Vodafone Idea: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్ను తెచ్చింది. ప్రీ- పెయిడ్ కస్టమర్ల కోసం ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్పై అదనపు డేటా, ఓటీటీ సదుపాయాల్ని అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వీఐ యూజర్లకు ఈ ఆఫర్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఆగస్టు 28వ తేదీ వరకే ఈ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది అని ప్రకటించింది.
Read Also: Vijayawada Airport: ఢిల్లీ- అమరావతి మధ్య ఇండిగో విమాన సర్వీసులు.. ఎప్పటి నుంచి అంటే..?
అయితే, వొడాఫోన్ ఐడియా అందిస్తున్న ఆరు నెలల రీఛార్జ్ ప్లాన్ రూ.1,749పై 30 జీబీ అదనపు డేటాను ఫ్రీగా అందిస్తుంది. ఈ అదనపు డేటా 45 రోజుల్లోగా వినియోగించుకోవాలి అని సూచించింది. అదే వీఐ అందిస్తున్న రూ.3,499, రూ.3,699, రూ.3,799 .. ఈ వార్షిక ప్లాన్ రీఛార్జితో అదనంగా 50 జీబీ డేటా పొందొచ్చు అని పేర్కొనింది. దీని వ్యాలిడిటీ 90 రోజులు మాత్రమే అని చెప్పుకొచ్చింది. దీంతో పాటు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. డిస్నీ+ హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో.. లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్లపై ఏడాది పాటు సబ్స్క్రిప్షన్ ఫ్రీగా అందిస్తున్నట్లు వెల్లడించింది. వీఐ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకొనే ప్రీ- పెయిడ్ వినియోగదారుల వార్షిక ప్లాన్పై 100 రూపాయల వరకు అదనపు డిస్కౌంట్ పొందొచ్చు అని చెప్పుకొచ్చింది.