Gun Fire In Nagole: నాగోల్లో కాల్పుల కలకలం.. బంగారం షాప్లో దూరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
3 Men Firing On Gold Shop Owner In Hyderabad Nagole: హైదరాబాద్లోని నాగోల్ స్నేహపురి కాలనీలో ముగ్గురు దుండగులు వీరంగం సృష్టించారు. తుపాకులతో ఒక బంగారం షాప్లోకి దూరిన ఆ ముగ్గురు.. షాప్ యజమానని బెదిరించి, బంగారం ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో వాళ్లు కాల్పులు జరపడంతో.. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ కాల్పుల్లో షాప్ యజమానితో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్నేహపురి కాలనీలోని ప్రధాన రోడ్లో ఉన్న మహదేవ్ జ్యువెలరీ షాప్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలుత ముగ్గురు దుండగులు 9:30 గంటల ప్రాంతంలో బంగారం కొనుగోలు చేస్తామని చెప్పి షాప్ లోపలికి వెళ్లారు. అయితే.. లోపలికి వెళ్లిన వెంటనే, షట్టర్ని మూసివేశారు. ఆ వెంటనే తమతో తెచ్చుకున్న తుపాకులు బయటకు తీసి.. షాప్ యజమాని కళ్యాణ్ సింగ్తో పాటు వర్కర్లపై కాల్పులు జరిపారు. అనంతరం షాప్లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకొని, అక్కడి నుంచి దుండగులు పారిపోయారు.
అయితే.. దుండగులు జరిపిన కాల్పుల్లో కళ్యాణ్తో పాటు మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. కాల్పుల శబ్దం వినిపించడంతో.. చుక్కపక్కల వాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన గురించి స్థానికులు సమాచారం అందించడంతో.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి.. అక్కడ లభ్యమైన తుపాకీ బుల్లెట్ షేల్స్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోల్డ్ షాప్లో దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. బంగారం డెలివరీ చేయడానికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని.. ఈ ముగ్గురు దుండగులు ఫాలో అయ్యారు. ఆభరణాలని కళ్యాణ్ సింగ్కి ఇస్తున్న సమయంలో దుండగులు షాప్లోకి చొరబడ్డారు. బంగారం తీసుకొని దుండగులు పారిపోతున్న సమయంలో.. స్థానికులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ, ఫలితం లేకుండా పోయింది. పక్క వీధిలో మోటర్ బైక్ని పట్టుకొని, దాని మీద దుండగులు పారిపోయారు.
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
కంట్రీ మెడ్ పిస్తల్తో దుండగులు కాల్పులకు తెగబడినట్టు పోలీసులు గుర్తించారు. ఆ దుండగులు రాజాస్థాన్, హర్యానా, యూపీ గ్యాంగ్కు చెందిన సభ్యులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక పల్సర్ బైకు, మరో యాక్టివా బైక్పై దుండగులు వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు. రెండు బుల్లెట్ కేస్లు స్వాదీనం చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. కాల్పుల్లో గాయమైన వ్యక్తికి తలకు బలమైన గాయం కావడంతో.. ఎమ్ఆర్ఐ స్కాన్ సెంటర్కు వైద్యులు తరలించారు.
తాజావార్తలు
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!