార్డ్ చేసిన వెంటనే ముఠాలోని మిగిలిన సభ్యులు రంగప్రవేశం చేస్తారు. వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని.. లేదా బాధితులపై రేప్ కేసు నమోదు చేస్తామని బెదిరిస్తారు. అంతేకాకుండా.. మహిళా సంఘాలతో ధర్నాలు చేయించి పరువు తీస్తామని హెచ్చరిస్తారు. పరువు పోతుందనే భయంతో బాధితులు వారు అడిగినంత ఇచ్చుకుంటున్నారు. నగదు ఇవ్వలేని పక్షంలో బలవంతంగా ప్రామిసరీ నోట్లు రాయించుకోవడం ఈ ముఠా ప్రత్యేకత.
పోలీసుల చర్యలు..
బాధితుల సంఖ్య పెరగడంతో కొందరు ధైర్యంగా ఎస్పీ జగదీష్ను ఆశ్రయించారు. విచారణలో సుమారు 19 మంది బాధితులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన మహిళను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే.. ఈ ముఠాకు కొంతమంది పోలీసు అధికారుల సహకారం కూడా ఉందన్న ఆరోపణలు రావడంతో.. శాఖాపరమైన విచారణకు ఎస్పీ ఆదేశించారు. ఈ కేసు జిల్లాలో ఉన్నత వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
తాజావార్తలు
-
Pawan Kalyan: తెలంగాణ వాళ్లకు మా తెలంగాణ అనే భావన ఉంది.. ఆంధ్రా వాళ్లకు ఎటువంటి భావన ఉందో అర్థంకాదు..!
-
North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్హ్యాండ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
-
Special Trains: సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
ట్రెండింగ్
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!