NTV Telugu Site icon

Supreme Court: దారుణం..చేయని నేరానికి 11 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి..

Imprisonment

Imprisonment

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ నిరుపేద గ్రామస్థుడు చేయని నేరానికి 11 ఏళ్లు శిక్ష అనుభవించాడు. ట్రయల్ కోర్టు, హైకోర్టు నిర్ణయం వల్ల ఇన్నాళ్లు జైలులో చిప్పకూడు తిన్నాడు. తాజాగా తడిని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం దోషిగా నిర్ధారించి విడుదల చేసింది. సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించడంతో కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. అసలేం జరిగిందంటే…

READ MORE: Allu Sirish: ఆగష్టు రేసులోకి అల్లు శిరీష్ మూవీ

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయ్‌పూర్‌లోని ఖరోరా గ్రామానికి చెందిన రత్ను యాదవ్‌ మార్చి 2, 2013న తన సవతి తల్లిని బలవంతంగా నీటిలో ముంచి చంపాడని పోలీసులు ఆరోపిస్తూ.. అరెస్ట్ చేశారు. ట్రయల్ కోర్టులో హాజరు పర్చగా.. 2013 జులై 9న ఫాస్ట్ ట్రాక్ విచారణ ద్వారా అతడిని దోషిగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఏప్రిల్ 7, 2018న ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. నిందితుల తరఫు న్యాయవాది ఎవరూ హాజరుకాకపోవడంతో, ప్రాసిక్యూషన్ రికార్డులో ఉంచిన సాక్ష్యాధారాలను పరిశీలించిన సుప్రీం కోర్టు.. న్యాయవాది శ్రీధర్ వై చిటాలేను అమికస్ క్యూరీగా నియమించింది. పోస్టుమార్టం నివేదికలో నీట మునిగి మృతి చెందినట్లు తేలిందని, అయితే అది హత్య అని నిరూపించే బాధ్యతను ప్రాసిక్యూషన్‌ చేయలేదని చితాలే అన్నారు. విచారణ సమయంలో నిందితుడు తన సవతి తల్లిని బలవంతంగా మానభంగం చేశాడన్న ప్రాసిక్యూషన్ కథనం విశ్వసనీయతను దెబ్బతీసిందన్నారు.

READ MORE:Lover Kills Family: ప్రేమోన్మాది ఘాతుకం.. తండ్రితో సహా ఇద్దరు కూతుళ్ల హత్య..

న్యాయమూర్తులు ఎఎస్ ఓకా, రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ కేసులో నిర్దిష్టమైన.. సారూప్య వైరుధ్యాలను గుర్తించిన తర్వాత, బెంచ్ ట్రయల్ కోర్టు మరియు హైకోర్టు తీర్పులను పక్కనపెట్టి నిందితుడిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్ హైకోర్టులోని బిలాస్‌పూర్ బెంచ్ కింది కోర్టు నిర్ణయాన్ని సమర్థించేందుకు ఐదేళ్ల సమయం పట్టగా, హత్యా నేరారోపణల నుంచి ఆయనను నిర్దోషిగా విడుదల చేసేందుకు సుప్రీంకోర్టు ఆరేళ్ల సమయం పట్టింది.