Cab Driver Dead: క్యాబ్ డ్రైవర్ పై దాడి ఘటన.. రూ.2 కోట్లుతో వైద్యం చేయించిన దక్కని ప్రాణం
- జూలై 2022 లో 200 రూపాయల కోసం క్యాబ్ డ్రైవర్ పై 20 మంది దాడి..
- రెండేళ్లుగా చికిత్స పొందుతూ క్యాబ్ డ్రైవర్ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cab Driver Dead: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లిలో దాడి ఘటనలో క్యాబ్ డ్రైవర్ వెంకటేష్ మృతి చెందాడు. అర్ధరాత్రి..కేవలం 200 రూపాయల కోసం మొదలైన చిన్నపాటి గొడవ.. ఆ యువకుడి జీవితం శాశ్వతంగా అంధకారంలో కూరుకుపోయింది. తనపై 20 మంది పాశవికంగా దాడి చేయడంతో రెండేళ్లుగా మంచానపడ్డాడు..నరకం చూశాడు. తల్లిదండ్రుల ఆస్తులు అమ్మి రూ. 2 కోట్లు చికిత్సకు అందించినా ఫలితం లేకపోయింది. ఆదివారం స్వగ్రామంలో వెంకటేష్ మృతి చెందాడు.
Read also: Devara: సాయంత్రం సంచలనం సృష్టించబోతున్న దేవర.. మీరు రెడీనా..?
Also Read
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Hospital Fire: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
జూలై 2022 లో 200 రూపాయల కోసం గొడవ చెలరేగింది. ఉప్పర్ పల్లి లోని వివేక్ రెడ్డి తో క్యాబ్ చార్జీ విషయం వివాదం తలెత్తింది. చినికి చినికి గాలివానగా మారి దుమారాన్ని రేపింది. వివేక్ తన స్నేహితులకు ఫొన్ చేసి రప్పించాడు. దాదాపు 20 మంది యువకులు క్రికెట్ బ్యాట్స్, వికేట్స్, హాకీ స్టిక్స్ తో విచక్షణారహితంగా దాడి చేశారు. క్యాబ్ డ్రైవర్ ను వెంబడించి వెంబడించి మరీ వివేక్ రెడ్డి గ్యాంగ్ దాడి చేశారు. దీంతో క్యాబ్ డ్రైవర్ వెంకటేష్ స్పాట్ లోనే కుప్పకూలిపోయాడు. రంగ ప్రవేశం చేసిన రాజేంద్రనగర్ పోలీసులు. క్యాబ్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాత్రంతా పోలీస్ స్టేషన్ లోనే కూర్చోబెట్టారు. దాడికి పాల్పడ్డ వివేక్ రెడ్డి గ్యాంగ్ ను వదిలేసింది. తీవ్ర గాయాల పాలైన క్యాబ్ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించకుండా పోలీస్ స్టేషన్ లోనే కూర్చొబెట్టారు. ఉదయం అతని పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకటేష్ కోమా లోకి వెళ్లిపోయాడు. క్యాబ్ డ్రైవర్ పై 11 టైగర్స్ దాడి చేసిన కథనాన్ని సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో.. నిందితుల పూర్తి వివరాలను పేర్ల తో సహా బయట పెట్టారు. కొడుకును బతికించుకునేందుకు తల్లిదండ్రులు సుమారు రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. ఇందుకోసం ఎకరంన్నర పొలాన్ని విక్రయించారు. ఇంటిని తాకట్టు పెట్టి ఎక్కడికక్కడ అప్పులు చేశారు. రెండు నెలల కిందటే ఇంటికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. వెంకటేష్ గౌడ్ పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందాడు.
Nagarjuna Sagar: తెరచుకున్న నాగార్జునసాగర్ డ్యాం 6 క్రస్ట్ గేట్లు..
తాజావార్తలు
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
-
CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
-
Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
-
Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..
-
Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!