Bihar: పానీపూరి కోసం వెళ్లిన టీచర్ కాల్చివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar: భోజనం చేసిన తరువాత పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతుంటారు. అలా భోజనం చేసిన తరువాత కొందరు తమకిష్టమైన పండు ఏదో ఒకటి తింటారు. అది అరటిపండు కావచ్చు.. యాపిల్ కావచ్చు.. లేదంటే సీజనల్ వారీగా లభించే ఏదైనా పండు కావచ్చు. అయితే కొందరికి భోజనం చేసిన తరువాత ఏదో ఒక చిరుతిండి తినే అలవాటు ఉంటుంది. అలాంటి వాటిలో ఐస్క్రీమ్, పానీపూరీ, చిప్స్ వంటివి ఉంటాయి. ఇలానే భోజనం చేసిన తర్వాత పానీపూరి తినేందకు వెళ్లాడు ఒక టీచర్. అలా వెళ్లిన టీచర్ను దుండగులు కాల్చి చంపారు. ఆయనతోపాటు వెళ్లిన మరొక వ్యక్తిని కూడా దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన బీహార్లో జరిగింది.
Read also: Addanki Ci: నెట్టింట అద్దంకి సీఐ ఆడియో టేపులు వైరల్
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
బిహార్ రాష్ట్రంలోని సుపౌల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడైన 42 సంవత్సరాల మహ్మద్ నూరుల్లా గ్రామంలోని ఓ దుకాణానికి వెళ్లగా బైక్పై వచ్చిన దుండగులు నూరుల్లాతో పాటు దుకాణ యజమాని సికందర్ దాస్ పై కూడా కాల్పులు జరిపారు. ఇద్దరిపై కాల్పులు జరిపిన దుండగులు ఆపై ఘటనా స్ధలం నుంచి పరారయ్యారు. రాత్రి భోజనం చేసిన అనంతరం పానీపూరి తినేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు దుకాణానికి వెళ్లగా దుండగులు నూరుల్లాతో పాటు షాపు యజమానిపై కాల్పులు జరిపి ఇద్దరినీ చంపేశారని నూరుల్లా కుటుంబ సభ్యులు తెలిపారు. పాత కక్షలతోనే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఘటన సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టానికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Small Savings Schemes: స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారికి గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం
-
Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్తోనేనా?
-
Joseph Vijay: టైమ్ టు టైమ్..ఫైల్ తర్వాత ఫైల్.. దళపతి మార్క్ రూలింగ్!
-
Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
-
DC Release Date: గ్యాంగ్స్టర్ గా లోకేష్ కనగరాజ్.. ‘డీసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!