Vijaypat Singhania: 12 వేల కోట్ల ఆస్తి నుంచి అద్దె ఇంటి వరకు.. ఓ సంపన్నుడి కన్నీటి కథ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijaypat Singhania: భారత పారిశ్రామిక రంగంలో ఒక శకాన్ని లిఖించిన రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ విజయపత్ సింఘానియా (87) కన్నుమూశారు. శనివారం సాయంత్రం ముంబైలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, రేమండ్ ప్రస్తుత ఛైర్మన్ గౌతమ్ సింఘానియా సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. రూ.12 వేల కోట్ల ఆస్తి నుంచి అద్దె ఇంటి వరకు ఓ సంపన్నుడి కన్నీటి కథ ఎలా సాగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: CM Nitish Kumar: సీఎం నితీష్ కుమార్ రేపు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా..
Also Read
- SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్లు.. పూర్తి వివరాలు
- Subhash Chandra: సుభాష్ చంద్రా చుట్టూ సీబీఐ ఉచ్చు.. రూ.1,322 కోట్ల లోన్ కేసులో ఎఫ్ఐఆర్
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
- Explained: డేటా సునామీ.. దేశంలో జియో ప్రకంపనలకు పదేళ్లు.. ఈ దశాబ్దంలో ఏం మారింది?
రేమండ్ను ప్రపంచస్థాయి బ్రాండ్గా నిలబెట్టిన విజయపత్ సింఘానియా జీవితంలోని 5 ముఖ్యమైన ఘట్టాలు ఇవే..
1. రేమండ్ సామ్రాజ్య నిర్మాత (1980 – 2015)
1938లో జన్మించిన విజయపత్ సింఘానియా, 1980లో రేమండ్ గ్రూప్ పగ్గాలను చేపట్టారు. ఆయన నాయకత్వంలో ఈ సంస్థ కేవలం వస్త్ర వ్యాపారానికే పరిమితం కాకుండా, సుగంధ ద్రవ్యాలు, ఇతర రంగాల్లోకి కంపెనీ విస్తరించింది. 90వ దశకంలోనే రేమండ్ బ్రాండ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనదే.
2. ఆకాశమే హద్దుగా రికార్డులు..
విజయపత్ కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, ఆయనో గొప్ప విమానయాన ప్రియుడు కూడా. శిక్షణ పొందిన పైలట్గా ఆయన అనేక రికార్డులు సృష్టించారు. 2005లో హాట్ ఎయిర్ బెలూన్లో ఏకంగా 21,000 మీటర్ల ఎత్తుకు ఎగిరి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ముంబై షెరీఫ్గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు.
3. పద్మభూషణ్ పురస్కారం
వ్యాపార, విమానయాన రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికి గాను భారత ప్రభుత్వం 2006లో ఆయనను పద్మభూషణ్తో సత్కరించింది. 1994లో భారత వైమానిక దళం ఆయనకు ‘గౌరవ ఎయిర్ కమోడోర్’ బిరుదును ప్రదానం చేసింది.
4. రాజభవనం నుంచి అద్దె ఇంటికి..
విజయపత్ జీవితం ఎందరికో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకప్పుడు రూ.12,000 కోట్ల నికర ఆస్తితో, దేశంలోని అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటిగా పేరొందిన ‘జేకే హౌస్’లో విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. కానీ 2015 తర్వాత పరిస్థితులు మారిపోయి, దక్షిణ ముంబైలోని ఒక అద్దె ఇంట్లో నివసించవలసి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
5. కుమారుడితో ఆస్తి వివాదం.. జీవితంలో చేసిన పెద్ద తప్పు!
2015లో రేమండ్ గ్రూప్ బాధ్యతలను కుమారుడు గౌతమ్ సింఘానియాకు అప్పగించిన తర్వాత, తండ్రీకొడుకుల మధ్య తీవ్రమైన ఆస్తి వివాదాలు తలెత్తాయి. “నా ఆస్తి అంతా కొడుకుకు అప్పగించడమే నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు” అని విజయపత్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. తనను కొడుకు రోడ్డుపైకి తెచ్చాడని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.
READ ALSO: Pakistan: పాకిస్థాన్ ఎయిర్లైన్స్కు గడ్డుకాలం.. ఏ క్షణమైనా మూతపడే ఛాన్స్! ఎందుకో తెలుసుకోండి..
తాజావార్తలు
-
Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
-
Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ దూకుడు..
-
Tilak vs Vaibhav: ఏంటిది వైస్ కెప్టెన్.. వైభవ్ సూర్యవంశీని స్లెడ్జ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్!
-
Mahatma Gandhi: గాంధీగా మారిన మనోజ్ బాజ్పేయి.. ఆ 21 రోజుల కథతో వస్తున్న కొత్త సినిమా!
-
Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!