Adani Group: అదానీకి మరో ఎదురు దెబ్బ.. భారీ ప్రకటన చేసిన ఫ్రెంచ్ దిగ్గజం
- అదానీపై అమెరికా ఎఫ్బీఐ ఆరోపణలు
- అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టేందుకు నిరాకరించిన టోటల్ ఎనర్జీస్
- ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ ఇంధన సంస్థ టోటల్ ఎనర్జీస్
- లంచం ఆరోపణలు క్లియర్ అయ్యే వరకు ఇది కొనసాగుతుందని స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ ఇంధన సంస్థ టోటల్ ఎనర్జీస్ భారీ ప్రకటన చేసింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడుల్లో భాగంగా కొత్తగా ఎలాంటి పెట్టుబడులు పెట్టబోమని సోమవారం తెలిపింది. గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలు క్లియర్ అయ్యే వరకు ఇది కొనసాగుతుందని తెలిపింది. అవినీతి విచారణ గురించి తమకు తెలియదని ఇంధన సంస్థ పేర్కొంది. బిలియనీర్ గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారులలో టోటల్ ఎనర్జీస్ ఒకటి. ఇది ఇంతకుముందు గ్రూప్ యొక్క పునరుత్పాదక ఇంధన వెంచర్ అదానీ గ్రీన్ ఎనర్జీ (AEGL), సిటీ గ్యాస్ యూనిట్ అదానీ టోటల్ గ్యాస్ (ATGL) లో వాటాలను కైవసం చేసుకుంది.
అదానీ గ్రూప్ కంపెనీల్లో టోటల్ ఎనర్జీస్ ప్రధాన వాటాదారు.
అదానీ గ్రీన్ ఎనర్జీలో టోటల్ ఎనర్జీస్ 19.75 శాతం వాటాను కలిగి ఉంది. ఇది గౌతమ్ అదానీ నేతృత్వంలోని భారతీయ సమ్మేళనాకి చెందిన సహజ వనరుల ద్వారా విద్యుత్తును తయారు చేసే విభాగం. ఏఈజీఎల్ (AEGL)తో కలిసి సౌర, పవన శక్తి నుంచి కరెంట్ను తయారు చేస్తాయి. ఈ జాయింట్ వెంచర్ కంపెనీలలో 50 శాతం వాటాను కలిగి ఉంది. అదానీ టోటల్ గ్యాస్లో ఫ్రెంచ్ సంస్థ 37.4 శాతం వాటాను కలిగి ఉంది. ఇది ఆటోమొబైల్స్కు సీఎన్జీ (CNG) విక్రయిస్తుంది. వంట కోసం ఇళ్లకు పైపుల ద్వారా సహజ వాయువును సరఫరా చేస్తుంది.
Also Read
- AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
- Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
- Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
- Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
ఇప్పటికే పెట్టుబడులను నిషేధించిన కంపెనీ..
“అదానీపై వచ్చిన లంచం ఆరోపణలు .. మా కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి. టోటల్ ఎనర్జీస్ ఇలాంటి అవినీతిని ప్రోత్సహించదు. ” అని ఫ్రెంచ్ దిగ్గజం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా.. జనవరి 2021లో, టోటల్ ఎనర్జీస్ లిస్టెడ్ కంపెనీ ఏఈజీఎల్ లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఇప్పుడు అది 19.75 శాతం వాటాదారు. భారత్లో సహజ వనరుల ద్వారా విద్యుత్తును ఉత్పత్తిని ప్రక్రియలో భాగంగా మూడు జాయింట్ వెంచర్లలో 50 శాతం వాటాను కూడా కొనుగోలు చేసింది.
అదానీపై వచ్చిన ఆరోపణలు ఏంటి..
భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకొనేందుకు గౌతమ్ అదానీ, మరో ఏడుగురుతో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా ఎఫ్బీఐ చెబుతోంది. అదే సమయంలో బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణల్లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండటంతో ఆ దేశం దర్యాప్తు ప్రారంభించింది. ముఖ్యంగా రెండు అంశాలకు సంబంధించినవి. 2 బిలియన్ డాలర్ల విలువైన రెండు సిండికేట్ రుణాలకు సంబంధించిన అంశం వీటిల్లో ఒకటి. ఇక అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన భరోసాను చూపి అమెరికా, ఇతర ప్రదేశాల్లోని మదుపర్లకు ఆఫర్ చేసిన 1 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లకు సంబంధించినది రెండో ఆరోపణ.
తాజావార్తలు
-
Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
-
Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!