Beautician Cheated: బ్యూటీషియన్కి టోకరా.. లాభమని చెప్పి నిండా ముంచేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Beautician Cheated By AOG Company In Chittoor: రూపాయి పెట్టుబడికి అర్థరూపాయి లాభం వస్తుందంటే.. పెట్టుబడి పెట్టేందుకు ఎవరు ముందుకు రారు చెప్పండి. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే.. వచ్చే లాభంతోనే హ్యాపీగా గడిపేయొచ్చని చాలామంది అనుకుంటారు. దీన్నే అలుసుగా తీసుకొని.. కొందరు దుండగులు భారీ మోసాలకు పాల్పడుతున్నారు. పెట్టుబడులు పెట్టేవారిని టార్గెట్ చేసుకొని.. భారీ లాభాలొస్తాయని మాయమాటలు చెప్పి.. వారి వద్ద నుంచి లక్షలకు లక్షలు కాజేసి.. చివరికి శఠగోపం పెట్టి జంప్ అయిపోతారు. ఇలాంటి సంఘటనే తాజాగా చిత్తూరులో చోటు చేసుకుంది. రూ.1 లక్ష పెట్టుబడి పెడితే, వారానికే రూ.10 వేలు వస్తాయని ఒక బ్యూటీషియన్ని నమ్మించి.. ఆమె వద్ద నుంచి ఏకంగా రూ.45 లక్షలు కాజేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Virupaksha Trailer: రుద్రవనాన్ని కాపాడే విరూపాక్ష వచ్చేశాడు
Also Read
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
- Mobile Addiction Turns Fatal: భోజనం చేస్తూ రీల్స్ చూస్తుండగా.. పదేపదే నెట్వర్క్ ప్రాబ్లం.. మహిళ షాకింగ్ నిర్ణయం
చిత్తూరు నగరంలోని చేపల మార్కెట్ వీధికి చెందిన అనురాధ.. కొంగారెడ్డిపల్లెలో బ్యూటీషియన్గా పనిచేస్తోంది. కొన్ని రోజుల క్రితం సమీప బంధువును కలిసినప్పటికీ.. పెట్టుబడికి సంబంధించిన చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే బజారులో ‘ఏవోజీ’ అనే కంపెనీ ఉందని, అందులో డబ్బులు పెడితే భారీ లాభాలు వస్తాయని ఆ బంధువు చెప్పారు. దీంతో.. అనురాధ ఆ కంపెనీకి వెళ్లింది. ఆ కంపెనీలో ఉన్నవారిని కలవగా.. రూ.1 లక్ష పెట్టుబడి పెడితే, వారానికి రూ. 10 వేలు చొప్పున నెలకు రూ.40 వేలు వడ్డీ ఇస్తామని చెప్పారు. అంతేకాదు.. మూడేళ్ల తర్వాత పెట్టుబడి అమౌంట్ని కూడా తిరిగి ఇచ్చేస్తామని తెలిపారు. అయితే.. కంపెనీ నిబంధనల ప్రకారం తొలి మూడు నెలలకు వడ్డీ రాదని, నాలుగో నెల నుంచి మొత్తం వడ్డీ చెల్లిస్తామని ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. మొదటి మూడు నెలలు రాకపోతేనేం.. ఆ తర్వాత నుంచి తనకు భారీ లాభాలు వస్తాయి కదా అని ఆశ పడింది. అంతే.. తన దగ్గరున్న డబ్బు, ఆభరణాలు తాకట్టు పెట్టడంతో బంధువుల నుంచి అప్పు తీసుకొని ఏకంగా రూ.45 లక్షలు ఆ కంపెనీలో పెట్టుబడిగా ఇచ్చింది.
Extramarital Affair: జ్యోతిష్యుడి మెడకు చుట్టుకున్న ఎఫైర్.. పక్కా స్కెచ్ వేసి బలి
కట్ చేస్తే.. మూడు నెలలు గడిచిన తర్వాత తన వడ్డీ వసూలు చేసుకుందామని అనురాధ ఆ కంపెనీకి వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లాక ఆమెకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆ కంపెనీ బోర్డు తిప్పేసిందని.. తాను దారుణంగా మోసపోయానని గ్రహించింది. దీంతో.. ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేవలం ఈ ఒక్క బ్యూటీషియన్ మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఆ కంపెనీలో భారీఎత్తున నగదు పెట్టి మోసపోయారు. రూ.కోట్లలో డిపాజిట్లు జరిగినట్టు తేలింది. ప్రస్తుతం బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, ఇంకా ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేస్తే వాటిపై కూడా కేసు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?