Telangana Company: తెలంగాణ కంపెనీకి ‘మహా’ ఆర్డర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Company: హైదరాబాద్లోని ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్కి మహారాష్ట్ర నుంచి 185 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్ వచ్చింది. 123 బస్సుల మ్యానిఫ్యాక్షరింగ్, మెయింటనెన్స్ బాధ్యతలను థానే మునిసిపల్ ట్రాన్స్పోర్ట్ అప్పగించింది. ఈ బస్సులను 9 నెలల్లో తయారుచేసి అందించాలని, 15 ఏళ్లపాటు నిర్వహణ చూసుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. లిథియం అయాన్లతో రూపొందించే ఈ బస్సుల బ్యాటరీలను నాలుగు గంటల్లోనే రీఛార్జ్ చేయొచ్చు. 55 బస్సులను 12 మీటర్ల పొడవున, 68 బస్సులను 9 మీటర్ల పొడవున తయారుచేయనున్నారు.
కిమ్స్లోని షేర్ల అమ్మకం
Also Read
- Reliance Industries: రిలయన్స్ ఇన్వెస్టర్లకు పండగ.. ఐదు రోజుల్లోనే రూ.24 వేల కోట్ల సంపద
- TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
- LIC: ఎల్ఐసీ నుంచి జీవన్ సాథి పేరుతో రెండు కొత్త ప్లాన్లు.. మార్కెట్ రిస్క్ లేకుండా గ్యారంటీ బెనిఫిట్స్
- CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోని 12 లక్షలకు పైగా షేర్లను జనరల్ అట్లాంటిక్ సింగపూర్ విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ షేర్లను 151 కోట్ల 25 లక్షల రూపాయలకు ఓపెన్ మార్కెట్లో అమ్మినట్లు తెలుస్తోంది. ఒక్కో షేర్ యావరేజ్గా 12 వందల 50 రూపాయలు పలికినట్లు బీఎస్ఈ బల్క్ డీల్స్ని బట్టి అర్థమవుతోంది. ఈ నెలారంభంలో కూడా ఈ సంస్థ పదహారున్నర లక్షలకు పైగా షేర్లను విక్రయించిన సంగతి తెలిసిందే. తొలి త్రైమాసికం ముగిసేనాటికి కిమ్స్లో జనరల్ అట్లాంటిక్కి 17 పాయింట్ రెండు నాలుగు శాతం వాటా ఉంది.
RBI Orders: అర్బన్ కోపరేటివ్ బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు
‘రూపాయి-రియాల్స్’లో చెల్లింపులు
ఇండియా కరెన్సీ రూపాయి, సౌదీ అరేబియా కరెన్సీ రియాల్స్లో వాణిజ్య చెల్లింపులు చేసేందుకు అవసరమైన వ్యవస్థ ఏర్పాటు కోసం ఈ రెండు దేశాలు లేటెస్టుగా చర్చలు జరిపాయి. దీంతోపాటు ఆ గల్ఫ్ దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సిస్టమ్ను మరియు రూపే కార్డును ప్రవేశపెట్టే విషయం కూడా ఇరు దేశాల మధ్య చర్చకు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ఈ నెల 18 మరియు 19 తేదీల్లో సౌదీ అరేబియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన వివిధ అంశాలపై సౌదీ అరేబియాతో చర్చలు జరిపారు. అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులను ఇకపై రూపాయల్లో చేయాలని ఆర్బీఐ ఈమధ్య నిర్ణయించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Bandla Ganesh: ‘టెంపర్’ సినిమా ఇప్పుడు తీస్తే రూ.1000 కోట్లు వసూలు చేస్తుంది: నిర్మాత బండ్ల గణేష్
-
Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం
-
West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..
-
RR VS MI: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. అందరి కళ్లు వైభవ్ సూర్యవంశీ వైపే..
-
Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?