Hyderabad: ఓ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. అక్కను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తాతయ్యతో కలిసి సంతోషంగా వెళ్లిన ఓ చిన్నారి జీవితం విషాదంగా ముగిసింది. చిన్నారి పైన నుండి బస్సు వెళ్లడంతో ఓ ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ శివారు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివారాలోకి వెళ్తే.. లక్ష్మారెడ్డి పాలెం లోని క్యాండోర్ షైన్ స్కూల్ బస్సు కుంట్లూరు గ్రామానికి నిత్యం విద్యార్థులను ఎక్కించుకునేదు వస్తుంది. అలానే ఈ రోజు ఉదయం కూడా స్కూల్ బస్సు కుంట్లూరు గ్రామానికి వచ్చింది. కాగా అదే పాఠశాలలో చదువుతున్న ఆ గ్రామినికి చెందిన ఓ విద్యార్థినిని స్కూల్ బస్సు ఎక్కించేందుకు హర్షపవన్ ఓ మూడు సంవత్సరాల బాలుడు తన తాతయ్యతో కలిసి బస్సు దగ్గరకు వెళ్ళాడు. కాగా ఆ బాలుడి అక్క బస్సు ఎక్కింది. అయితే అనుకొకుండా ఆ చిన్నారి బస్సు కింద పడ్డాడు. ఇది గమనించని డ్రైవర్ హర్షపవన్ పైన నుండి బస్సును పోనిచ్చాడు.
Read also:Rinku Singh: ఆకాశమే హద్దుగా చెలరేగిన రింకూ.. కేవలం 33 బంతుల్లోనే..!
దీనితో చిన్నారి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందారు. దీనితో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు డ్రైవర్ను పట్టుకొని చితకబాదారు. గతం లోనూ ఇలాంటి ఘటనలు జరిగినవని అయిన స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కాగా పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. కుమారుడి మృతదేహాం వద్ద తల్లిదండ్రులు రోధించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది.