Cyber Crime: మోసగాడి వలకు చిక్కిన ఐఏఎస్.. పెట్టుబడి పేరుతో రూ.2 కోట్ల స్వాహా..
- పెట్టుబడుల పేరుతో మోసం
- మోసగాడి వలకు చిక్కిన ఐఏఎస్
- నమ్మించి డబ్బు పెట్టుబడి పెట్టేలా చేసిన వ్యక్తి
- డబ్బులు ఇవ్వమంటే సాకులు
- స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళా ఐఏఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్టుబడులపై అధిక రాబడి వస్తుందనే సాకుతో మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా ఐఏఎస్ అధికారిని మోసం చేసి సుమారు రెండు కోట్ల రూపాయల మేర దోచుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని తిలక్ మార్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.
READ MORE: Kamala Harris: ఇంకా 72 రోజులే కమల పదవీకాలం! నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఐఏఎస్ అధికారి గురుగ్రామ్లో నివసిస్తున్న బంధువు ద్వారా మోసగాడిని కలిశారు. అతడు తనను తాను స్టాక్ మార్కెట్లో నిపుణుడిగా అభివర్ణించుకున్నాడు. మార్కెట్లో పెట్టుబడులు పెట్టి చాలా డబ్బు సంపాదించినట్లు మాయ మాటలు చెప్పి నమ్మించాడు. తన వల్ల తన స్నేహితులకు, ఇతర పెట్టుబడిదారులకు ఎంత రాబడి వచ్చిందో తన ల్యాప్టాప్లో ఆమెకు చూపించాడు. 60 నుంచి 70 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి.. దాన్ని రూ.100 కోట్లకు తీసుకెళ్లాలనుకుంటున్నానని చెప్పాడు. అతనికి సొంత లైసెన్స్ కూడా ఉన్నట్లు చూపించాడు. తనకు అప్పు ఇస్తే అధిక రాబడులు కూడా ఇస్తానని సదరు వ్యక్తి మహిళా ఐఏఎస్ అధికారిణిని ఒప్పించాడు. తన డబ్బు భద్రంగా ఉంటుందని హామీ ఇచ్చాడు.
READ MORE: Multibagger Stock: రూ. లక్ష పెట్టుబడితో రూ. 70 లక్షల రాబడి!.. అది కూడా కేవలం 14 నెలల్లోనే..
దీంతో ఆమె 2023 సెప్టెంబర్లో ఆ వ్యక్తి ఖాతాకు రూ.1.9 కోట్లు బదిలీ చేశారు. 2024 ఆగస్టు నాటికి రెట్టింపు లాభాలను తిరిగి ఇస్తానని ఆ వ్యక్తి ఐఏఎస్కు చెప్పాడు. ఇప్పటికే తనకు రూ.75 లక్షల లాభం వచ్చిందని నమ్మించాడు. జనవరి 2024లో ఐఏఎస్ అధికారిణి తనకు వైద్యపరమైన ఖర్చులకు నగదు కావాలని కోరారు. కానీ.. ఆ మోసగాడు డబ్బులు ఇవ్వకుండా ఏవేవో సాకులు చెబుతూ తేదీని పొడిగిస్తూనే ఉన్నాడు. 2024 మార్చిలో వారికి రూ.25 లక్షలు కూడా ఇచ్చాడు. త్వరలోనే డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. అయితే తర్వాత సాకులు చెప్పడం మొదలుపెట్టాడు. తాను మోసపోయినట్లు గ్రహించిన ఐఏఎస్ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?