Minor Girl Died For Phone: మైనర్ బాలిక ప్రాణాలు బలిగొన్న ఫోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Minor Girl In Hyderabad Died For Mobile Phone After Fight With Her Sister: సెల్ఫోన్.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇది నిత్యవసరం అయిపోయింది. ఇది లేకపోతే రోజు గడవదన్నట్టుగా పరిస్థితులు మారాయి. చాలామంది ముఖ్యమైన పనుల కోసం మొబైల్ ఫోన్లను వాడుతారు. అయితే.. యువత మాత్రం కాలక్షేపం కోసమే వీటిని వినియోగిస్తారు. షార్ట్ వీడియోలు చేసుకోవడం.. సోషల్ మీడియాలో న్యూస్ ఫీడ్ చూసుకోవడం లాంటివి చేస్తుంటారు. ఒక్కసారి అలవాటు పడితే, ఇక అంతే సంగతులు. పూర్తిగా అడిక్ట్ అయిపోతారు. కాసేపు చేతిలో ఫోన్ లేకపోయినా, ఏదో విలువైన వస్తువే పోగొట్టుకున్న భావన కలుగుతుంటుంది. అదే ఓ మైనర్ బాలిక ప్రాణాల్ని తీసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్లోని కుషాయిగూడ కట్టింగ్ కాలనీకి చెందిన ఓ మేస్త్రికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక అమ్మాయి (17) ఇంటర్ చదివింది. కొన్నాళ్ల క్రితం ఓ ప్రైవేటు ఉద్యోగంలో చేరిన ఆ అమ్మాయి.. తనకొచ్చిన జీతంలో నుంచి కొన్ని డబ్బులు జమ చేసుకొని, ఇటీవల ఒక మొబైల్ ఫోన్ కొనుగోలు చేసింది. ఆమెతో పాటు ఆమె చెల్లెలు కూడా ఆ ఫోన్ని వినియోగిస్తుంది. ఇంట్లో ఉన్నది అదొక్క ఫోనే కావడంతో.. అక్కాచెల్లెళ్లు ఇద్దరూ దాన్ని వాడుతున్నారు. అప్పుడప్పుడు ఫోన్ విషయమై గొడవ ఏర్పడేది. సోమవారం మరోసారి వీరి మధ్య ఘర్షణ నెలకొంది. అప్పుడు అక్క ‘నీకెందుకు ఫోన్, అంత అవసరం ఏముంది?’ అంటూ కాస్త గట్టిగానే మందలించింది. దీంతో మనస్తాపం చెందిన చెల్లి.. చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుషాయిగూడ ఠాణాలో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?