Marriage Twist: ఎనిమిదేళ్ల కాపురం తర్వాత.. బిగ్ ట్విస్ట్.. ఆయన కాదు.. ఆమె..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marriage Twist: ఎనిమిదేళ్లుగా ఆ జంట ఎంతో అన్యోన్యంగా ఉండడమే కాకుండా చుట్టుపక్కల వారికి ఆదర్శంగా నిలిచింది. ఇదిలా ఉండగా.. వారి జీవితంలో ఓ చేదు నిజం బయటకి రావడంతో అలజడి రేగింది. తన వద్ద భర్త దాచిన షాకింగ్ నిజం తెలియడంతో ఆ భార్య గుండె బద్దలైంది. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది. అసలు విషయమేమిటంటే ఆమె భర్త అసలు పురుషుడే కాదన్న నిజం ఆమెను వణికిపోయేలా చేసింది. గుజరాత్కు చెందిన ఓ మహిళ తన మొదటి భర్త 2011లో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా.. మరో వివాహం చేసుకుంది. ఒక కూతురు ఉన్న ఆమె 2014లో ఢిల్లీలో పని చేసే విరాజ్ వర్దన్ అనే వ్యక్తిని కుటుంబ సభ్యుల సమక్షంలో రెండో పెళ్లి చేసుకుంది.
2014 ఫిబ్రవరిలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని హనీమూన్కు కశ్మీర్కు కూడా వెళ్లారు.అయితే ఆమెను శారీరకంగా కలవకుండా చాలా కాలం పాటు దూరం పెడుతూనే వచ్చాడు. ఆమె విరాజ్ను ఒత్తిడి చేయడంతో.. గతంలో తనకు రష్యాలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగిందని.. తాను సంసార సుఖానికి పనికి రానని చెప్పాడు. ఓ మైనర్ సర్జరీ జరిగితే అంతా సెట్ అవుతుందని చెప్పాడు. దీంతో నిజాయితీగా నిజం ఒప్పుకున్నాడని ఆమె అతన్ని క్షమించేసింది. ఆపై ఆ జంట అన్యోన్యంగానే ఉంటూ వచ్చింది.
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
Pakistan PM: పాకిస్తాన్ ప్రధాని అవస్థలు.. రష్యా అధ్యక్షుడి నవ్వులు!
జనవరి 2020లో, అతను తన బరువును తగ్గించుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమెతో చెప్పాడు.దాని కోసమని కోల్కతా వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగొచ్చిన విరాజ్ వర్దన్ తన భార్యతో శారీరకంగా కలవడం ప్రారంభించాడు. విరాజ్ కోల్కతాకు వెళ్లింది బరువు తగ్గే సర్జరీ కోసం కాదని.. పురుషుల అవయవాల మార్పిడి కోసం డాక్టర్ రిపోర్టుల ద్వారా తెలుసుకున్న ఆమెకు గుండె పగిలినంత పని అయ్యింది. అనంతరం భర్త చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.
విజైతా అనే యువతి.. విరాజ్ వర్దన్గా పేరు మార్చుకుని.. మ్యాట్రిమోనియల్ సర్జరీ ద్వార తనను సంప్రదించిందని తెలియడంతో ఆమె తల తిరిగిపోయింది. విజైతా కుటుంబం తనను మోసం చేసిందని పోలీసులను ఆశ్రయించింది. అతను తనతో అసహజంగా పాల్గొనడం ప్రారంభించాడని, దాని గురించి ఎవరితోనైనా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తనను బెదిరించాడని ఆమె పోలీసులకు తెలిపింది. ఢిల్లీ నివాసి అయిన నిందితుడిని వడోదరకు తీసుకువచ్చినట్లు గోత్రి పోలీస్ ఇన్స్పెక్టర్ ఎంకే గుర్జర్ తెలిపారు.
తాజావార్తలు
-
UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
-
Android 17 Wrong Password Lock Feature: గూగుల్ కొత్త సెక్యూరిటీ ఫీచర్.. ప్రతి యూజర్ తెలుసుకోవాల్సిందే!
-
RC17 : నాకు ఆ ప్లాప్ హీరోయినే కావాలి : రామ్ చరణ్
-
Iran – Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
-
IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?