Cyber Crime: మోసగాడి వలకు చిక్కిన ఐఏఎస్.. పెట్టుబడి పేరుతో రూ.2 కోట్ల స్వాహా..
- పెట్టుబడుల పేరుతో మోసం
- మోసగాడి వలకు చిక్కిన ఐఏఎస్
- నమ్మించి డబ్బు పెట్టుబడి పెట్టేలా చేసిన వ్యక్తి
- డబ్బులు ఇవ్వమంటే సాకులు
- స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళా ఐఏఎస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్టుబడులపై అధిక రాబడి వస్తుందనే సాకుతో మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా ఐఏఎస్ అధికారిని మోసం చేసి సుమారు రెండు కోట్ల రూపాయల మేర దోచుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆమె ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని తిలక్ మార్గ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు.
READ MORE: Kamala Harris: ఇంకా 72 రోజులే కమల పదవీకాలం! నెక్ట్స్ ప్లాన్ ఏంటి?
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
- Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఐఏఎస్ అధికారి గురుగ్రామ్లో నివసిస్తున్న బంధువు ద్వారా మోసగాడిని కలిశారు. అతడు తనను తాను స్టాక్ మార్కెట్లో నిపుణుడిగా అభివర్ణించుకున్నాడు. మార్కెట్లో పెట్టుబడులు పెట్టి చాలా డబ్బు సంపాదించినట్లు మాయ మాటలు చెప్పి నమ్మించాడు. తన వల్ల తన స్నేహితులకు, ఇతర పెట్టుబడిదారులకు ఎంత రాబడి వచ్చిందో తన ల్యాప్టాప్లో ఆమెకు చూపించాడు. 60 నుంచి 70 కోట్ల వరకు పెట్టుబడి పెట్టి.. దాన్ని రూ.100 కోట్లకు తీసుకెళ్లాలనుకుంటున్నానని చెప్పాడు. అతనికి సొంత లైసెన్స్ కూడా ఉన్నట్లు చూపించాడు. తనకు అప్పు ఇస్తే అధిక రాబడులు కూడా ఇస్తానని సదరు వ్యక్తి మహిళా ఐఏఎస్ అధికారిణిని ఒప్పించాడు. తన డబ్బు భద్రంగా ఉంటుందని హామీ ఇచ్చాడు.
READ MORE: Multibagger Stock: రూ. లక్ష పెట్టుబడితో రూ. 70 లక్షల రాబడి!.. అది కూడా కేవలం 14 నెలల్లోనే..
దీంతో ఆమె 2023 సెప్టెంబర్లో ఆ వ్యక్తి ఖాతాకు రూ.1.9 కోట్లు బదిలీ చేశారు. 2024 ఆగస్టు నాటికి రెట్టింపు లాభాలను తిరిగి ఇస్తానని ఆ వ్యక్తి ఐఏఎస్కు చెప్పాడు. ఇప్పటికే తనకు రూ.75 లక్షల లాభం వచ్చిందని నమ్మించాడు. జనవరి 2024లో ఐఏఎస్ అధికారిణి తనకు వైద్యపరమైన ఖర్చులకు నగదు కావాలని కోరారు. కానీ.. ఆ మోసగాడు డబ్బులు ఇవ్వకుండా ఏవేవో సాకులు చెబుతూ తేదీని పొడిగిస్తూనే ఉన్నాడు. 2024 మార్చిలో వారికి రూ.25 లక్షలు కూడా ఇచ్చాడు. త్వరలోనే డబ్బులన్నీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. అయితే తర్వాత సాకులు చెప్పడం మొదలుపెట్టాడు. తాను మోసపోయినట్లు గ్రహించిన ఐఏఎస్ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
-
MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Hyderabad: మాదాపూర్లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
-
Motorola Edge 50 Ultra 5G: మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G పై రూ.26000 డిస్కౌంట్.. 64MP టెలిఫోటో కెమెరా, pOLED డిస్ప్లే
-
AR Rahman Peddi: ‘బాహుబలి’ చూసాకే తెలుగు సినిమాపై ప్రేమ పెరిగింది..
-
SRH: ఐపీఎల్ చరిత్రలో ఆ అరుదైన ఘనత సాధించిన ఏకైక జట్టు ఎస్ఆర్హెచ్.. మళ్లీ 2016 నాటి మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?