TCS: ఐటీకి ఏమైంది..? ఆఫర్ లెటర్స్ ఇచ్చినా ఆన్బోర్డింగ్ లేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS: ఐటీ సంస్థలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థికమాంద్యం భయాల కారణంగా, ఆదాయం తగ్గడంతో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్ వంటి సంస్థలు వేలాదిగా ఉద్యోగులను తొలగించాయి. అయితే ఈ పరిణామాలు ఇండియాపై పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే ప్రస్తుత పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిన్ తన ఉద్యోగులకు వేతన పెంపును వాయిదా వేసినట్లు అనధికార వార్తలు వినిపిస్తున్నాయి.
ఐటీ రంగంలో కోవిడ్-19, ఆర్థిక మాంద్యం పరిస్థితులు గందరగోళానికి కారణం అవుతున్నాయి. ఇప్పటికే పలు స్టార్టప్ కంపెనీలు మూతపడ్డాయి. కొన్ని కంపెనీలు ఆఫర్ లెటర్లు ఇచ్చినా, జాయినింగ్ లెటర్లు ఇవ్వడానికి సతమతం అవుతున్నాయి. ఒక వేళ ఆఫర్ లెటర్లు ఇచ్చినా, కంపెనీ ప్రాజెక్టుల్లో పనిచేయించుకోవడం లేదు.
Also Read
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
Read Also: Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు జీతాల పెంపు వాయిదా..!
ఇదిలా ఉంటే మరో దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ లేటరల్ హైరింగ్ పేరుతో నియమించుకున్న ఉద్యోగుల ఆన్బోర్డింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో 200 మంది ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. జాయినింగ్ లెటర్లు ఇచ్చి, సంస్థలోకి ఆహ్వానించింది, ఇప్పుడు ఆ ఉద్యోగుల ఆన్బోర్డింగ్ ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.
టీసీఎస్ లేటరల్ హైరింగ్ పేరుతో నియమించుకున్న ఉద్యోగుల్ని 3 నెలల పాటు ప్రాజెక్టుల్లోకి తీసుకోవడం లేదని తెలుస్తోందది. కొత్త ప్రాజెక్టులు లేకపోవడం, ఆర్థికమాంద్యం వస్తుందనే భయాలు, ఆర్థిక అనిశ్చితి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. బెంగళూర్, పూణే, కొచ్చి, ఢిల్లీ, భువనేశ్వర్, ఇండోర్ కి చెందిన పలువురు ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడనుంది. వీరందరికి 1.8 ఏళ్ల నుంచి 15 ఏళ్ల అనుభవం ఉన్నవారే అని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
మరోవైపు జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో నియమించుకున్న వారందరికీ ఇప్పటికే 2,3 సార్లు జాయినింగ్ డేట్స్ ఇచ్చి పోస్ట్పోన్ చేసింది. అక్టోబర్ వరకు జాయినింగ్ డేట్స్ ఇవ్వలేమని ఇటీవల అభ్యర్థులకు కంపెనీ మెయిల్స్ పెట్టినట్లు సమాచారం. అయితే ఈ విషయాలపై టీసీఎస్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
-
Kalki 2898 AD : ప్రభంజనం.. ఏకంగా రెండు జాతీయ అవార్డులు కైవసం!
-
Toxic: కియారాని వెనకేసుకొస్తున్న బ్రిటిష్ నటుడు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!