దారుణం: బాలికపై సాముహిక అత్యాచారం.. క్యాబ్ డ్రైవర్ తో సహా 17 మంది కలిసి నాలుగురోజుల పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలకు సమాజంలో రక్షణ లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధులు మాత్రం మారడం లేదు. రోడ్డుపై ఆడవారు ఒంటరిగా కనిపిస్తే చాలు మగాళ్లు మృగాళ్ళుగా మారిపోతున్నారు. తాజాగా ఒక బాలికపై 18 మంది సామూహిక అత్యాచారం చేసిన అమానుష ఘటన కజికిస్థాన్ లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన జరిగి ఐదునెలలు అవుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినాట్లు ప్రవర్తిస్తుండటంతో బాధితురాలు తల్లి మీడియాను ఆశ్రయించడంతో ఈ ఘటన బయటపడింది.
వివరాలలోకి వెళితే.. కజికిస్థాన్ లోని ఒక ప్రాంతానికి చెందిన 16 ఏళ్ళ బాలిక షోపిక్ కోసమని బయటికి వెళ్లి, బస్సులు లేక క్యాబ్ బుక్ చేసుకొంది. క్యాబ్ డ్రైవర్ ఆమెకు మాయమాటలు చెప్పి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ని తాగించాడు. అనంతరం ఒక నది ఒడ్డుకు బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక స్పృహలోకి వచ్చి చూసేసరికి ఆమె నగ్నంగా కనిపించింది. పారిపోవడానికి ప్రయత్నించగా ఆమెను కొట్టి నదిలో ముంచి చంపేస్తానని బెదిరించిమరోమారు ఆమెను రేప్ చేశాడు.. అంతేకాకుండా అతడి స్నేహితులను పిలిచి ఒకరి తరువాత ఒకరు తనను రేప్ చేసారంటూ బాలిక ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
నాలుగురోజులు ఒకరి తరువాత ఒకరు తనకు నరకం చూపించారని, ఆతరువాత తనను రోడ్డుపైకి విసిరి ఇష్టం ఉన్న చోట చెప్పుకో అని అన్నారని బాలిక వాపోయింది. ఇంటికొచ్చిన బాలిక తల్లికి జరిగిన విషయం చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపిన బాలిక తల్లి.. అక్కడ ఎవరు తమను పట్టించుకోలేదని, ఐదు నెలలు అవుతున్నా కనీసం విచారణ కూడా చేపట్టలేదని తెలిపింది. నా కూతురికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తూ ఆమె మీడియాముందుకు వచ్చి జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో కేసు సీరియస్ గా తీసుకున్న అధికారులు విచారణ కొనసాగిస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!