Cyber Crime: మోసగాడి వలకు చిక్కిన ఐఏఎస్.. పెట్టుబడి పేరుతో రూ.2 కోట్ల స్వాహా..
- పెట్టుబడుల పేరుతో మోసం
- మోసగాడి వలకు చిక్కిన ఐఏఎస్
- నమ్మించి డబ్బు పెట్టుబడి పెట్టేలా చేసిన వ్యక్తి
- డబ్బులు ఇవ్వమంటే సాకులు
- స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళా ఐఏఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్టుబడులపై అధిక రాబడి వస్తుందనే సాకుతో మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా ఐఏఎస్ అధికారిని మోసం చేసి సుమారు రెండు కోట్ల రూపాయల మేర దోచుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని తిలక్ మార్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.
READ MORE: Kamala Harris: ఇంకా 72 రోజులే కమల పదవీకాలం! నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఐఏఎస్ అధికారి గురుగ్రామ్లో నివసిస్తున్న బంధువు ద్వారా మోసగాడిని కలిశారు. అతడు తనను తాను స్టాక్ మార్కెట్లో నిపుణుడిగా అభివర్ణించుకున్నాడు. మార్కెట్లో పెట్టుబడులు పెట్టి చాలా డబ్బు సంపాదించినట్లు మాయ మాటలు చెప్పి నమ్మించాడు. తన వల్ల తన స్నేహితులకు, ఇతర పెట్టుబడిదారులకు ఎంత రాబడి వచ్చిందో తన ల్యాప్టాప్లో ఆమెకు చూపించాడు. 60 నుంచి 70 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి.. దాన్ని రూ.100 కోట్లకు తీసుకెళ్లాలనుకుంటున్నానని చెప్పాడు. అతనికి సొంత లైసెన్స్ కూడా ఉన్నట్లు చూపించాడు. తనకు అప్పు ఇస్తే అధిక రాబడులు కూడా ఇస్తానని సదరు వ్యక్తి మహిళా ఐఏఎస్ అధికారిణిని ఒప్పించాడు. తన డబ్బు భద్రంగా ఉంటుందని హామీ ఇచ్చాడు.
READ MORE: Multibagger Stock: రూ. లక్ష పెట్టుబడితో రూ. 70 లక్షల రాబడి!.. అది కూడా కేవలం 14 నెలల్లోనే..
దీంతో ఆమె 2023 సెప్టెంబర్లో ఆ వ్యక్తి ఖాతాకు రూ.1.9 కోట్లు బదిలీ చేశారు. 2024 ఆగస్టు నాటికి రెట్టింపు లాభాలను తిరిగి ఇస్తానని ఆ వ్యక్తి ఐఏఎస్కు చెప్పాడు. ఇప్పటికే తనకు రూ.75 లక్షల లాభం వచ్చిందని నమ్మించాడు. జనవరి 2024లో ఐఏఎస్ అధికారిణి తనకు వైద్యపరమైన ఖర్చులకు నగదు కావాలని కోరారు. కానీ.. ఆ మోసగాడు డబ్బులు ఇవ్వకుండా ఏవేవో సాకులు చెబుతూ తేదీని పొడిగిస్తూనే ఉన్నాడు. 2024 మార్చిలో వారికి రూ.25 లక్షలు కూడా ఇచ్చాడు. త్వరలోనే డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. అయితే తర్వాత సాకులు చెప్పడం మొదలుపెట్టాడు. తాను మోసపోయినట్లు గ్రహించిన ఐఏఎస్ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్షీట్..!
-
YS Jagan: ‘నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను’.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
-
Devaraaya: శ్రీకృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్.. ‘దేవరాయ’ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా!
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
-
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!