Cab Driver Dead: క్యాబ్ డ్రైవర్ పై దాడి ఘటన.. రూ.2 కోట్లుతో వైద్యం చేయించిన దక్కని ప్రాణం
- జూలై 2022 లో 200 రూపాయల కోసం క్యాబ్ డ్రైవర్ పై 20 మంది దాడి..
- రెండేళ్లుగా చికిత్స పొందుతూ క్యాబ్ డ్రైవర్ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cab Driver Dead: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లిలో దాడి ఘటనలో క్యాబ్ డ్రైవర్ వెంకటేష్ మృతి చెందాడు. అర్ధరాత్రి..కేవలం 200 రూపాయల కోసం మొదలైన చిన్నపాటి గొడవ.. ఆ యువకుడి జీవితం శాశ్వతంగా అంధకారంలో కూరుకుపోయింది. తనపై 20 మంది పాశవికంగా దాడి చేయడంతో రెండేళ్లుగా మంచానపడ్డాడు..నరకం చూశాడు. తల్లిదండ్రుల ఆస్తులు అమ్మి రూ. 2 కోట్లు చికిత్సకు అందించినా ఫలితం లేకపోయింది. ఆదివారం స్వగ్రామంలో వెంకటేష్ మృతి చెందాడు.
Read also: Devara: సాయంత్రం సంచలనం సృష్టించబోతున్న దేవర.. మీరు రెడీనా..?
Also Read
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
- Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
జూలై 2022 లో 200 రూపాయల కోసం గొడవ చెలరేగింది. ఉప్పర్ పల్లి లోని వివేక్ రెడ్డి తో క్యాబ్ చార్జీ విషయం వివాదం తలెత్తింది. చినికి చినికి గాలివానగా మారి దుమారాన్ని రేపింది. వివేక్ తన స్నేహితులకు ఫొన్ చేసి రప్పించాడు. దాదాపు 20 మంది యువకులు క్రికెట్ బ్యాట్స్, వికేట్స్, హాకీ స్టిక్స్ తో విచక్షణారహితంగా దాడి చేశారు. క్యాబ్ డ్రైవర్ ను వెంబడించి వెంబడించి మరీ వివేక్ రెడ్డి గ్యాంగ్ దాడి చేశారు. దీంతో క్యాబ్ డ్రైవర్ వెంకటేష్ స్పాట్ లోనే కుప్పకూలిపోయాడు. రంగ ప్రవేశం చేసిన రాజేంద్రనగర్ పోలీసులు. క్యాబ్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాత్రంతా పోలీస్ స్టేషన్ లోనే కూర్చోబెట్టారు. దాడికి పాల్పడ్డ వివేక్ రెడ్డి గ్యాంగ్ ను వదిలేసింది. తీవ్ర గాయాల పాలైన క్యాబ్ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించకుండా పోలీస్ స్టేషన్ లోనే కూర్చొబెట్టారు. ఉదయం అతని పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకటేష్ కోమా లోకి వెళ్లిపోయాడు. క్యాబ్ డ్రైవర్ పై 11 టైగర్స్ దాడి చేసిన కథనాన్ని సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో.. నిందితుల పూర్తి వివరాలను పేర్ల తో సహా బయట పెట్టారు. కొడుకును బతికించుకునేందుకు తల్లిదండ్రులు సుమారు రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. ఇందుకోసం ఎకరంన్నర పొలాన్ని విక్రయించారు. ఇంటిని తాకట్టు పెట్టి ఎక్కడికక్కడ అప్పులు చేశారు. రెండు నెలల కిందటే ఇంటికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. వెంకటేష్ గౌడ్ పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం మృతి చెందాడు.
Nagarjuna Sagar: తెరచుకున్న నాగార్జునసాగర్ డ్యాం 6 క్రస్ట్ గేట్లు..
తాజావార్తలు
-
Hydrogen Fuel Cell Train: తొలి “హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్” రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
-
TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్
-
Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!