Stock Market: స్టాక్ మార్కెట్లో రక్తపాతం.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు.. కారణాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు భారత స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. అంతకుముందు వరుస సెషన్లలో లాభాల బాట పట్టిన మార్కెట్లు, ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి గురై భారీ నష్టాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 984 పాయింట్లు కోల్పోగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 50 ఏకంగా 308 పాయింట్లు నష్టపోయింది. ఈ త్రైమాసికంలో నిఫ్టీ మళ్లీ 24,000 మార్కు కంటే దిగువకు పడిపోవడం మార్కెట్ వర్గాల్లో ఆందోళన కలిగించింది.
మార్కెట్లు ఇంతలా కుప్పకూలడానికి ప్రధానంగా ఐదు కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఆసియా మార్కెట్ల పతనం. అంతర్జాతీయంగా ఆసియా ఈక్విటీ మార్కెట్లలో వ్యక్తమైన భారీ అమ్మకాల ప్రభావం దలాల్ స్ట్రీట్పై తీవ్రంగా పడింది. ముఖ్యంగా దక్షిణ కొరియాకు చెందిన కోస్పి (KOSPI) సూచీ ఏకంగా 10 శాతం పడిపోగా, తైవాన్ మార్కెట్లు కూడా నష్టపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కొత్త ఛైర్మన్ కెవిన్ వార్ష్ నేతృత్వంలో ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు మార్కెట్లో బలపడ్డాయి. సెప్టెంబర్ నాటికి వడ్డీ రేట్లు పెరుగుతాయనే సంకేతాలు విదేశీ ఇన్వెస్టర్లను వెనక్కి తగ్గేలా చేశాయి.
Also Read
- Gold and Silver Prices Today: రక్షాబంధన్ వేళ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
- Mark Zuckerberg: జుకర్బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
ఐటీ, మెటల్ షేర్లలో కుంగుబాటు: ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో భారతీయ ఐటీ రంగం తీవ్రంగా నష్టపోయింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 2 శాతం క్షీణించింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ వంటి దిగ్గజాలు నష్టపోగా, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ కూడా 3.39 శాతం పడిపోయింది.
దేశీయంగా రుతుపవనాల్లో ప్రస్తుతం 42.2 శాతం భారీ లోటు నమోదైంది. ఒకవేళ ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావం వల్ల వర్షపాతం తగ్గితే, అది ద్రవ్యోల్బణాన్ని పెంచి, గ్రామీణ డిమాండ్ను దెబ్బతీస్తుందనే ఆందోళన ఇన్వెస్టర్లలో మొదలైంది.
వీటితో పాటు.. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాలను స్వీకరించడానికి మొగ్గు చూపారు. దీనికి తోడు అమెరికా బాండ్ యీల్డ్స్ పెరగడంతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) పెట్టుబడులను ఉపసంహరించుకోవడం మార్కెట్ పతనానికి ఆజ్యం పోసింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఫార్మా, హెల్త్కేర్, పవర్ గ్రిడ్ వంటి రక్షణాత్మక రంగాలు మాత్రమే స్వల్ప లాభాలతో మార్కెట్కు కాస్త అండగా నిలిచాయి.
తాజావార్తలు
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
-
Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!